Minister Anam Ramanarayana Reddy: కూటమి ప్రభుత్వం సమర్థ పాలన వల్లే సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం..
- ప్రభుత్వ సమర్థ పాలన వల్లే సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం..
- గత ప్రభుత్వ హయాంలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anam Ramanarayana Reddy: ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగాయి.. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వ సమర్థ పాలన వల్లే సాగునీటి సంఘాల ఎన్నికలన్నీ ఏకగ్రీమయ్యాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాగునీటి సంఘాలు ఎన్నికలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదని.. అప్పట్లో ఆ ప్రభుత్వానికి ధైర్యం లేదన్నారు.
Also Read
ఇక, సోమశిల ప్రాజెక్టు దెబ్బ తినడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని మంత్రి ఆనం విమర్శించారు.. అన్నమయ్య ప్రాజెక్టు నిర్వహణకు 7 కోట్ల రూపాయలు నిధులు అడిగితే ప్రభుత్వం ఇవ్వలేదని.. అందువల్లే అది వరదల్లో.. కొట్టుకుపోయిందంటూ ఆరోపణలు గుప్పించారు.. సోమశిల హై లెవెల్ కెనాల్ పనులను కూడా చేపట్టలేదని.. కేవలం భూ పరిహారంలో మాత్రమే రైతులను మభ్యపెట్టారన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. మరోవైపు.. సాగునీటి సంఘాల ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని విషయం విదితమే కాగా.. అసలు, కూటమి ప్రభుత్వం సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహారిస్తుందంటూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన విషయం విదితమే.. అయితే, ఆ ప్రకటన చేసినా.. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థులు.. ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!