Minister Ambati Rambabu: ఇచ్చిన హామీలు అమలు చేయదని టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని ఆయన తెలిపారు. చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు మేనిఫెస్టో లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. మేనిఫెస్టోను వెబ్సైట్ నుండి తొలగించిన చంద్రబాబును ప్రజలు నమ్మరని మంత్రి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజల దగ్గరకు వెళ్లి ధైర్యంగా ఓట్లు అడుగుతున్నామన్నారు. సీట్లు అడుక్కోవడానికి చంద్రబాబు దగ్గరకు పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ను నమ్ముకుని ఆయన వెంట వెళ్లొద్దన్నారు.
Read Also: AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురూ.. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం
జగన్ సక్సెస్ ఫుల్ సీఎం.. చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎం అని ఆయన అన్నారు. మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్న ఆయన.. టీడీపీ, జనసేన ఇంకా సీట్లు కోసం కొట్టుకుంటున్నాయన్నారు. సీట్లు రాని వారు ఏవేవో మాట్లాడుతున్నారన్నారు. బాలశౌరి అన్యాయాలు, అక్రమాలు చేశాడు కాబట్టే అక్కడ పడ్డాడని ఆయన విమర్శించారు. అందరిని ముంచిపోయాడని ఆయన ఆరోపించారు. జగన్ అర్జునుడు.. అభిమన్యుడు కాదని.. ప్రతిపక్షాల పద్మ వ్యూహాలను ఛేదించి బయటకు వస్తాడన్నారు. లోకేష్ను ఎక్కడ దాచేశారని.. జగన్ అర్జునుడు అనగానే వీళ్లకు ఎందుకు గుచ్చుకుందని ప్రశ్నించారు. వాళ్ళు చేస్తున్న దుష్ట చతుష్టయం పన్నాగాలు వివరించటానికే సీఎం అర్జునుడు, అభిమన్యుడు ప్రస్తావన తెచ్చారన్నారు.
