Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Komaram Bheem Minister Indrakaran Reddy About Komuram Bheem

Indrakaran Reddy : అమరుడు కుమ్రం భీం పోరాట ప్రదేశం జోడేఘాట్‌ను అన్ని హంగులతో అభివృద్ది చేశాం

Published Date :October 9, 2022 , 3:10 pm
By Gogikar Sai Krishna
Indrakaran Reddy : అమరుడు కుమ్రం భీం పోరాట ప్రదేశం జోడేఘాట్‌ను అన్ని హంగులతో అభివృద్ది చేశాం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Indrakaran reddy about komuram Bheem

ఆదివాసీల ఆరాధ్యదైవం కుమ్రం భీం 82వ వర్ధంతిని పురస్కరించుకుని అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘన నివాళులర్పించారు. జోడేఘాట్‌లో కొమురం భీం సమాధికి, ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రాంతం గురించి అప్పటి పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. సీఎం కేసీఆర్ ఈ ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. కుమ్రం భీం జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.. అమరుడు కుమ్రం భీం పోరాట ప్రదేశం జోడేఘాట్‌ను అన్ని హంగులతో అభివృద్ది చేశాం. కుమ్రం భీం స్మారక చిహ్నం, స్మృతి వనం, గిరిజన మ్యూజియం ఏర్పాటు చేసి, భీం పోరాట పటిమను భవిష్యత్ తరాలకు తెలియపరిచే విధంగా, అన్ని సౌకర్యాలను జోడెఘాట్‌లో కల్పించాం. పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ పై కుమ్రం భీం విగ్రహాన్ని ప్రతిష్టించాము. ఆదివాసీల ఆత్మగౌరవాన్ని తెలిపేలా రూ.55 కోట్లతో ఆదివాసీ భవనాన్ని నిర్మించి, ప్రారంభించుకున్నాం.

 

గిరిజనులకు విద్యా, ఉపాధి అవకాశాల్లో 6 శాతం ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రం భీం చేసిన సేవలకు గుర్తుగా కుమ్రం భీం- ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం. వట్టి వాగు, చెలిమెల వాగు ప్రాజెక్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. రెండవ దశలో మరికొన్ని చెక్ డ్యాముల నిర్మాణానికి త్వరలోనే అనుమతులు మంజూరు చేస్తాం. హట్టి నుంచి జోడేఘాట్ వరకు 15 కిలోమీటర్ల మేర తారు రోడ్డును నిర్మింకున్నాం. గిరిజనులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోడు సమస్య పరిష్కారానికి సీఎం కేసీఅర్ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసింది. ప్రస్తుతం దీనిపై హై కోర్ట్ స్టే విధించింది. ప్రస్తుతానికి పోడు భూముల సర్వే పనులు కొనసాగుతున్నాయి. కోర్టు తదుపరి ఉత్తర్వులననుసరించి అర్ఓఎఫ్ ఆర్ పట్టాలు జారీ చేస్తాం. ప్రతీ సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా దండారీ ఉత్సవాలకు కోటి రూపాయలు మంజూరు చేశాం.

 

స్థానిక నేతల విజ్ఞప్తి మేరకు ఆదివాసీల గూడేల్లో కొత్తగా 100 దేవాలయాల నిర్మాణాలకు ఒక్కొక్క దేవాలయానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేసేందుకు దేవాదాయ శాఖ అనుమతినిచ్చింది. గిరిజన తెగల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. సీఎం కేసీఅర్ దృష్టికి వారి సమస్యలను తీసుకెళ్లి త్వరలోనే సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తాం.. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్, ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి, మాజీ ఎంపీ నగేష్, ఇతర ప్రజాప్రతనిధులు, తదితరులు పాల్గొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • indra karan reddy
  • komuram bheem
  • latest news

తాజావార్తలు

  • RC17 Update: మార్చి 27.. సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం!

  • Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా పరిస్థితి విషమం.. తాజా అప్‌డేట్ ఏంటంటే!

  • Iran War Impact on Pakistan: ఇరాన్‌ యుద్ధం ఎఫెక్ట్‌.. పాకిస్తాన్‌లో సంక్షోభం..!

  • BCCI: 2027 వన్డే వరల్డ్ కప్‌పై బీసీసీఐ ఫోకస్.. రోహిత్, కోహ్లీ కోసం స్పెషల్ ప్లాన్ రెడీ..

  • Team India Squad: టీమిండియాలో పెను మార్పులు.. రాహుల్, పంత్, జడేజా భవిష్యత్తుపై అనిశ్చితి!

ట్రెండింగ్‌

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions