Medaram Jatara 2024: నేటి నుంచి మేడారం జాతరలో ప్రత్యేక పూజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medaram: మేడారం జాతరలో ప్రత్యేక పూజలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఈ ఉత్సవంతో జాతర ఆరంభమవుతుందని పూజారులు పేర్కొన్నారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుక ఇవాళ ఉదయం నుంచి రేపు వేకువజాము వరకు కొనసాగుతుంది. మేడారంలోని సమ్మక్క దేవత పూజా మందిరం, కన్నెపల్లి సారలమ్మ గుడి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో పగిడిద్దరాజు, గోవిందరాజు ఆలయాల్లో ఈ ఉత్సవాలు జరుపుతారు. కాగా, పూర్వకాలంలో ఈ గుడుల స్థానంలో గుడిసెలు ఉంటుండే.. రెండేళ్లకు ఇవి పాతబడి పోవడంతో.. పూజారులు అడవికి వెళ్లి చెట్టుకొమ్మలు, వాసాలు, గడ్డి తీసుకువచ్చి దేవుళ్లకు కొత్తగా గుడిని నిర్మించి పండగ చేసుకునే వారు. దీన్నే మండమెలిగే పండగగా పిలుస్తారు. ఇక, పూజారులందరూ ఆచారం ప్రకారం తలో పని చేసి పగలంతా మండమెలిగి, రాత్రంతా దేవతల గద్దెలపై జాగారం చేయనున్నారు.
Read Also: Today Gold Price: తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఇవే!
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
కాగా, ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగనుంది. 21న కన్నేపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు గద్దెనెక్కడంతతో జాతర షురూ ప్రారంభమవుతుంది. అయితే, 22 రోజున చిలకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారు గద్దె మీదకు తీసుకు వచ్చేటప్పుడు భక్తజనం పోటెత్తుతారు. ఇక, 23 రోజున అమ్మవార్లకు భక్తులు మొక్కుబడులు సమర్పించుకుంటారు. ఇక చివరి రోజైన 24వ తేదీన అమ్మవార్లు వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. అయితే, రెండేళ్లకొకసారి జరిగే ఈ జాతరకు అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి వనదేవతలను దర్శించుకుంటారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!