Uttarpradesh : భార్య చితాభస్మంలో షాకింగ్ వస్తువు కనుగొన్న భర్త.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని మీరట్లో వైద్యుల నిర్లక్ష్యం ఉదంతం వెలుగు చూసింది. ఇక్కడ ప్రసవ సమయంలో ఓ గర్భిణి అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెకు ఆపరేషన్ చేశారు. అయితే కాసేపటి తర్వాత డాక్టర్లు ఆ మహిళ కుటుంబసభ్యులకు చేదువార్త చెప్పారు. ‘మేము ఆమెను రక్షించలేకపోయాము. తనతో పాటు చిన్నారి కూడా మృతి చెందింది.’ ఇది విన్న వెంటనే కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఆసుపత్రి ఫార్మాలిటీస్ పూర్తి చేసి మహిళ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత వారికి అంత్యక్రియలు నిర్వహించారు. భార్య చితి బూడిదలో ఏదో కనిపించింది. ఇది భర్తను షాక్కు గురిచేసింది.
Read Also:Kejriwal Health Condition: కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై తీహార్ జైలు అధికారులు క్లారిటీ..?
Also Read
- POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
విషయం హస్తినాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాథోరా ఖుర్ద్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇక్కడ నివసిస్తున్న సందీప్ భార్య నవనీత్ కౌర్ ప్రసవం కోసం మీరట్లోని మవానా పట్టణంలోని జెకె ఆసుపత్రిలో చేరారు. అయితే సర్జరీ సమయంలోనే చనిపోయారు. అనంతరం కుటుంబ సభ్యులు మహిళను శ్మశాన వాటికలో దహనం చేశారు. చితి కాలిపోవడంతో కుటుంబ సభ్యులు చితాభస్మాన్ని సేకరించేందుకు వచ్చారు. అప్పుడు మృతురాలి భర్తకు అక్కడ సర్జికల్ బ్లేడ్ కనిపించింది. బ్లేడు తీసుకుని నేరుగా పోలీసుల వద్దకు వెళ్లాడు. మహిళకు ఆపరేషన్ సమయంలో, అదే సర్జికల్ బ్లేడ్ ఆమె కడుపులో మిగిలిపోయిందని, దాని కారణంగా ఆమె చనిపోయిందని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో వైరల్గా మార్చారు.
Read Also:Supreme Court: ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంలో విచారణ.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
అంత్యక్రియల చితిలో నుంచి బ్లేడ్ బయటకు రావడంతో కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు. కుటుంబ సమేతంగా సీఎంఓ కార్యాలయానికి కూడా వెళ్లారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆసుపత్రి లైసెన్స్ను సస్పెండ్ చేశారు. దీంతోపాటు విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. వైద్యులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని కూడా అనుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పుడు దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి దీనిపై విచారణ జరుపుతారు. ఆరోపణలు నిజమని తేలితే వైద్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
తాజావార్తలు
-
Sunny Leone: అడ్డంగా బుక్కైన సన్నీలియోన్.. రంగంలోకి దిగిన సీఐడీ! అసలేం జరిగిందంటే..
-
POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!