Uttarpradesh : భార్య చితాభస్మంలో షాకింగ్ వస్తువు కనుగొన్న భర్త.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని మీరట్లో వైద్యుల నిర్లక్ష్యం ఉదంతం వెలుగు చూసింది. ఇక్కడ ప్రసవ సమయంలో ఓ గర్భిణి అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెకు ఆపరేషన్ చేశారు. అయితే కాసేపటి తర్వాత డాక్టర్లు ఆ మహిళ కుటుంబసభ్యులకు చేదువార్త చెప్పారు. ‘మేము ఆమెను రక్షించలేకపోయాము. తనతో పాటు చిన్నారి కూడా మృతి చెందింది.’ ఇది విన్న వెంటనే కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఆసుపత్రి ఫార్మాలిటీస్ పూర్తి చేసి మహిళ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత వారికి అంత్యక్రియలు నిర్వహించారు. భార్య చితి బూడిదలో ఏదో కనిపించింది. ఇది భర్తను షాక్కు గురిచేసింది.
Read Also:Kejriwal Health Condition: కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై తీహార్ జైలు అధికారులు క్లారిటీ..?
Also Read
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
విషయం హస్తినాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాథోరా ఖుర్ద్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇక్కడ నివసిస్తున్న సందీప్ భార్య నవనీత్ కౌర్ ప్రసవం కోసం మీరట్లోని మవానా పట్టణంలోని జెకె ఆసుపత్రిలో చేరారు. అయితే సర్జరీ సమయంలోనే చనిపోయారు. అనంతరం కుటుంబ సభ్యులు మహిళను శ్మశాన వాటికలో దహనం చేశారు. చితి కాలిపోవడంతో కుటుంబ సభ్యులు చితాభస్మాన్ని సేకరించేందుకు వచ్చారు. అప్పుడు మృతురాలి భర్తకు అక్కడ సర్జికల్ బ్లేడ్ కనిపించింది. బ్లేడు తీసుకుని నేరుగా పోలీసుల వద్దకు వెళ్లాడు. మహిళకు ఆపరేషన్ సమయంలో, అదే సర్జికల్ బ్లేడ్ ఆమె కడుపులో మిగిలిపోయిందని, దాని కారణంగా ఆమె చనిపోయిందని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో వైరల్గా మార్చారు.
Read Also:Supreme Court: ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంలో విచారణ.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
అంత్యక్రియల చితిలో నుంచి బ్లేడ్ బయటకు రావడంతో కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు. కుటుంబ సమేతంగా సీఎంఓ కార్యాలయానికి కూడా వెళ్లారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆసుపత్రి లైసెన్స్ను సస్పెండ్ చేశారు. దీంతోపాటు విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. వైద్యులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని కూడా అనుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పుడు దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి దీనిపై విచారణ జరుపుతారు. ఆరోపణలు నిజమని తేలితే వైద్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!