Minister Jagadish Reddy: తమిళిసై గవర్నర్ అయ్యే టైంకి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్సీ తిరస్కరణ అంశంపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. గవర్నర్ తమిళిసై తప్పుడు నిర్ణయం తీసుకుని సెల్ఫ్ గోల్ చేసుకున్నారు.. ఆమె గవర్నర్ అయ్యే సమయానికి తమిళనాడు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు అంటూ ఆయన మండిపడ్డారు. ప్రకటన తరవాత బీజేపీకి రాజీనామా చేశారు.. బీజేపీ నుంచి గవర్నర్ గా వచ్చి ఎదుటి వారిని పార్టీ పేరుతో తిరస్కరించడం సమంజసం కాదు.. గవర్నర్ తమిళిసై తీరు గురువింద తీరుని తలపిస్తుంది.. గవర్నర్ చెప్పే లెక్క ఆమెకూ వర్తిస్తుంది.. నీతులు చెప్పే గవర్నర్ నైతిక విలువలు పాటిస్తారని ఆశిస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.
Read Also: Heavy Rain Forecast: భారీ వర్ష సూచన.. ఏపీలో 9 జిల్లాలకు, తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్
Also Read
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Akhil Raj: "డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు".. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
- SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
- Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
ఇక, అంతకు ముందు మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిలబడిన వీరనారి చాకలి ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా సూర్యాపేట కలెక్టరేట్లో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ సాహసమే తెలంగాణ సమాజానికి స్పూర్తి.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆమె చూపించిన తెగువ ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిందని ఆయన అన్నారు.
Read Also: NC23: క్యాస్టింగే కాదు మ్యూజిక్ కు కూడా స్టార్ నే దింపుతున్నట్టున్నారే..?
తమ హక్కుల కోసం కొట్లాడే వారికి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఐలమ్మ స్ఫూర్తితోనే రాష్ట్రంలో కేసీఆర్ పాలన కొనసాగుతుంది.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాయి.. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలో ఐలమ్మ పోరాట స్ఫూర్తితో అధిగమించాలని ఆయన సూచించారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ పోరాటయోధులకు సముచిత గౌరవం లభించిందన్న మంత్రి జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఐలమ్మ ఆశయాలను నెరవేర్చడమే ఆమెకు మనమంతా ఇచ్చే అసలైన నివాళి అని అన్నారు.
తాజావార్తలు
-
OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Ramba Urvashi Menaka: 14 ఏళ్ల తర్వాత ఫాంటసీ జానర్లోకి అల్లరి నరేష్ .. రిలీజ్ డేట్ ఫిక్స్
-
Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
-
Akhil Raj: “డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు”.. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?