Minister Dharmana Prasada Rao: వైసీపీ ప్రభుత్వం వద్దనుకుంటే.. మీ పీక మీరు కోసుకోవడమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Dharmana Prasada Rao: శ్రీకాకుళంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. మహిళలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆయన.. వైసీపీని వ్యతిరేకించడం అంటే గొప్ప అనుకోకండి.. వైసీపీ ప్రభుత్వం వద్దనుకుంటే మీ పీక మీరు కోసుకోవడమే, మీచేతిని మీరు నరుక్కొవడమే అన్నారు.. సీఎం వైఎస్ జగన్ ఓడిపోతే ఆడవాళ్లకి ఎంత చేశాడు, అడోళ్లు ఆడోళ్లు అనుకొని చచ్చాడురా అంటారు. తరువాత వచ్చిన ప్రభుత్వం ఆడవాళ్లని పట్టించుకోదన్నారు. సమాజంలో మహిళలకు ఇంత గౌరవం ఇచ్చిన ప్రభుత్వాన్ని వద్దనుకుంటే ఏం చేయాలి.? అని ప్రశ్నించారు. నూనె ,గ్యాస్ , కరెంట్ పెరగాయంటూ మాట్లాడుతున్నారు.. దేశం మొత్తం పెరిగాయి , మనవద్దే కాదని తెలిపారు.. ధరలు పెరిగినా తట్టుకునేలా మీ ఎకౌంట్స్ లో డబ్బు జమచేస్తున్నాం. ఇతర రాష్ర్టాలలో , గత ప్రభుత్వాలలో ఇలాజరగలేదు కదా? అని ప్రశ్నించారు.. మహిళలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు మంత్రి ధర్మాన.
మరోవైపు.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన.. చంద్రబాబు నాయుడు ఏదో ఒక పేరు పెట్టి… వాళ్లకి రూ.371 కోట్లు డబ్బు ఇచ్చాడు. చంద్రబాబు చెప్పిన సంస్థకు కాకుండా బోగస్ సంస్థకు ఆ డబ్బు వెళ్ళిందనీ కేంద్ర ప్రభుత్వ సంస్థ దాన్ని పట్టుకుందన్నారు. బోగస్ సంస్థ నుండి సెల్ కంపెనీలకు.. అక్కడ నుండి ఆ డబ్బు చంద్రబాబు పీఏ, లోకేష్ పీఏ అకౌంట్లకి వచ్చాయని పట్టుకున్నారని.. వాళ్లని పట్టుకుందామనీ వెళ్తే ఒకడు దుబాయికి, ఇంకొకడు అమెరికాకి పారిపోయారని వెల్లడించారు.. వాళ్లని పట్టుకుంటే ఈ డబ్బు ఎక్కడికెళ్లిందో తేలిపోతుందన్నారు.
Also Read
- Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
- Hormuz-US: హార్ముజ్పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- CJP: కాక్రోచ్ ఉద్యమం ఎటు పోతోంది.? పేపర్ లీక్పై నిరసన అయితే దాడులు, విద్వేష నినాదాలు ఎందుకు.?
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
ఇక, ప్రజా జీవితంలో ఉన్నవాడు డబ్బులు ఇలా తినేస్తే ఊరుకోరు అని హెచ్చరించారు ధర్మాన.. మేమందరం కోర్టుమందు విచారణకు నిలబడిన వాళ్ళమే గతంలో.. ప్రజా ధనం దుర్వినియోగం అయ్యిందని ఒక సంస్థ చెబితే నమ్మేస్తారు.. నువ్వు జనం ముందు దబాయించటం కాదు.. కోర్టులో రుజువు చేసుకోవాలని సలహా ఇచ్చారు. అప్పటి ప్రభుత్వంలో డబ్బంతా ఇతరుల అకౌంట్లకు వెళ్లి తిరిగి వాళ్ల అకౌంట్లకి వచ్చేది అని ఆరోపించారు. మా ప్రభుత్వంలో డబ్బంతా ప్రజల అకౌంట్లలోకి వెళ్తుందంటూ అభివర్ణించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. మరోవైపు.. మళ్లీ జగన్ను గెలిపిస్తామని ప్రజలు అంటున్నారు.. కానీ, మన గుర్తు ఏదంటే మాత్రం కొందరు సైకిల్ అని అంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. వైసీపీ గుర్తుపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు మంత్రి ధర్మాన.
తాజావార్తలు
-
Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
-
Gabbar Singh Ramesh: గబ్బర్ సింగ్’ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్!
-
MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
-
Hormuz-US: హార్ముజ్పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
-
CJP: కాక్రోచ్ ఉద్యమం ఎటు పోతోంది.? పేపర్ లీక్పై నిరసన అయితే దాడులు, విద్వేష నినాదాలు ఎందుకు.?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!