Kakani Govardhan Reddy: దళితులంటే ముందునుంచి చంద్రబాబుకు చిన్న చూపే: మంత్రి కాకాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళితులంటే ముందునుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు చిన్న చూపే అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సీఎం జగన్ హామీ ఇచ్చి.. అమలు చేశారన్నారు. జనవరి 8 నుంచి 19 వరకూ మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తాం అని మంత్రి కాకాని తెలిపారు. నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నేతల సమావేశం జరిగింది. జనవరి 19న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కార్యక్రమాల నిర్వహణపై చర్చ సాగింది.
సమావేశంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చిరంజీవి రెడ్డి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కామరాజు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… ‘విజయవాడలోని స్వరాజ్ మైదానంలో డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించనున్నారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించే ప్రాంతాన్ని టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేస్తున్నాం. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి అమలు చేయలేదు. దళితులంటే ముందునుంచి చంద్రబాబుకు చిన్న చూపే’ అని విమర్శించారు.
Also Read
- Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
Also Read: Soft water Jobs Fraud: సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ టోకరా.. లక్షలు గుంజిన వ్యక్తి!
‘డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సీఎం జగన్ హామీ ఇచ్చి అమలు చేశారు. జనవరి 8 నుంచి 19 వరకూ మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తాం. జిల్లాలోని అంబేద్కర్ విగ్రహాలను సుందరంగా తీర్చి దిద్దుతాం. వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు ఇస్తాం. చర్చా వేదికలు ఏర్పాటు చేసి అంబేద్కర్ సేవలను ప్రజల్లోకి తీసుకెళతాం’ అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!