Jammu Kashmir: మరోసారి కాల్పుల మోత.. ఉగ్రవాదులు-భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్
- జమ్మూకశ్మీర్లోని సోపోర్ ప్రాంతంలో మరోసారి కాల్పుల మోత
- ఉగ్రవాదులు.. భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకశ్మీర్లోని సోపోర్ ప్రాంతంలో మరోసారి కాల్పుల మోత మోగుతుంది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కాగా.. ఈ సమాచారాన్ని చినార్ కార్ప్స్ శనివారం ‘X’ ద్వారా తెలిపారు. ‘వాటర్గామ్లో ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారని చెప్పారు. అప్రమత్తమైన సైనికులు వెంటనే ప్రతీకారం తీర్చుకున్నారు. ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయి. అలాగే పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.’ అని పేర్కొన్నారు.
Read Also: TG ICET: టీజీ ఐసెట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారు..
Also Read
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్చుక్ సందేశం
కాగా.. సోమవారం తెల్లవారుజామున ఉధంపూర్ జిల్లాలో పెట్రోలింగ్ చేస్తున్న భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) ఇన్స్పెక్టర్ మృతి చెందారు. అలాగే.. మధ్యాహ్నం 3.30 గంటలకు బసంత్గఢ్లోని డూడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చిల్ ప్రాంతంలో CRPF, జమ్మూ కాశ్మీర్ పోలీసుల SOG పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్ 187వ బెటాలియన్కు చెందిన ఇన్స్పెక్టర్ కులదీప్ కుమార్ చనిపోయాడు.
Read Also: UP: వరకట్న హత్య కేసులో భర్త, అత్తమామలకు జీవిత ఖైదు
మరోవైపు.. గత వారం ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలను ప్రకటించిన నేపథ్యంలో భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయి. సెప్టెంబర్ 18న మొదటి దశలో ఓటింగ్ జరగనున్న కాశ్మీర్లోని వివిధ అసెంబ్లీ స్థానాలకు గురువారం ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ), అప్నీ పార్టీ నుంచి ఇద్దరు చొప్పున.. నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ కాన్ఫరెన్స్ నుంచి ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థి కూడా తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. జమ్మూ కాశ్మీర్ మాజీ మంత్రి, సీనియర్ ఎన్సి నాయకురాలు సకీనా ఇటు కుల్గాం జిల్లాలోని దమ్హాల్ హంజి పోరా నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కశ్మీర్ లోయలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ పత్రాల దాఖలుకు ఆగస్టు 27 చివరి తేదీ. తొలి దశలో జమ్మూ ప్రాంతంలోని ఎనిమిది స్థానాలకు ఓటింగ్ జరగనుంది.
తాజావార్తలు
-
Chand Mera Dil OTT: థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో ‘ధురందర్ 2’ని క్రాస్ చేసిన రొమాంటిక్ మూవీ
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!