Jammu Kashmir: మరోసారి కాల్పుల మోత.. ఉగ్రవాదులు-భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్
- జమ్మూకశ్మీర్లోని సోపోర్ ప్రాంతంలో మరోసారి కాల్పుల మోత
- ఉగ్రవాదులు.. భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకశ్మీర్లోని సోపోర్ ప్రాంతంలో మరోసారి కాల్పుల మోత మోగుతుంది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కాగా.. ఈ సమాచారాన్ని చినార్ కార్ప్స్ శనివారం ‘X’ ద్వారా తెలిపారు. ‘వాటర్గామ్లో ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారని చెప్పారు. అప్రమత్తమైన సైనికులు వెంటనే ప్రతీకారం తీర్చుకున్నారు. ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయి. అలాగే పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.’ అని పేర్కొన్నారు.
Read Also: TG ICET: టీజీ ఐసెట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారు..
Also Read
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ 'వాటర్ బాయ్'గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
- 2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
కాగా.. సోమవారం తెల్లవారుజామున ఉధంపూర్ జిల్లాలో పెట్రోలింగ్ చేస్తున్న భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) ఇన్స్పెక్టర్ మృతి చెందారు. అలాగే.. మధ్యాహ్నం 3.30 గంటలకు బసంత్గఢ్లోని డూడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చిల్ ప్రాంతంలో CRPF, జమ్మూ కాశ్మీర్ పోలీసుల SOG పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్ 187వ బెటాలియన్కు చెందిన ఇన్స్పెక్టర్ కులదీప్ కుమార్ చనిపోయాడు.
Read Also: UP: వరకట్న హత్య కేసులో భర్త, అత్తమామలకు జీవిత ఖైదు
మరోవైపు.. గత వారం ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించిన నేపథ్యంలో భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయి. సెప్టెంబర్ 18న మొదటి దశలో ఓటింగ్ జరగనున్న కాశ్మీర్లోని వివిధ అసెంబ్లీ స్థానాలకు గురువారం ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ), అప్నీ పార్టీ నుంచి ఇద్దరు చొప్పున.. నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ కాన్ఫరెన్స్ నుంచి ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థి కూడా తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. జమ్మూ కాశ్మీర్ మాజీ మంత్రి, సీనియర్ ఎన్సి నాయకురాలు సకీనా ఇటు కుల్గాం జిల్లాలోని దమ్హాల్ హంజి పోరా నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కశ్మీర్ లోయలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ పత్రాల దాఖలుకు ఆగస్టు 27 చివరి తేదీ. తొలి దశలో జమ్మూ ప్రాంతంలోని ఎనిమిది స్థానాలకు ఓటింగ్ జరగనుంది.
తాజావార్తలు
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!