Manipur Violence: కోమ్ కమ్యూనిటీకి భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రికి మేరీకోమ్ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: మణిపూర్లో చెలరేగిన హింస ఇప్పటికీ ఆగే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు బాక్సింగ్ స్టార్ ఎంసీ మేరీకోమ్ తనకు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మణిపూర్లోని కోమ్ గ్రామాల్లోకి చొరబడుతున్న రెండు గ్రూపులను భద్రతా బలగాలు నిరోధించేలా జోక్యం చేసుకోవాలని మేరీ కోమ్ కోరింది. కోమ్ కమ్యూనిటీ అనేది మణిపూర్లోని ఆదివాసీ తెగ అని, ఇది మైనారిటీలలో అతి చిన్నదని, అందుకే అది ఏ శక్తివంతమైన వర్గంతోనూ పోరాడలేకపోతుందని లేఖలో పేర్కొన్నారు.
Also Read: INDIA’s Big Mumbai Decisions: ముంబయిలో ఇండియా కూటమి కీలక నిర్ణయాలు..!
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
గురువారం అమిత్ షాకు రాసిన లేఖలో.. మణిపూర్లోని ఆదివాసీ తెగ అయిన కోమ్ కమ్యూనిటీ మైనారిటీలలో అతి చిన్నది అని అన్నారు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మేరీ కోమ్ మాట్లాడుతూ.. మేమంతారెండు ప్రత్యర్థి వర్గాల మధ్య చెల్లాచెదురుగా ఉన్నామన్నారు. మా కమ్యూనిటీపై దాడులు జరుగుతాయనే భయాందోళనలతో ఉన్నామని, అన్ని సమస్యల మధ్య చిక్కుకున్నామన్నారు. కోమ్ కమ్యూనిటీ మైనారిటీలలో అతి చిన్నదని, అందుకే కోమ్ అధికార పరిధిలోకి చొరబడే ఏ శక్తికి వ్యతిరేకంగా తాము పోరాడలేకపోయామన్నారు.
Also Read: NEET SS exam 2023: జీ20 సమ్మిట్ కారణంగా నీట్ ఎస్ఎస్ పరీక్ష రీషెడ్యూల్
పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మేరీకోమ్ మాట్లాడుతూ.. యుద్ధంలో ఉన్న రెండు గ్రూపులు కోమ్ గ్రామాల్లోకి చొరబడకుండా నిరోధించడానికి తాము భద్రతా దళాల సహాయాన్ని కోరుతున్నామన్నారు. భారత సైన్యం, పారామిలటరీ, రాష్ట్ర బలగాలు జనాభాను రక్షించడానికి, రాష్ట్రంలో శాంతి,సాధారణ పరిస్థితులను కొనసాగించడంలో విజయం సాధించడానికి తమ బాధ్యతలను నిర్వహించడంలో నిష్పాక్షికంగా ఉండాలని అభ్యర్థించారు.మణిపూర్లోని ప్రజలందరినీ, ముఖ్యంగా మైతేయి, కుకీ కమ్యూనిటీల విభేదాలను పరిష్కరించి రాష్ట్రంలో శాంతి, సాధారణ స్థితిని పునరుద్ధరించాలని కోరారు. మనమందరం కలిసి జీవించాల్సిన అవసరం ఉందని, మనలోని విభేదాలు, గాయాలను పక్కనపెట్టి ఐక్యం చేద్దామని మేరీకోమ్ అన్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!