Botsa Satyanarayana: మేలు చేస్తేనే ఓటేయండని అడిగిన జగన్.. దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: ఏపీలో ఎన్నికల ఫలితాలపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వెరీ క్లారిటీగా ఉన్నామని.. 175 సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మేం మేలు చేస్తేనే ఓటేయండని అడిగిన జగన్.. దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారన్నారు. జగన్ అడిగిన విధంగా మోడీ కూడా ధైర్యంగా ఓట్లడగలేకపోతున్నారన్నారు. పరిపాలన చూసి ఓటేయండని ప్రధాని కూడా అడగలేకపోయారన్నారు. దేశానికి మేలు చేశానని.. ఓటేయ్యండి అని మోడీ కూడా అడగడం లేదన్నారు. రామాలయ నిర్మాణం, సీతమ్మ భూమి, ముస్లిం రిజర్వేషన్లు వంటి వాటిని ప్రస్తావిస్తూ ప్రధాని ఓట్లు అడుగుతున్నారన్నారు.
ఎన్నికలయ్యాయి.. ఫలితాలు రావాల్సి ఉందన్నారు. ఎవరి ధీమా వారికుందన్నారు. మేం ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్దంగా ఉన్నామని చెప్పామన్నారు. ప్రతిపక్షంలో కూడా వారు చెప్పాల్సింది చెబుతున్నారని.. ఎన్నో ఎన్నికలు చూశాను కానీ.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని మంత్రి చెప్పారు. ఇప్పుడు ప్రధాన రాజకీయ నేతలంతా విదేశాల్లో ఉన్నారన్నారు. జగన్ విదేశీ పర్యటన మీద రకరకాల విమర్శలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు.. లోకేష్ కూడా విదేశాలకు వెళ్లిపోయారని.. ముఖ్య నేతలు విదేశాల్లో ఉన్నారు.. ఇంకొందరు నేతలు ప్రయాణాల్లో ఉన్నారని.. ఇక్కడున్న వారు ఇప్పుడు ఎందుకు గొడవ చేస్తున్నారని ప్రశ్నించారు. కొంత గ్యాప్ ఇవ్వాలని ఆయన సూచించారు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
చంద్రబాబు ఎక్కడికెళ్లారో ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. చెప్పాల్సిన అవసరం లేదంటే సరే కానీ.. అటువంటప్పుడు జగన్ పర్యటనల మీద ఎందుకింత చర్చ అంటూ ఆయన పేర్కొన్నారు. విద్యా వైద్యంలో తమపై ఇంకా ఆరోపణలు చేస్తున్నారని.. కూటమి మేనిఫెస్టోలో విద్యా రంగంపై హామీలు ఎందుకివ్వలేదని మంత్రి ప్రశ్నించారు. ఇప్పుడు 1-10 తరగతుల్లో 39,61,198 మంది విద్యార్థులున్నారని.. వైసీపీ హయాంలో విద్యా విధానం దేదీప్యమానంగా వెలిగిందన్నారు. విద్యార్థుల కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టామన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విద్యా విధానం మెరుగయ్యేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
తాజావార్తలు
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
-
NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
-
Domestic LPG Cylinder Price Hiked: గృహ వినియోగదారులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంతంటే?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!