INDvsPAK: రోహిత్ ఆ ముగ్గురితో జర జాగ్రత్త..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్-2023 టోర్నమెంట్ లో తమ తొలి మ్యాచ్లో టీమిండియా తప్పక గెలుస్తుందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ అన్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఓడించి రోహిత్ సేన టోర్నీలో శుభారంభం చేస్తుందని ఆయన పేర్కొన్నాడు. అయితే, పాక్ పేస్ దళం వ్యూహాలను భారత బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కోవాలి.. లేకపోతే చేదు అనుభవం తప్పదని హెడెన్ వార్నింగ్ ఇచ్చాడు. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో రేపు (శనివారం) టీమిండియా- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. గ్రూప్-ఏలో భాగమైన నేపాల్పై ఘన విజయంతో ఆధిక్యంలో ఉన్న పాక్ తదుపరి మ్యాచ్లో భారత్ తో పోటి పడుతుంది అని మాథ్యూ హెడెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
Read Also: Oxygen-28: ఆక్సిజన్ కొత్త రూపాన్ని కనుగొన్న సైంటిస్టులు.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..?
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఈ భూగ్రహం మీద అత్యంత ఆసక్తికర మ్యాచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు అని మథ్యూ హెడెన్ అన్నారు. అయితే, పాకిస్తాన్ పేస్ విషయంలో టీమిండియా కాస్త జాగ్రత్తగా ఉండాలని తెలిపాడు. షాహిన్ ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్, నసీం షా.. వైవిధ్యం కలిగిన బౌలర్లు అంటూ ఆయన పేర్కొన్నారు. భారత బ్యాటర్ల కోసం ఇప్పటికే వ్యూహాలు రెడీ చేసుకున్నారు.. క్యాండీలో బౌన్సీ వికెట్కు ఛాన్స్ ఉంది.. కాబట్టి పేసర్ల విషయంలో ముఖ్యంగా రవూఫ్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి.. ఒక్కసారి పట్టు దొరికితే భారత బ్యాటింగ్ ఆర్డర్ను అతలాకుతలం చేస్తాడని హెడెన్ చెప్పాడు.
Read Also: Yemo Yemo: ‘ఏందిరా ఈ పంచాయితీ’ నుండి ఏమో ఏమో సాంగ్ రిలీజ్
ఇక షాహిన్ ఆఫ్రిది.. గత వరల్డ్కప్ టైంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే!.. షాహిన్ ప్రారంభంలోనే వికెట్లు తీసుకోవడం.. ముఖ్యంగా టీమిండియా సారథి రోహిత్ శర్మను అద్భుత బంతితో అవుట్ చేసిన తీరు ఎవరూ మర్చిపోలేరు.. కాబట్టి ఈసారి షాహిన్ ఆఫ్రిది బౌలింగ్ ను ఎదుర్కొనేటపుడు రోహిత్ శర్మ అత్యంత జాగ్రత్తగా ఉండాలి అని హెడెన్ తెలిపాడు. ముఖ్యంగా అతడి బౌలింగ్లో మొదటి మూడు ఓవర్లలో జర చూసుకోని ఆడాలని సూచించాడు. అయితే, పటిష్ట టీమిండియా బ్యాటర్లు పాక్ బౌలర్లపై ఒత్తిడి పెంచగలరని.. తద్వారా జట్టుకు విజయం అందించగలరని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!