AP CM Chandrababu: బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM Chandrababu: మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సరస్వతీ అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఈ వేడుకను తిలకించేందుకు భారీగా భక్తులు వస్తారని అంచనా. ఈ క్రమంలోనే మూలా నక్షత్రం ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దుర్గాఘాట్ మోడల్ గెస్ట్ హౌస్లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, సీపీ, ఈవోలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మూలా నక్షత్రం ఏర్పాట్లు, సీఎం రాకపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకూ ఎదురైన సమస్యలు, రేపు మూల నక్షత్రం నాడు ఎదుర్కోవాల్సిన సవాళ్లపై సమీక్షించారు. ముఖ్యమంత్రి రాక సమయంలో సామాన్య భక్తుల దర్శనానికి భంగం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సమీక్షలో చర్చించారు. సీఎం వెళ్ళే దారిలో ఫోటో స్టాండ్ల ఏర్పాటు, క్యూలైన్ల కూర్పు, భక్తులను క్యూలైన్లలో వదలడం, దర్శన సమయం, వీఐపీలు, వాహనాల అనుమతులు, డ్రోన్ల వాడకంపై సమీక్షించారు.
Read Also: Minister Satya Kumar Yadav: ఎఫ్ఎస్ఎస్ఏఐతో ఏపీ రూ.88 కోట్ల ఎంఓయూ.. ఒప్పందంపై సంతకాలు
Also Read
- Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
మూల నక్షత్రం నాడు అధిక సంఖ్యలో తెల్లవారుజాము నుంచే భక్తులు వస్తుంటారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. 3 గంటల నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్లు అన్నీ ఉచితమేనని పేర్కొన్నారు. మంచినీరు, మజ్జిగ, పాలు యథావిథిగా పంపిణీ చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టువస్త్రాలు ఇవ్వడానికి మధ్యాహ్నం 2 గంటలకు వస్తారని చెప్పారు. సీఎం చంద్రబాబుకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకూ కేటాయించామన్నారు. శాసనసభ్యులు, మంత్రులు, అధికారులు బంగారు వాకిలి నుంచి దర్శనం చేసుకుంటారని చెప్పారు. సీఎంతో పాటుగా మంత్రులు, సీఎం కుటుంబ సభ్యులు అంతరాలయ దర్శనం చేసుకుంటారన్నారు. కొండచరియలు జారినవి, తిరిగి నిర్మించినవి, వరదల కాలం నాటివి ఫోటోలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీఎం అంతరాలయంలో ఉన్నప్పటికి సామాన్యుడి దర్శనానికి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. సీఎం సెక్యూరిటీ పరంగా అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
తాజావార్తలు
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!