Kakani Govardhan Reddy: దళితులంటే ముందునుంచి చంద్రబాబుకు చిన్న చూపే: మంత్రి కాకాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళితులంటే ముందునుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు చిన్న చూపే అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సీఎం జగన్ హామీ ఇచ్చి.. అమలు చేశారన్నారు. జనవరి 8 నుంచి 19 వరకూ మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తాం అని మంత్రి కాకాని తెలిపారు. నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నేతల సమావేశం జరిగింది. జనవరి 19న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కార్యక్రమాల నిర్వహణపై చర్చ సాగింది.
సమావేశంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చిరంజీవి రెడ్డి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కామరాజు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… ‘విజయవాడలోని స్వరాజ్ మైదానంలో డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించనున్నారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించే ప్రాంతాన్ని టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేస్తున్నాం. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి అమలు చేయలేదు. దళితులంటే ముందునుంచి చంద్రబాబుకు చిన్న చూపే’ అని విమర్శించారు.
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
Also Read: Soft water Jobs Fraud: సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ టోకరా.. లక్షలు గుంజిన వ్యక్తి!
‘డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సీఎం జగన్ హామీ ఇచ్చి అమలు చేశారు. జనవరి 8 నుంచి 19 వరకూ మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తాం. జిల్లాలోని అంబేద్కర్ విగ్రహాలను సుందరంగా తీర్చి దిద్దుతాం. వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు ఇస్తాం. చర్చా వేదికలు ఏర్పాటు చేసి అంబేద్కర్ సేవలను ప్రజల్లోకి తీసుకెళతాం’ అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!