Ambati Rambabu: రాష్ట్రంలో ముగ్గురు రాక్షసులు.. అంబటి తీవ్ర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ ముగ్గురు రాక్షసులు తయారయ్యారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి అంబటి రాంబాబు.. ఈ రాష్ట్రంలో పెద్ద రాక్షసుడు, పిల్ల రాక్షసుడు, దత్త రాక్షసుడు తయారయ్యారు అంటూ చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్పై విరుచుకుపడ్డారు.. ఇక, అరెస్టు పేరుతో సింపతి రాజకీయాలు చేయాలని చంద్రబాబు చూస్తున్నాడు, అలాంటి సంపతి రాజకీయాలు ఇప్పుడు చెల్లబోవన్నారు. కారణం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కానీ, చంద్రబాబుకు ఎందుకంత భయమో అర్థం కావడం లేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుంది.. చట్టానికి అడ్డుపడితే చంద్రబాబుపై చర్యలు తప్పవు అని హెచ్చరించారు అంబటి.
Read Also: G20: జీ20 సదస్సు .. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.1000
Also Read
- JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
- Telangana Assembly 2026: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. 20 అంశాలపై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్.. కేసీఆర్ వస్తారా?
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్షాప్
ఇక, ప్రాథమిక ఆధారాలు లేనిదే ఏ కేసులు పెట్టరని వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు.. ధైర్యం ఉంటే ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన నోటీసులకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తప్పు చేస్తే తప్పించుకోలేరు.. తప్పు చేయక పోతే అరెస్ట్ ఉండదన్న ఆయన.. చంద్రబాబు దొంగ అయిన పవన్ కల్యాణ్ ఒప్పుకోడు అంటూ విమర్శించారు. 118 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నాడని చంద్రబాబుపై ఆరోపణలు వచ్చినా, పవన్ కల్యాణ్ నోరు మెదపడు.. అది వాళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం అంటూ దుయ్యబట్టారు మంత్రి అంబటి రాంబాబు.. కాగా, చంద్రబాబుకు ఐటీ నోటసుల వ్యవహారంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, రాష్ట్ర మంత్రులు.. చంద్రబాబు టార్గెట్గా విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే.
Read Also: iPhone 14 Price Drop: ఐఫోన్ 15 లాంచ్కు ముందు.. భారీగా తగ్గిన ఐఫోన్ 14 ధర! కేవలం రూ. 14 వేలకే
మరోవైపు.. ఈ ఏడు వర్షాలు సమృద్దిగా పడలేదన్నారు మంత్రి అంబటి.. శ్రీశైలం , సాగర్, పులిచింతల ప్రాజెక్టుల లో పూర్తి స్థాయి లో నీరు లేదు.. గతంలో ఓవర్ ఫ్లో ఉండేదన్న ఆయన.. ఈ సంవత్సరం ఆగస్టులో సాధారణం కంటే మైనస్ 31 శాతం తక్కువ వర్షపాతం నమోదు అయ్యిందని.. గడిచిన 100 సంవత్సరాలతో పోల్చితే అతి తక్కువ వర్ష పాతం నమోదయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది.. సాగర్ ఆయకట్టులో ఉన్న పరిస్థితి నీ రైతులు గుర్తించాలి.. ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆరుదల పంటలపై సాగర్ ఆయకట్టు రైతులు దృష్టి పెట్టాలి.. డెల్టాలో నాట్లుకు ఇబ్బంది లేదు.. అవసరం అయితే వారా బంది నిర్వహిస్తాం అన్నారు. భవిష్యత్ లో మంచి వర్షాలు పడతాయని ఆశిస్తున్నాం అన్నారు మంత్రి అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
Samsung Galaxy A18 4G: సామ్ సంగ్ గెలాక్సీ A18 4G.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో కొత్త బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు లీక్
-
Nayanthara: లేడీ సూపర్స్టార్కు 2026లో వరుస షాక్లు.. ఆ ఒక్క హిట్ తర్వాత ఎందుకిలా?
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Telangana Assembly 2026: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. 20 అంశాలపై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్.. కేసీఆర్ వస్తారా?
-
Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై 4.1 తీవ్రత
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!