Minister Atchannaidu: ప్రజల సహకారం లేకే శ్రీకాకుళం వెనుకబడింది.. మంత్రి ఆవేదన..!
- శ్రీకాకుళంజిల్లా అభివృద్దికి అన్ని అవకాశాలు ఉన్నాయి..
- ప్రజల సహకారం లేకపోవడమే వెనుకబాటుకు కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Atchannaidu: శ్రీకాకుళంజిల్లా అభివృద్దికి అన్ని అవకాశాలు ఉన్నా , ప్రజల సహకారం లేకపోవడమే వెనుకబాటుకు కారణం అన్నారు మంత్రి అచ్చెంనాయుడు. ఎయిర్ పోర్ట్ కట్టాలంటే జెండాపట్టుకోని లేస్తున్నారు.. ఎక్కడ అభివృద్ది జరగుతుంది..? దీనిపై చర్చజరగాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వలసలు ఆగాలన్నా , పేదరికం పోవాలన్నా పారిశ్రామికీకరణ జరగాలన్నారు. పాజిటివ్ మైండ్ తో ముందుకు వెళ్తే తప్ప ఇంకో డబ్బై సంవత్సరాలైనా మన జిల్లా ఇలాగే ఉంటుంది. ఎన్నికలప్పుడు రాజకీయం చేద్దాం, అభివృద్దికి ఆటంకం కలిగించాలని చూడటం మంచి విధానం కాదన్నారు. వెనుకబాటుతనం, తలసరి ఆదాయంపై చంద్రబాబు మాట్లాడితే చిన్నబోయానన్నారు. మమాత్మా జోతిరావ్ పూలే జయంతి సందర్బంగా 5 కోట్లతో నిర్మించిన బీసీ భవన్ను ప్రారంభించారు మంత్రి..
Read Also: Tahawwur Rana: ముంబై ఉగ్రదాడుల్లో పాక్ ఐఎస్ఐ ప్రమేయం.. మేజర్ ఇక్బాల్, సమీర్ల పాత్ర..
Also Read
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
శ్రీకాకుళంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో తక్కువగా ఉంది.. తలసరి ఆదాయంలో 26వ స్థానంలో శ్రీకాకుళంజిల్లా గా ఉండటం చాలా బాధగా ఉంది అన్నారు అచ్చెన్నాయుడు.. వనరులు ఉన్నాయి.. కానీ, ఉద్యమాలతో అడ్డుకుంటున్నారు. ఏదైనా ప్రాజెక్ట్ అంటే జెండాలు పట్టుకు బయలుదేరుతున్నారు. ఎయిర్పోర్ట్ అంటే వద్దంటున్నారు. 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను , 2 సార్లు మంత్రి అయ్యా , పార్టీ అధ్యక్షుడుగా పనిచేశా.. నాకు పదవులపై అశలేదు. జిల్లా అభివృద్ధికి మనసా వాచా కర్మణా పని చేస్తాను.. పాజిటివ్ మైండ్ లేకపోతే ఇంకో 75 ఏళ్లు ఆయనా శ్రీకాకుళం అభివృద్ధి జరగదు అన్నారు.. ఏపీలో 60 శాతం బడుగులు ఉన్నారు. గతంలో ఎన్నికలలో ఓటు వేసే యంత్రాల్లా ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం తరువాతనే ఆర్ధిక, సామాజిక , రాజకీయ అవకాశాలు వచ్చాయి. బీసీల అభివృద్ధికి ఎన్టీఆర్ పెట్టిన టీడీపీనే దానికి ప్రధాన కారణంగా అభివర్ణించారు.. అయితే, బీసీలపై కక్ష కట్టిన పార్టీలు కూడా ఉన్నాయి.. కానీ, పదవులు శాశ్వతం కాదు అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు..
Read Also: Vinesh Phogat: కాంగ్రెస్ ఎమ్మెల్యేకి బీజేపీ సర్కార్ బహుమానం.. ఎన్ని కోట్లంటే..!
ఆనాడు చంద్రన్న భీమా పథకం తీసుకు వచ్చాం. క్రీడ మంత్రిగా 175 నియోజకవర్గంల్లో స్టేడియాలు ఏర్పాటు చేశాం. ప్రతి నియోజకవర్గంలో బీసీ హాస్టల్ ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాలో బీసీ భవనాలు 5 కోట్లు చెప్పిన విడుదల చేసి నిర్మాణం చేశామని గుర్తుచేసుకున్నారు అచ్చెన్నాయుడు.. బీసీల కోసం ఆదరణ పథకంలో వున్న గోదాంలలో ఉన్న పరికరాలు కోట్ల రూపాయలు ఇచ్చాం. బీసీల మీద కక్షతో గత 5 సంవత్సరాలు వివక్ష చూపించి సాయం చేయలేదని విమర్శించారు.. అయితే, ఆదరణ పథకంలో ప్రతి లబ్ధిదారులకు అందజేస్తాం. శ్రీకాకుళం ప్రధాన కేంద్రం అభివృద్ధి చేయాలను కుంటున్నాం, సహకరించండి అని విజ్ఞప్తి చేశారు.. మార్కెట్ చూస్తే బాధగా ఉంది.. మున్సిపల్ కార్యాలయం పెచ్చులు ఊడిపోతుంది.. PP మోడల్ నిర్మించాలను కుంటున్నాను. వచ్చే ఐదేళ్లలో పట్టణం రూపు రేఖలు మారుస్తాం అని వెల్లడించారు మంత్రి అచ్చెన్నాయుడు..
తాజావార్తలు
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?