Meta: మెటాకు భారీ షాక్.. ఫేస్బుక్, ఇన్స్టా వ్యసనంపై రూ.133 లక్షల కోట్ల కేసు!
- మెటాపై అమెరికాలో మరో కీలక న్యాయపోరాటం..
- పిల్లలు, యువతను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చారనే ఆరోపణ..
- COPPA ఉల్లంఘనకు పాల్పడిందని మెటాపై 29 రాష్ట్రాల ఆరోపణలు..
- మెటా అఫిడవిట్ ప్రకారం $1.4 ట్రిలియన్ వరకు జరిమానా కోరే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meta: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ప్రపంచవ్యాప్తంగా న్యాయపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. మెటా సోషల్ మీడియాలు వ్యవసానికి కారణమవుతున్నాయని, ఇదే కాకుండా దాని యాప్లు పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని అమెరికాలో మెటా అనేక పిటిషన్లను ఎదుర్కొంటోంది. మెటా 1.4 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 133.92 లక్షల కోట్లు) వరకు జరిమానాలను కూడా ఎదుర్కోవచ్చు. ఈ కొత్త కేసు విచారణ కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో ఉన్న ఫెడరల్ కోర్టులో మంగళవారం ప్రారంభం కానుంది. గత వారం, మెటా ఈ కేసును కొట్టివేయాలని కోరింది, కానీ ఆ కంపెనీ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
ఈ కేసులో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, ఇన్స్టాగ్రామ్ అధిపతి ఆడమ్ మొసేరీ సహా కంపెనీ సీనియర్ అధికారులు సాక్ష్యం చెప్పాల్సి వచ్చే అవకాశం ఉంది. ఈ కంపెనీ భారీ జరిమానా ఎదుర్కోవచ్చు. యూజర్లను తన ప్లాట్ఫామ్లకు బానిసలుగా చేసే ఫీచర్లను మెటా ఉద్దేశపూర్వకంగా అమలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. 2023లో అమెరికాలో పలు రాష్ట్రాలు మెటాపై ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి. కంపెనీ భద్రతా విధానాలపై పలు రాష్ట్రాలు దర్యాప్తు జరిపి, మెటా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ వల్ల పిల్లలు, కౌమార దశలో ఉన్నవారికి తీవ్రమైన హాని జరుగుతుందని వెల్లడి కావడంతో ఈ చర్య తీసుకున్నారు.
Also Read
- Electric Aircraft: వరల్డ్లో తొలి ఎలక్ట్రిక్ విమాన పరీక్ష విజయవంతం.. ఖర్చెంతో తెలుసా?
- Iran-US: ‘హార్ముజ్ను ఎట్టి పరిస్థితుల్లో తెరవబోం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
- Bangladesh: భారత్తో స్నేహం వద్దనుకుంటోందా.? తీస్తాపై బంగ్లాదేశ్ తీరు..
- Trump: భారత్ ఎన్నికల వ్యవస్థ సూపర్.. ట్రంప్ ప్రశంసలే.. ప్రశంసలు
కాలిఫోర్నియా, కొలరాడో, కెంటకీ, న్యూజెర్సీ సహా మొత్తం 29 రాష్ట్రాలు మెటా పిల్లల ఆన్లైన్ గోప్యతా పరిరక్షణ చట్టం COPPAను ఉల్లంఘించిందని ఆరోపించాయి. 13 ఏళ్లలోపు పిల్లలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉపయోగిస్తున్నారని మెటాకు తెలిసినప్పటికీ, వారి తల్లిదండ్రుల సమ్మతి లేకుండా వారి డేటాను సేకరించిందనేది మరో ప్రధాన ఆరోపణ ఉంది. ఈ కేసులో రాష్ట్రాలు $1.4 ట్రిలియన్ వరకు జరిమానా కోరే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: గౌడన్నలకు సీఎం రేవంత్ బిగ్ హామీ.. గీత కార్మికుల కోసం కీలక ప్రకటనలు
-
Meta: మెటాకు భారీ షాక్.. ఫేస్బుక్, ఇన్స్టా వ్యసనంపై రూ.133 లక్షల కోట్ల కేసు!
-
No Number Plate, No Fuel: నంబర్ ప్లేట్ లేకపోతే నో ఫ్యూయల్.. సంచలన నిర్ణయం.. వెంటనే అమల్లోకి..!
-
West Bengal: బెంగాల్లో ‘కాక్రోచెస్’ వర్సెస్ బీజేపీ.. కార్యకర్త తండ్రి మృతితో సీజేపీ ఆగ్రహం
-
Mohanlal: కుర్ర హీరోలకే షాకిచ్చేలా .. ఒకేసారి 7 స్టార్ డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేసిన లెజెండరీ హీరో!
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!