Operation Sindoor : మోస్ట్ వాంటెడ్.. జైషే ఉగ్రవాది మసూద్ అజార్ సోదరుడు హతం
- మసూద్ అజార్ సోదరుడు మృతి
- IC-814 ఫైట్ను హైజాక్ చేసిన అబ్దుల్
- జిహాదీ నెట్ వర్క్లలోనూ కీలకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఆపరేషన్ సిందూర్’ లో భాగంగా భారత్ చేపట్టిన వైమానిక దాడిలో ఇప్పటికే 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అయితే.. ఈ దాడిలో జైషేను స్థాపించిన మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది కూడా హతమైన విషయం తెలిసిందే. మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా ఈ దాడిలో ప్రాణాలు కొల్పోయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. అబ్దుల్ రవూఫ్ అజార్ కందహార్లో IC-814 ఫైట్ను హైజాక్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ జిహాదీ నెట్ వర్క్లలోనూ అజార్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు.
READ MORE: YS Jagan: మనం గట్టిగా మూడేళ్లు పోరాడితే.. ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే..
Also Read
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
- Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
- DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
- BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
కాగా.. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంతో భారత్ ప్రారంభించిన ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. మంగళవారం అర్ధరాత్రి 1.05 నుంచి 1.30 గంటల మధ్య భారత సైన్యం ఆపరేషన్ ముగించింది. భారత్ జరిపిన దాడుల్లో పాకిస్థాన్ పంజాబ్లోని బహావల్పూర్, మురీద్కే, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కోట్లీ, ముజఫరాబాద్ లక్ష్యాలుగా మారాయి. బహావల్పూర్, మురీద్కేలు ప్రత్యేక టార్గెట్ అయ్యాయి. ఎందుకంటే ఈ రెండూ జైషే మహమ్మాద్, లష్కరే తొయిబా ఉగ్రసంస్థలకు ప్రధాన కేంద్రాలు. 2019 పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన బాలాకోట్లో ఉగ్ర స్థావరాలపై దాడులు చేసినప్పుడు కూడా కోట్లీ, బహావల్పూర్ ప్రాంతాలను టార్గెట్గా చేసుకున్నాయి.
READ MORE: Ameer Khan : ‘మహాభారతం’లో కృష్ణుడి పాత్ర చేస్తా.. అమీర్ ఖాన్ క్లారిటీ..
తాజావార్తలు
-
Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
-
Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
-
DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?