Jammu Kashmir: మరోసారి కాల్పుల మోత.. ఉగ్రవాదులు-భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్
- జమ్మూకశ్మీర్లోని సోపోర్ ప్రాంతంలో మరోసారి కాల్పుల మోత
- ఉగ్రవాదులు.. భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు.
జమ్మూకశ్మీర్లోని సోపోర్ ప్రాంతంలో మరోసారి కాల్పుల మోత మోగుతుంది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కాగా.. ఈ సమాచారాన్ని చినార్ కార్ప్స్ శనివారం ‘X’ ద్వారా తెలిపారు. ‘వాటర్గామ్లో ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారని చెప్పారు. అప్రమత్తమైన సైనికులు వెంటనే ప్రతీకారం తీర్చుకున్నారు. ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయి. అలాగే పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.’ అని పేర్కొన్నారు.
Read Also: TG ICET: టీజీ ఐసెట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారు..
Also Read
- Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
- AC Health Risks: గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా..? ఈ వ్యాధులకు కారణం కావచ్చు..! ఏం చేయాలి..
- Top Selling CNG Cars: భారత్లో అత్యధికంగా సేల్ అయిన CNG కార్లు ఇవే..
- Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!
కాగా.. సోమవారం తెల్లవారుజామున ఉధంపూర్ జిల్లాలో పెట్రోలింగ్ చేస్తున్న భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) ఇన్స్పెక్టర్ మృతి చెందారు. అలాగే.. మధ్యాహ్నం 3.30 గంటలకు బసంత్గఢ్లోని డూడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చిల్ ప్రాంతంలో CRPF, జమ్మూ కాశ్మీర్ పోలీసుల SOG పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్ 187వ బెటాలియన్కు చెందిన ఇన్స్పెక్టర్ కులదీప్ కుమార్ చనిపోయాడు.
Read Also: UP: వరకట్న హత్య కేసులో భర్త, అత్తమామలకు జీవిత ఖైదు
మరోవైపు.. గత వారం ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించిన నేపథ్యంలో భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయి. సెప్టెంబర్ 18న మొదటి దశలో ఓటింగ్ జరగనున్న కాశ్మీర్లోని వివిధ అసెంబ్లీ స్థానాలకు గురువారం ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ), అప్నీ పార్టీ నుంచి ఇద్దరు చొప్పున.. నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ కాన్ఫరెన్స్ నుంచి ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థి కూడా తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. జమ్మూ కాశ్మీర్ మాజీ మంత్రి, సీనియర్ ఎన్సి నాయకురాలు సకీనా ఇటు కుల్గాం జిల్లాలోని దమ్హాల్ హంజి పోరా నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కశ్మీర్ లోయలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ పత్రాల దాఖలుకు ఆగస్టు 27 చివరి తేదీ. తొలి దశలో జమ్మూ ప్రాంతంలోని ఎనిమిది స్థానాలకు ఓటింగ్ జరగనుంది.
తాజావార్తలు
-
Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
-
TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు
-
Bhuvneshwar Kumar Record: దూసుకెళ్తున్న స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్.. జస్ప్రీత్ బుమ్రా రికార్డు బ్రేక్!
-
AC Health Risks: గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా..? ఈ వ్యాధులకు కారణం కావచ్చు..! ఏం చేయాలి..
-
Top Selling CNG Cars: భారత్లో అత్యధికంగా సేల్ అయిన CNG కార్లు ఇవే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!