Minister Bala Veeranjaneya Swamy: మాది ఉద్యోగస్తుల ఫ్లెండ్రీ సర్కార్.. పథకాలు ప్రజలకు అందడంలో వారే కీలకం
- మాది ఉద్యోగస్తుల ఫ్లెండ్రీ సర్కార్ అన్నారు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి..
- ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడంలో ఉద్యోగులదే కీలక పాత్ర అన్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Bala Veeranjaneya Swamy: మాది ఉద్యోగస్తుల ఫ్లెండ్రీ సర్కార్.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడంలో వారిదే కీలక పాత్ర అన్నారు రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి.. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని ఆరు మండలాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. సమావేశంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం జులై 1వ తేదీన ఉదయం 6 గంటలకే పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలి.. సాయంత్రం 5 గంటల కల్లా పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా సీజనల్ వ్యాధులకు సంబంధించి ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు తీసుకోవాలన్నారు.. రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి ఉద్యోగస్తులు సహకరించాలని కోరారు.. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడు, ఇప్పుడు ఉద్యోగస్తులతో ఫ్రెండ్లీ గానే ఉంటుందని.. దానికి తగినట్టు ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి అందజేయడంలో ఉద్యోగస్తులు కీలకంగా పని చేయాలని సూచించారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి.
Read Also: Pension Distribution: పెన్షన్దారులకు గుడ్న్యూస్.. రూ.4,400 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
Also Read
- Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
- TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
- INDW Vs PAKW: రీచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్.. పాకిస్థాన్ ముందు భారత్ టార్గెట్ ఎంతంటే..
- Harmanpreet Kaur: రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన హర్మన్ప్రీత్ కౌర్.. దేశ చరిత్రలోనే తొలి ప్లేయర్గా..
కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జులై 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి సిద్ధం అవుతోంది.. పెన్షన్ల పంపిణీ నిమిత్తం ఇప్పటికే రూ. 4,400 కోట్ల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం.. జులై 1వ తేదీన 65.18 లక్షల మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి ఫించన్లు పంపిణీ చేపట్టాలని స్పష్టం చేశారు ఏపీ సీఎస్.. ఫించన్ల పంపిణీకి ఇతర ఫంక్షనరీల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు.. జిల్లా కలెక్టర్లు, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు.. పెన్షన్ల పంపిణీపై గంట గంటకూ పర్యవేక్షించాలని ఆదేశించారు. సోమవారం ఉదయం 6 గంటలకే పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ జులై 1వ తేదీన 90 శాతానికి పైగా పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేసిన డబ్బులను ఇవాళ రాత్రిలోగా విత్ డ్రా చేసుకోవాలని సూచించారు సీఎస్. అయితే, ఎన్నికల్లో పెన్షన్ను పెంచనున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం విదితమే.. దాని అనుగుణంగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆ ఫైల్పై సంతకం చేశారు.. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మూడు వేల పించన్ నాలుగు వేలకు పెంచింది కూటమి సర్కారు.. ఏప్రిల్ నెల నుంచే పెంచిన మొత్తాన్ని ఇస్తామని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేయగా.. ఆ ప్రకారం జులై నెలకు ఇచ్చే నాలుగు వేల ఫించన్ తోపాటు గడచిన మూడు నెలలకు ఇవ్వాల్సిన మూడు వేల రూపాయలను కలిపి లబ్ధిదారులకు ఇవ్వనున్నారు.
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
-
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
-
CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
-
TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!