Meruga Nagarjuna: చంద్రబాబుది కుట్ర రాజకీయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు మంత్రి మేరుగ నాగార్జున. టీడీపీ అభిప్రాయాలని ఇతర మార్గాల ద్వారా చెప్పించారు. సంక్షేమ పథకాలు ఆగిపోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఈ కుట్రలని గమనించాలని కోరుతున్నా. అంబేద్కర్, పూలే , పెరియార్ రామస్వామి ఆలోచనలు ఈ రోజు అమలవుతున్నాయి. చంద్రబాబుకి ఎవరైనా ఓటేస్తే ఈ పథకాలు ఆపేస్తామని చెప్పకనే చెప్పారు. జగనన్న అమ్మ ఒడి ద్వారా 44 లక్షలపైన తల్లులకి అమలు చేస్తున్నాం అన్నారు మంత్రి మేరుగ నాగార్జున.
ఈ పథకాన్ని ఆపాలనా చంద్రబాబు ఉద్దేశం..? రైతు భరోసా ద్వారా రూ. 20162 కోట్లు రైతులకి అందిస్తుంటే ఈ పధకాన్ని అందకుండా చేయాలని టీడీపీ కుట్ర. చేస్తోందన్నారు. రూ. 9180 కోట్లు చేయూత ద్వారా అందిస్తుంటే ఈ పధకాన్ని ఆపాలనా మీ కుట్రలు..? అని మండిపడ్డారు మంత్రి మేరుగ నాగార్జున. 78.75 లక్షల వైఎస్సార్ ఆసరా ద్వారా రూ. 12756 కోట్లు అందిస్తుంటే ఈ పధకాన్ని ఆపాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.
Also Read
- Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
- 108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- AP Government: భూ కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమం ఆపడానికి కోర్డులకి వెళ్లారు. నాడు నేడులో పాఠశాలలు, ఆసుపత్రులు తీర్చి దిద్దుతుంటే ఆ పధకాన్ని ఆపాలని కుట్రలు జరుగుతున్నాయి. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీనిచ్చి చేతులెత్తేసింది చంద్రబాబు కాదా..? అని మంత్రి నాగార్జున ప్రశ్నించారు. పేదల అండగా ప్రభుత్వం సంక్షేమ పధకాలు అమలు చేస్తుంటే ఎందుకీ కుట్రలు చేస్తున్నారు..? ఈ పథకాలన్నీ ఆపాలని పక్కా ప్రణాళికతో విషం చిమ్ముతున్నారు.
కోవిడ్ సమయంలోనూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమపధకాలే నిరుపేదలకి అండగా నిలిచింది వాస్తవం కాదా..? సీఎం వైఎస్ జగన్ నేరుగా ప్రజలకే రూ. 1.40 కోట్లు డీబీటీ ద్వారా అందించడం తప్పా..? 70 శాతం మంత్రి పదవులకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి సీఎం వైఎస్ జగన్ అవకాశమిస్తే నీ క్యాబినెట్లో ఎస్టి, మైనార్టీలకి అవకాశమే ఇవ్వలేదన్నారు మంత్రి నాగార్జున.
Read Also:MP Santosh Kumar: మట్టిని కాపాడుకుందాం.. మొక్కను బతికించుకుందాం
తాజావార్తలు
-
Yadagirigutta: మెగా ఫ్యామిలీకి గుడ్ న్యూస్.. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డులో కొనిదెల సురేఖకు చోటు
-
Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Home Tips: వర్షాలు మొదలయ్యాక ఇంట్లో ఈగలు ఎక్కువయ్యాయా? ఇలా చేయండి
-
Redmi K90 Ultra: రెడ్ మీ K90 అల్ట్రా రిలీజ్.. 8,550mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ తో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!