Delhi: దేశ రాజధానిని వేధిస్తోన్న విద్యుత్ సంక్షోభం.. ప్రజలు తీవ్ర ఇక్కట్లు
- దేశ రాజధాని ఢిల్లీకి మరో కొత్త సంక్షోభం
- నీటి సంక్షోభంతో పాటు కరెంట్ కష్టాలు
- మంగళవారం నిలిచిన విద్యుత్ సరఫరా
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే నీటి సంక్షోభంతో అల్లాడుతోంది. ఓ వైపు తీవ్రమైన ఎండ.. ఇంకోవైపు నీటి కొరత.. ఇలా ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే.. తాజాగా మరో కొత్త కష్టం వచ్చి పడింది. రాజధాని ప్రాంతంలో చాలా చోట్ల విద్యుత్ కోతలు మొదలయ్యాయి. తాగునీళ్లతోనే అష్టకష్టాలు పడుతుంటే.. ఇప్పుడు కరెంట్ కష్టాలు కూడా తోడవ్వడంతో నగర వాసులు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే కేంద్రం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆప్ మంత్రి అతిషి డిమాండ్ చేసింది. ఈ మేరకు కొత్తగా బాధ్యతలు తీసుకున్న కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ను కలిసి సమస్య వివరిస్తామని అతిషి తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని మండోలాలోని పీజీసీఐఎల్ సబ్ స్టేషన్లో మంటలు చెలరేగాయి. అక్కడ నుంచి ఢిల్లీకి 1,500 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతుంది. ప్రస్తుతం అగ్నిప్రమాదం సంభవించి సబ్ స్టేషన్ కాలిపోవడంతో ఢిల్లీకి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇది కూడా చదవండి: Toothache : ఈ చిన్న చిట్కాలు పాటిస్తే.. పంటి నొప్పి నుంచి ఉపశమనం ఖాయం!
Also Read
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
- Bhojshala case: భోజ్శాల ఒక దేవాలయం.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం కూడా తీవ్రమైన ఎండలు ఉన్నాయి. 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఓ వైపు ఎండలు.. ఇంకోవైపు విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ ఇబ్బంది కరణంగా మారింది. ఉక్కపోతతో బెంబేలెత్తిపోతున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదికగా విద్యుత్ కోతలపై నెటిజన్లు కంప్లంట్లు చేస్తున్నారు. తక్షణమే విద్యుత్ కోతలను నివారించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆప్ మంత్రి అతిషి స్పందించారు. కేంద్రంతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Seethakka: ప్రజా భవన్ను మంత్రి సీతక్క ఆకస్మిక సందర్శన.. ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ
#WATCH | Delhi Minister Atishi says, "A fire broke out in a sub-station of PGCIL in Mandola, Uttar Pradesh, from where Delhi gets 1,500MW of power and due to the fire there, there has been a power cut in many parts of Delhi… This is a very serious issue… I will seek time… pic.twitter.com/2V6OCjKXAT
— ANI (@ANI) June 11, 2024
తాజావార్తలు
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Bhojshala case: భోజ్శాల ఒక దేవాలయం.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!