Meta: మెటాకు భారీ షాక్.. ఫేస్బుక్, ఇన్స్టా వ్యసనంపై రూ.133 లక్షల కోట్ల కేసు!
- మెటాపై అమెరికాలో మరో కీలక న్యాయపోరాటం..
- పిల్లలు, యువతను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చారనే ఆరోపణ..
- COPPA ఉల్లంఘనకు పాల్పడిందని మెటాపై 29 రాష్ట్రాల ఆరోపణలు..
- మెటా అఫిడవిట్ ప్రకారం $1.4 ట్రిలియన్ వరకు జరిమానా కోరే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meta: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ప్రపంచవ్యాప్తంగా న్యాయపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. మెటా సోషల్ మీడియాలు వ్యవసానికి కారణమవుతున్నాయని, ఇదే కాకుండా దాని యాప్లు పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని అమెరికాలో మెటా అనేక పిటిషన్లను ఎదుర్కొంటోంది. మెటా 1.4 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 133.92 లక్షల కోట్లు) వరకు జరిమానాలను కూడా ఎదుర్కోవచ్చు. ఈ కొత్త కేసు విచారణ కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో ఉన్న ఫెడరల్ కోర్టులో మంగళవారం ప్రారంభం కానుంది. గత వారం, మెటా ఈ కేసును కొట్టివేయాలని కోరింది, కానీ ఆ కంపెనీ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
ఈ కేసులో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, ఇన్స్టాగ్రామ్ అధిపతి ఆడమ్ మొసేరీ సహా కంపెనీ సీనియర్ అధికారులు సాక్ష్యం చెప్పాల్సి వచ్చే అవకాశం ఉంది. ఈ కంపెనీ భారీ జరిమానా ఎదుర్కోవచ్చు. యూజర్లను తన ప్లాట్ఫామ్లకు బానిసలుగా చేసే ఫీచర్లను మెటా ఉద్దేశపూర్వకంగా అమలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. 2023లో అమెరికాలో పలు రాష్ట్రాలు మెటాపై ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి. కంపెనీ భద్రతా విధానాలపై పలు రాష్ట్రాలు దర్యాప్తు జరిపి, మెటా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ వల్ల పిల్లలు, కౌమార దశలో ఉన్నవారికి తీవ్రమైన హాని జరుగుతుందని వెల్లడి కావడంతో ఈ చర్య తీసుకున్నారు.
Also Read
- Iran-US War: మరోసారి యుద్ధం తీవ్రం.. ఖర్గ్ ద్వీపం దగ్గర భారీ పేలుళ్లు.. ఇరాన్ ఆయిల్ ట్యాంకర్పై అమెరికా దాడి!
- UN: ఫలించిన భారత్ పోరాటం.. నవంబర్ 27 అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవంగా ప్రకటన
- South Africa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసాకు పొంచి ఉన్న అభిశంసన ముప్పు! స్కామ్ ఏంటంటే..!
- Nepal Flash Floods: నేపాల్ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
కాలిఫోర్నియా, కొలరాడో, కెంటకీ, న్యూజెర్సీ సహా మొత్తం 29 రాష్ట్రాలు మెటా పిల్లల ఆన్లైన్ గోప్యతా పరిరక్షణ చట్టం COPPAను ఉల్లంఘించిందని ఆరోపించాయి. 13 ఏళ్లలోపు పిల్లలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉపయోగిస్తున్నారని మెటాకు తెలిసినప్పటికీ, వారి తల్లిదండ్రుల సమ్మతి లేకుండా వారి డేటాను సేకరించిందనేది మరో ప్రధాన ఆరోపణ ఉంది. ఈ కేసులో రాష్ట్రాలు $1.4 ట్రిలియన్ వరకు జరిమానా కోరే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది.
తాజావార్తలు
-
KTR : జీవో 97పై కేటీఆర్ ఫైర్.. విద్యార్థులకు కీలక హామీ
-
Maharashtra: డ్యాన్స్ క్లాస్ ఉందని వంట చేయని భార్య.. దారుణానికి ఒడిగట్టిన భర్త..
-
Ishan Kishan: కెప్టెన్గా ఇషాన్ కిషన్ రీఎంట్రీ.. రేపే తుది సమరం..
-
Iran-US War: మరోసారి యుద్ధం తీవ్రం.. ఖర్గ్ ద్వీపం దగ్గర భారీ పేలుళ్లు.. ఇరాన్ ఆయిల్ ట్యాంకర్పై అమెరికా దాడి!
-
Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!