Manipur Violence: కోమ్ కమ్యూనిటీకి భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రికి మేరీకోమ్ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: మణిపూర్లో చెలరేగిన హింస ఇప్పటికీ ఆగే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు బాక్సింగ్ స్టార్ ఎంసీ మేరీకోమ్ తనకు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మణిపూర్లోని కోమ్ గ్రామాల్లోకి చొరబడుతున్న రెండు గ్రూపులను భద్రతా బలగాలు నిరోధించేలా జోక్యం చేసుకోవాలని మేరీ కోమ్ కోరింది. కోమ్ కమ్యూనిటీ అనేది మణిపూర్లోని ఆదివాసీ తెగ అని, ఇది మైనారిటీలలో అతి చిన్నదని, అందుకే అది ఏ శక్తివంతమైన వర్గంతోనూ పోరాడలేకపోతుందని లేఖలో పేర్కొన్నారు.
Also Read: INDIA’s Big Mumbai Decisions: ముంబయిలో ఇండియా కూటమి కీలక నిర్ణయాలు..!
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
గురువారం అమిత్ షాకు రాసిన లేఖలో.. మణిపూర్లోని ఆదివాసీ తెగ అయిన కోమ్ కమ్యూనిటీ మైనారిటీలలో అతి చిన్నది అని అన్నారు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మేరీ కోమ్ మాట్లాడుతూ.. మేమంతారెండు ప్రత్యర్థి వర్గాల మధ్య చెల్లాచెదురుగా ఉన్నామన్నారు. మా కమ్యూనిటీపై దాడులు జరుగుతాయనే భయాందోళనలతో ఉన్నామని, అన్ని సమస్యల మధ్య చిక్కుకున్నామన్నారు. కోమ్ కమ్యూనిటీ మైనారిటీలలో అతి చిన్నదని, అందుకే కోమ్ అధికార పరిధిలోకి చొరబడే ఏ శక్తికి వ్యతిరేకంగా తాము పోరాడలేకపోయామన్నారు.
Also Read: NEET SS exam 2023: జీ20 సమ్మిట్ కారణంగా నీట్ ఎస్ఎస్ పరీక్ష రీషెడ్యూల్
పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మేరీకోమ్ మాట్లాడుతూ.. యుద్ధంలో ఉన్న రెండు గ్రూపులు కోమ్ గ్రామాల్లోకి చొరబడకుండా నిరోధించడానికి తాము భద్రతా దళాల సహాయాన్ని కోరుతున్నామన్నారు. భారత సైన్యం, పారామిలటరీ, రాష్ట్ర బలగాలు జనాభాను రక్షించడానికి, రాష్ట్రంలో శాంతి,సాధారణ పరిస్థితులను కొనసాగించడంలో విజయం సాధించడానికి తమ బాధ్యతలను నిర్వహించడంలో నిష్పాక్షికంగా ఉండాలని అభ్యర్థించారు.మణిపూర్లోని ప్రజలందరినీ, ముఖ్యంగా మైతేయి, కుకీ కమ్యూనిటీల విభేదాలను పరిష్కరించి రాష్ట్రంలో శాంతి, సాధారణ స్థితిని పునరుద్ధరించాలని కోరారు. మనమందరం కలిసి జీవించాల్సిన అవసరం ఉందని, మనలోని విభేదాలు, గాయాలను పక్కనపెట్టి ఐక్యం చేద్దామని మేరీకోమ్ అన్నారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!