Botsa Satyanarayana: ప్రశాంత్ కిషోర్, ఎన్నికల కన్సల్టెన్సీలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా.. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ అంటూ ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రశాంత్ కిషోర్ గిమ్మిక్కులు చేస్తారు.. ఒన్ టైం వ్యవహరం అనుకున్నాం.. తర్వాత వదిలేశామని మంత్రి అన్నారు. ప్రస్తుతానికి ఐ-ప్యాక్ నిర్మాణాత్మకంగానే ఉందని అనుకుంటున్నామన్నారు. ప్రశాంత్ కిషోరైనా, ఐ-ప్యాక్ అయినా తాత్కాలికం.. వైసీపీ శాశ్వతమన్నారు.
Read Also: Botsa Satyanarayana: మేలు చేస్తేనే ఓటేయండని అడిగిన జగన్.. దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు..
కో-ఆర్డినేషన్ కోసం ఐ-ప్యాక్ సంస్థ సేవలు తీసుకున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. కన్సల్టెన్సీ సంస్థలు ఎన్నైనా చెబుతాయి.. నిర్ణయం తీసుకోవాల్సింది మేమేనన్నారు. ఐ-ప్యాక్ చెప్పిన వారికే టిక్కెట్లు ఇచ్చారనేది అవాస్తవమని.. ఐ-ప్యాక్ ఓ జాబితా ఇస్తుంది.. అందులో నుంచి అభ్యర్థులను పార్టీ సెలెక్ట్ చేసుకుందన్నారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఫలితాల్లో వైసీపీ ఓటమి తప్పదని పీకే పేర్కొనగా.. ఆ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు.