Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Dola Bala Veeranjaneya Swamy Meeting With Officials Of Six Mandals In Kondepi Constituency Of Prakasam District

Minister Bala Veeranjaneya Swamy: మాది ఉద్యోగస్తుల ఫ్లెండ్రీ సర్కార్.. పథకాలు ప్రజలకు అందడంలో వారే కీలకం

Published Date :June 29, 2024 , 6:29 pm
By Sudhakar Ravula
  • మాది ఉద్యోగస్తుల ఫ్లెండ్రీ సర్కార్‌ అన్నారు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి..
  • ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడంలో ఉద్యోగులదే కీలక పాత్ర అన్నారు..
Minister Bala Veeranjaneya Swamy: మాది ఉద్యోగస్తుల ఫ్లెండ్రీ సర్కార్.. పథకాలు ప్రజలకు అందడంలో వారే కీలకం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Bala Veeranjaneya Swamy: మాది ఉద్యోగస్తుల ఫ్లెండ్రీ సర్కార్‌.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడంలో వారిదే కీలక పాత్ర అన్నారు రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి.. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని ఆరు మండలాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. సమావేశంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం జులై 1వ తేదీన ఉదయం 6 గంటలకే పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలి.. సాయంత్రం 5 గంటల కల్లా పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా సీజనల్ వ్యాధులకు సంబంధించి ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు తీసుకోవాలన్నారు.. రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి ఉద్యోగస్తులు సహకరించాలని కోరారు.. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడు, ఇప్పుడు ఉద్యోగస్తులతో ఫ్రెండ్లీ గానే ఉంటుందని.. దానికి తగినట్టు ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి అందజేయడంలో ఉద్యోగస్తులు కీలకంగా పని చేయాలని సూచించారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి.

Read Also: Pension Distribution: పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌.. రూ.4,400 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

Also Read

  • PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్‌కు‌ డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..
  • AP Mobile Alert: మొబైల్‌లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!
  • Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్‌లో కలకలం..
  • RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..

కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జులై 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి సిద్ధం అవుతోంది.. పెన్షన్ల పంపిణీ నిమిత్తం ఇప్పటికే రూ. 4,400 కోట్ల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం.. జులై 1వ తేదీన 65.18 లక్షల మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి ఫించన్లు పంపిణీ చేపట్టాలని స్పష్టం చేశారు ఏపీ సీఎస్.. ఫించన్ల పంపిణీకి ఇతర ఫంక్షనరీల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు.. జిల్లా కలెక్టర్లు, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు.. పెన్షన్ల పంపిణీపై గంట గంటకూ పర్యవేక్షించాలని ఆదేశించారు. సోమవారం ఉదయం 6 గంటలకే పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ జులై 1వ తేదీన 90 శాతానికి పైగా పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసిన డబ్బులను ఇవాళ రాత్రిలోగా విత్ డ్రా చేసుకోవాలని సూచించారు సీఎస్. అయితే, ఎన్నికల్లో పెన్షన్‌ను పెంచనున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం విదితమే.. దాని అనుగుణంగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆ ఫైల్‌పై సంతకం చేశారు.. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మూడు వేల పించన్ నాలుగు వేలకు పెంచింది కూటమి సర్కారు.. ఏప్రిల్ నెల నుంచే పెంచిన మొత్తాన్ని ఇస్తామని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేయగా.. ఆ ప్రకారం జులై నెలకు ఇచ్చే నాలుగు వేల ఫించన్ తోపాటు గడచిన మూడు నెలలకు ఇవ్వాల్సిన మూడు వేల రూపాయలను కలిపి లబ్ధిదారులకు ఇవ్వనున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Kondepi
  • Minister Dola Bala Veeranjaneya Swamy
  • Prakasam District

తాజావార్తలు

  • RBI Gold Reserves: భారత్‌కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ

  • PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్‌కు‌ డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..

  • AP Mobile Alert: మొబైల్‌లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!

  • Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్‌లో కలకలం..

  • Palakura Ullikaram Recipe : పాలకూర ఉల్లికారం.. అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే రుచి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions