Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Jogi Ramesh Sensational Comments On Pawan Kalyan Over Mudragada Padmanabham Letter

Jogi Ramesh: ఆ లేఖను చదివితే పవన్‌ వెంటనే ఏపీ వదిలి పారిపోతారు..!

Published Date :June 20, 2023 , 5:01 pm
By Sudhakar Ravula
Jogi Ramesh: ఆ లేఖను చదివితే పవన్‌ వెంటనే ఏపీ వదిలి పారిపోతారు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jogi Ramesh: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ లేఖ రాయడం ఏపీ రాజకీయాల్లో మరింత కాకరేపుతోంది.. వీధి రౌడీ భాషలో మాట్లాడటం ఎంతవరకు న్యాయమని పవన్‌ను లేఖలో నిలదీసిన ముద్రగడ.. పవన్‌ మాట్లాడే భాష వల్ల నష్టం తప్ప లాభం లేదన్నారు. ఇప్పటివరకు ఎంతమందిని చెప్పుతో కొట్టారో.. గుండ్లు గీయించారో చెప్పాలని ప్రశ్నించారు. అయితే, ఈ వ్యవహారంపై హాట్‌ కామెంట్లు చేశారు మంత్రి జోగు రమేష్.. ముద్రగడ లేఖను పవన్‌ కల్యాణ్‌ చదివితే వెంటనే ఏపీ నుంచి పారిపోతారని పేర్కొన్నారు.. ముద్రగడ విలువలు ఉన్న వారు గనుక విలువల గల లేఖ రాశారని చెప్పుకొచ్చారు.. పవన్ కల్యాణ్‌కి సినిమాలు, కాల్ షీట్లు లేవు.. అందుకే ఇక్కడ చంద్రబాబు డైరెక్షన్‌లో యాక్షన్‌ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.. దీనికి కో డైరెక్టర్ నాదెండ్ల మనోహర్ అని సెటైర్లు వేశారు.

Read Also: New Party in AP: ఏపీలో కొత్త పార్టీ.. లిరిసిస్ట్ జొన్నవిత్తుల కీలక ప్రకటన

పవన్‌ కల్యాణ్‌ సీఎం.. సీఎం అని గతంలో ఆయన అభిమానులు అరిచారు.. అది అయిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే అవుతా ఎవరు అవుతారో చూస్తా అంటున్నారు. ఎమ్మెల్యే కావడం కోసం తాపత్రయ పడుతున్నారని దుయ్యబట్టారు. 2014 నుంచి 2019 వరకు ఏ వేషాలు వేశారో ప్రజలకు తెలుసు.. పవన్ బాగా తిరగాలన్నారు. వంగవీటి మోహన్ రంగా పేదల కోసం పోరాటం చేస్తుంటే టీడీపీ గుండాలు ఆయనను పొట్టన పెట్టుకున్నారు.. రంగా హత్య కు చంద్రబాబు కారణం అని హరి రామయ్య జోగయ్య పుస్తకాలు రాశారు. ముద్రగడ కుటుంబ సభ్యులను కొట్టుకుంటు చంద్రబాబు హయాంలో లాక్కెళ్లారు. అలాంటి చంద్రబాబుకి ఓటు వేయమని పవన్ చెబుతారా? అని ప్రశ్నించారు. కాపులను గుండెల్లో పెట్టుకున్న వ్యక్తి వైస్సార్, జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు.

Read Also: Kurasala Kannababu: 90 శాతం కాపుల మద్దతు జగన్‌కే.. ఫ్యాన్స్‌ కోసమే పవన్‌ యాత్ర..!

రేపల్లెలో మృతి చెందిన అమర్నాథ్‌ కుటుంబాన్ని పరామర్శించడానికి చంద్రబాబు ఊరేగింపుగా, గుంపుగా వెళ్లాడు అని మండిపడ్డారు మంత్రి జోగి రమేష్‌.. అక్కడకు వెళ్లి చంద్రబాబు ఓట్లు అడుగుతున్నారు. మరణించిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి , మాకు జిందాబాద్‌ కొట్టాలని చంద్రబాబు అంటారు అని ఎద్దేవా చేశారు. అమర్నాథ్‌ ను హతమార్చిన ముద్దాయిలను అరెస్ట్ చేశాం. కానీ, చంద్రబాబు శవ రాజకీయం చేస్తున్నారని.. కులాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. అమర్నాథ్‌ కుటుంబానికి ఆర్థిక సాయం చేశాం.. ఇంటి స్థలం ఇచ్చాం.. పార్టీలు, కులాల గొడవలతో సంబంధం లేదని అమర్నాథ్ తల్లి చెప్పారని వెల్లడించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తాం.. నిందితులపై చర్యలు తీసుకుంటామన్న ఆయన.. చంద్రబాబు పరామర్శకు వెళ్లారా? శవాలపై పేలాలు ఎరుకోవడానికి వెళ్లారా? అని నిలదీశారు.

Read Also: Bhatti Vikramarka : కృష్ణా జలాలు రాకుండా అడ్డుపడింది బీఆర్‌ఎస్‌ పార్టీనే

ఇక, ఆడపిల్లల అనురాగం మాకు, మా సీఎంకి తెలుసన్నారు జోగి రమేష్.. ఆడ పిల్లలు లేని వారు చంద్రబాబు, లోకేష్‌ అని.. రిషితేశ్వరి హత్య కేసులో నిందితుల పక్షాన ఉంది చంద్రబాబు, టీడీపీ నేతలు కాదా? అని ప్రశ్నించారు. ఎమ్మార్వో వనజాక్షిని కొట్టుకుంటూ వెళ్లింది మీ ఎమ్మెల్యే చింతమనేని కాదా? అని నిలదీశారు. 2019 ఎన్నికల్లో మహిళలు చంద్రబాబుకి బుద్ధి చెప్పారు. చంద్రబాబు పొర్లు దండాలు పెట్టిన బీసీలు నమ్మరని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌, చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేయొద్దు.. ప్రతిపక్షాలు చేయడానికి ఏమి లేఖ శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే, లోకేష్ పాక్కుంటా తిరిగినా, పవన్ కల్యాణ్‌ వారాహి వాహనంలో తిరిగిన ప్రజలు నమ్మరు.. మరోసారి వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మంత్రి జోగి రమేష్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • janasena
  • kapu
  • Minister Jogi Ramesh
  • Mudragada Padmanabham

తాజావార్తలు

  • AP Weather Alert: అలర్ట్.. 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!

  • Bandla Janani: బండ్ల ఇంట పెళ్లి సందడి.. కాబోయే అల్లుడితడే..

  • Bengal hostage row: ఎంఐఎం నాయకుడే మల్దా ఘటన సూత్రధారి.. పారిపోతుండగా అరెస్ట్..

  • Haier Desert Rose AC: భారతదేశపు మొట్టమొదటి సెల్ఫ్-క్లీనింగ్ ఏసీ ప్రారంభం.. 10 సెకన్లలో చల్లని గాలి

  • Yuvraj Singh: “ఎక్కడి నుంచో వచ్చాడు.. కెప్టెన్ అయ్యాడు”.. ధోనిపై యూవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions