West Bengal: బెంగాల్లో ‘కాక్రోచెస్’ వర్సెస్ బీజేపీ.. కార్యకర్త తండ్రి మృతితో సీజేపీ ఆగ్రహం
- బెంగాల్లో సీజేపీ వర్సెస్ బీజేపీ..
- సీజేపీ కార్యకర్త తండ్రి మరణంపై వివాదం..
- బీజేపీ గుండాలే దాడులకు పాల్పడ్డారని సీజేపీ ఆరోపణ..
- ప్రభుత్వం ముందు 4 డిమాండ్లు, 10 రోజుల అల్టిమేటం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: ఢిల్లీలో జంతర్ మంతర్ నిరసనల తర్వాత మరోసారి బీజేపీ వర్సెస్ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. సీజేపీ ప్రారంభించిన ‘‘స్కూల్ ఠీక్ కరో’’ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు సీజేపీ కార్యకర్త షేక్ అబ్దుల్ హఫీజ్, ఆయన తండ్రిపై దాడి జరిగిందని సీజేపీ ఆరోపిస్తోంది. తీవ్రంగా గాయపడిన హఫీజ్ తండ్రి మాఫిక్ గత వారం మరణించారు. ఈ ఘటనపై సీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నాలుగు డిమాండ్లు నెరవేర్చాలని బెంగాల్లోని సువేందు అధికారి సర్కార్కు 10 రోజుల అల్టిమేటం విధించింది. లేదంటే జంతర్ మంతర్ తరహాలో భారీ ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.
కోల్కతాకు 200 కి.మీ దూరంలోని బంకురా జిల్లాలో ఆగస్టు 13న సీజేపీ కార్యకర్త 27 ఏళ్ల షేక్ అబ్దుల్ హఫీజ్ తాను చదువుకున్న పాఠశాలను పరిశీలించడానికి వెళ్లారు. సీజేపీ చేపట్టిన ‘‘స్కూల్ ఠీక్ కరో’’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల సమస్యల్ని వెలుగులోకి తీసుకువచ్చారు. అదే రాత్రి 100 మంది నుంచి 200 మంది గుంపు తమ ఇంటికి వచ్చి స్కూల్ వీడియోలు డిలీట్ చేయాలని దాడి చేసినట్లు హఫీజ్ కుటుంబం ఆరోపిస్తోంది. ఈ దాడిలో హఫీజ్ తండ్రి తీవ్రంగా గాయపడి మరణించినట్లు బాధిత కుటుంబం చెబుతోంది.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
ఈ ఘటనపై సీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హఫీజ్పై బెదిరించి, దాడి చేసిన ఐదుగురి పేర్లపై బెంగాల్ పోలీసులు చర్యలు తీసుకోలేదని సీజేపీ ఆరోపిస్తోంది. నిందితుల్ని అరెస్ట్ చేయాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. సీజేపీ ప్రతినిధి అశుతోష్ రాంకా టీమ్ బంకురాలోని హఫీజ్ కుటుంబాన్ని కలిసింది. ఈ ఘటనలో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు.
నిందితులందరిపై ఎఫ్ఐఆర్, పోలీసులు దురుసు ప్రవర్తనపై దర్యాప్తు, బాధిత కుటుంబానికి 24 గంటల భద్రత, హఫీజ్ తండ్రి పేరుతో పాఠశాల ఏర్పాటు చేయాలనే 4 డిమాండ్లను సీజేపీ బీజేపీ ప్రభుత్వం ముందుంచింది. ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే బంకురా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీజేపీ హెచ్చరించింది. మరోవైపు, బీజేపీ కార్యకర్తల బెదిరింపులతో బంకురాలో నిర్వహించాల్సిన సమావేశాన్ని రద్దు చేయాల్సి వచ్చిందని సీజేపీ ప్రతినిధి అశుతోష్ రాంకా ఆరోపించారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!