Minister Dharmana Prasada Rao: వైసీపీ ప్రభుత్వం వద్దనుకుంటే.. మీ పీక మీరు కోసుకోవడమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Dharmana Prasada Rao: శ్రీకాకుళంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. మహిళలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆయన.. వైసీపీని వ్యతిరేకించడం అంటే గొప్ప అనుకోకండి.. వైసీపీ ప్రభుత్వం వద్దనుకుంటే మీ పీక మీరు కోసుకోవడమే, మీచేతిని మీరు నరుక్కొవడమే అన్నారు.. సీఎం వైఎస్ జగన్ ఓడిపోతే ఆడవాళ్లకి ఎంత చేశాడు, అడోళ్లు ఆడోళ్లు అనుకొని చచ్చాడురా అంటారు. తరువాత వచ్చిన ప్రభుత్వం ఆడవాళ్లని పట్టించుకోదన్నారు. సమాజంలో మహిళలకు ఇంత గౌరవం ఇచ్చిన ప్రభుత్వాన్ని వద్దనుకుంటే ఏం చేయాలి.? అని ప్రశ్నించారు. నూనె ,గ్యాస్ , కరెంట్ పెరగాయంటూ మాట్లాడుతున్నారు.. దేశం మొత్తం పెరిగాయి , మనవద్దే కాదని తెలిపారు.. ధరలు పెరిగినా తట్టుకునేలా మీ ఎకౌంట్స్ లో డబ్బు జమచేస్తున్నాం. ఇతర రాష్ర్టాలలో , గత ప్రభుత్వాలలో ఇలాజరగలేదు కదా? అని ప్రశ్నించారు.. మహిళలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు మంత్రి ధర్మాన.
మరోవైపు.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన.. చంద్రబాబు నాయుడు ఏదో ఒక పేరు పెట్టి… వాళ్లకి రూ.371 కోట్లు డబ్బు ఇచ్చాడు. చంద్రబాబు చెప్పిన సంస్థకు కాకుండా బోగస్ సంస్థకు ఆ డబ్బు వెళ్ళిందనీ కేంద్ర ప్రభుత్వ సంస్థ దాన్ని పట్టుకుందన్నారు. బోగస్ సంస్థ నుండి సెల్ కంపెనీలకు.. అక్కడ నుండి ఆ డబ్బు చంద్రబాబు పీఏ, లోకేష్ పీఏ అకౌంట్లకి వచ్చాయని పట్టుకున్నారని.. వాళ్లని పట్టుకుందామనీ వెళ్తే ఒకడు దుబాయికి, ఇంకొకడు అమెరికాకి పారిపోయారని వెల్లడించారు.. వాళ్లని పట్టుకుంటే ఈ డబ్బు ఎక్కడికెళ్లిందో తేలిపోతుందన్నారు.
Also Read
ఇక, ప్రజా జీవితంలో ఉన్నవాడు డబ్బులు ఇలా తినేస్తే ఊరుకోరు అని హెచ్చరించారు ధర్మాన.. మేమందరం కోర్టుమందు విచారణకు నిలబడిన వాళ్ళమే గతంలో.. ప్రజా ధనం దుర్వినియోగం అయ్యిందని ఒక సంస్థ చెబితే నమ్మేస్తారు.. నువ్వు జనం ముందు దబాయించటం కాదు.. కోర్టులో రుజువు చేసుకోవాలని సలహా ఇచ్చారు. అప్పటి ప్రభుత్వంలో డబ్బంతా ఇతరుల అకౌంట్లకు వెళ్లి తిరిగి వాళ్ల అకౌంట్లకి వచ్చేది అని ఆరోపించారు. మా ప్రభుత్వంలో డబ్బంతా ప్రజల అకౌంట్లలోకి వెళ్తుందంటూ అభివర్ణించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. మరోవైపు.. మళ్లీ జగన్ను గెలిపిస్తామని ప్రజలు అంటున్నారు.. కానీ, మన గుర్తు ఏదంటే మాత్రం కొందరు సైకిల్ అని అంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. వైసీపీ గుర్తుపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు మంత్రి ధర్మాన.
తాజావార్తలు
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!