Minister Atchannaidu: ప్రజలు మెచ్చే నాయకుడిగా పనిచేసి చూపిస్తా..
- గత ప్రభుత్వంపై మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఆగ్రహం
- రాష్ట్రాన్ని గత ఐదేళ్ళ పాలనలో చిన్నాభిన్నం చేశారు- మంత్రి
- రాష్ట్రంలో వ్యవస్థలు అన్నీ భ్రష్టు పట్టించారు- అచ్చెన్నాయుడు
- క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి ప్రజలు సమస్యలు తెలుసుకుంటున్నా
- ఛాలెంజింగ్ గా ఉన్న కార్యక్రమాలు చిత్తశుద్దితో నిర్వహిస్తాను- మంత్రి
- ప్రజలు మెచ్చే నాయకుడిగా పనిచేసి చూపిస్తా- అచ్చెన్నాయుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ప్రభుత్వంపై మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని గత ఐదేళ్ళ పాలనలో చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో వ్యవస్థలు అన్నీ భ్రష్టు పట్టించారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని.. రూ.13 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని తెలిపారు. ఏ మంత్రి, ఏ శాఖను రివ్యూ చేసినా.. ఎక్కడా అప్పులు తప్ప ఆదాయం కనిపించడం లేదని తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. ఒకొక్క హామీని నెరవేరుస్తామని చెప్పారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా పెంచిన పింఛన్లు అందించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గత ఐదేళ్లలో పేద వారికి అన్నం పెట్టడానికి కుడా ఇష్టం లేకుండా అన్న క్యాంటీన్లు తీసివేశారని వ్యాఖ్యానించారు. గతంలో కట్టిన భవనాల్లో సాంఘీక కార్యక్రమాలు చేపట్టారని.. రాష్ట్రంలో మరో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభానికి అంచనా వేశామని పేర్కొన్నారు.
Read Also: Saripodhaa Sanivaaram: యూఎస్లో నాని క్రేజ్ అదిరిందోచ్.. తన రికార్డు తానే బ్రేక్ చేస్తాడా?
Also Read
- India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
- DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్గా బాధ్యతలు
- Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
- Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి 'గ్లో' రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
తాము ప్రతిపక్షంలో ఉన్న సమయంలో శ్రేయోభిలాషులు, ఎన్ఆర్ఐ సోదరులు ఇచ్చిన డబ్బులతో అన్న క్యాంటీన్ నడిపామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి ప్రజలు సమస్యలు తెలుసుకుంటున్నానని పేర్కొన్నారు. ఛాలెంజింగ్ గా ఉన్న కార్యక్రమాలు చిత్తశుద్దితో నిర్వహిస్తానని.. ప్రజలు మెచ్చే నాయకుడిగా పనిచేసి చూపిస్తానని మంత్రి చెప్పారు. ఇదిలా ఉంటే.. అధికారులు బదిలీలు పారదర్శకంగా జరుగుతాయన్నారు. అటెండర్ నుండి ఉన్నతాధికారి వరకు బదిలీలు కోసం ఒక్క పైసా ఇచ్చినా తీసుకునే చర్యలు తీసుకుంటామని అన్నారు. బదిలీల కోసం పైరవీలను ప్రోత్సహించవద్దని తెలిపారు. ప్రజలు, నాయకులు, కార్యకర్తలు గౌరవాన్ని పెంచే విధంగా తాను పని చేస్తానని చెప్పారు. మరోవైపు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
తాజావార్తలు
-
India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
-
Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
-
DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్గా బాధ్యతలు
-
Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!