India Pakistan War: 15 నగరాలపై దాడికి పాక్ యత్నం.. “పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ” ధ్వంసం..
- 15 నగరాలపై దాడికి పాకిస్తాన్ యత్నం..
- తిప్పికొట్టిన భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్..
- బదులుగా పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం..
- ప్రకటించిన భారత రక్షణ మంత్రిత్వ శాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan War: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించిన కొద్దిసేపటికే, భారత్ సంచలన విషయాన్ని వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్కి ప్రతిస్పందనగా పాకిస్తాన్ భారత్పై భారీ దాడికి ప్రయత్నించింది. దీంతో భారత్ సాయుధ దళాలు పాకిస్తాన్ ‘‘గగనతల రక్షణ వ్యవస్థ’’ని నాశనం చేసినట్లు ప్రకటించాయి. పాక్ భారత్లోని 15 నగరాలపై డ్రోన్-మిస్సైల్ దాడులు చేసేందుకు ప్రయత్నించిందని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Read Also: India Pakistan Tension: పాకిస్తాన్కి భారత్ బిగ్ షాక్.. చైనా HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ ధ్వంసం..
Also Read
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
‘‘మే 7 మరియు 8 తేదీల మధ్య రాత్రి, పాకిస్తాన్ అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరాలాయ్, భుజ్తో సహా ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలోని అనేక సైనిక లక్ష్యాలను డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి దాడి చేయడానికి ప్రయత్నించింది’’ అని అధికార ప్రకటనలో రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. S-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ పాక్ డ్రోన్లు, క్షిపణులను సమర్థవంతంగా అడ్డుకుని నాశనం చేసింది. చైనా తయారు చేసిన పాకిస్తాన్ HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ యూనిట్లను ఇజ్రాయెల్ తయారు చేసిన HAROP డ్రోన్లు ధ్వంసం చేసినట్లు, ప్రస్తుతం లాహోర్లోని పాక్ ఆర్మీ ఎలాంటి రక్షణ లేకుండా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
భారత సైన్యం గురువారం ఉదయం పాకిస్తాన్లోని అనేక ప్రాంతాల్లోని ఎయిర్ డిఫెన్స్, వైమానిక రక్షణ రాడార్లను, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు ప్రకటనలో పేర్కొంది. డ్రోన్లు మరియు క్షిపణులను ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్, రష్యా తయారు చేసిన S-400 ‘సుదర్శన్ చక్ర’ వైమానిక రక్షణ వ్యవస్థలు నాశనం చేసినట్లు భారత్ తెలిపింది. భారత్ దాడితో పాకిస్తాన్ లాహోర్, సియాల్కోట్, కరాచీ ఎయిర్పోర్టుల్ని పూర్తిగా మూసేసింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!