Mehbooba Mufti: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన పీడీపీ అధినేత్రి..
- ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ
- నేషనల్ కాన్ఫరెన్స్.. కాంగ్రెస్ కూటమిపై కీలక వ్యాఖ్యలు
- ఆ పార్టీల పొత్తుకు ఎజెండా లేదు- మెహబూబా ముఫ్తీ
- కేవలం సీట్ల పంపకం కోసమైతే తాము ఏ కూటమిలోనూ చేరబోం- ముఫ్తీ
- తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీల పొత్తుకు ఎజెండా లేదని.. కేవలం సీట్ల పంపకం కోసమైతే తాము ఏ కూటమిలోనూ చేరబోమని చెప్పారు. “మా మేనిఫెస్టోను ఆమోదించడానికి, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి అంగీకరించడానికి ఎన్సి.. కాంగ్రెస్ సిద్ధంగా ఉంటే మేము ఏ స్థానంలోనూ పోరాడకుండా వారికి మద్దతు ఇస్తాము” అని ఆమె తెలిపారు. తమ ఎజెండా జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కరించడమేనని పేర్కొన్నారు.
Read Also: Minister Narayana: డిసెంబర్ మొదటి వారం నుంచి అమరావతి నిర్మాణ పనులు
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
మేనిఫెస్టోకు సంబంధించి.. నియంత్రణ రేఖ వెంబడి భారతదేశం, పాకిస్తాన్ మధ్య వాణిజ్యాన్ని పునరుద్ధరించాలని మెహబూబా ముఫ్తీ తెలిపారు. పాకిస్థాన్తో చర్చలు కోరుకుంటున్నట్లు మేనిఫెస్టోలో తెలిపిది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని శారదా పీఠానికి మార్గం తెరవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అలాగే.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ, కాంట్రాక్టు అధ్యాపకుల గౌరవ వేతనం పెంపు.. పేదలకు సరిపడా బియ్యం, రేషన్.. పేద కుటుంబాలకు ఏడాదిలో 12 సిలిండర్లు అందజేస్తామన్నారు.
Read Also: Jammu Kashmir: మరోసారి కాల్పుల మోత.. ఉగ్రవాదులు-భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్
జమ్ముకశ్మీర్లోని 90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. కాగా.. అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!