Raghuveera Reddy: ఏపీలో విన్నింగ్ షాట్ కొట్టడానికే మాణిక్కం ఠాకూర్ వచ్చాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ కాంగ్రెస్ కొత్త ఊపందుకుంది. ఏపీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్ గా మాణిక్కం ఠాకూర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారీ మార్పులు కనిపిస్తోంది. అందుకు తోడు.. షర్మిల కూడ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీలో జోష్ కనిపిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు కొందరు పార్టీలో చేరారు. సినిమా ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తి, బీఆర్ఎస్ నేతలు, జె.డి.లక్ష్మీనారాయణ అనుచరులు, వైసీపీ, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరారు.
Snoring: రాత్రిపూట గురకతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు..!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఈ సందర్భంగా సీడబ్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. ఈసారి ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారో చెప్పలేమన్నారు. క్రికెట్ లో విన్నింగ్ షాట్ కొట్టిన వాడు గుర్తుంటాడు.. తెలంగాణలో ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా మాణిక్కం ఠాకూర్ విన్నింగ్ షాట్ కొట్టాడని తెలిపారు. అదే తరహాలో.. ఏపీలో విన్నింగ్ షాట్ కొట్టడానికే మాణిక్కం ఠాకూర్ వచ్చాడని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. షర్మిల, రాహుల్ ను ప్రధానిని చేయడానికే వస్తున్నా అని వచ్చారని చెప్పారు. షర్మిల రాకను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు. తమ వాణిని అసెంబ్లీలో వినిపించడమే తమ లక్ష్యం అని రఘువీరారెడ్డి తెలిపారు. తమిళనాడులో కాంగ్రెస్ ను ఎవరూ వీడలేదని.. ఏపీలో కాంగ్రెస్ నుంచి కొందరు వెళ్ళిపొయారన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని.. రాహుల్ ప్రధాని అయితే మొదటి సంతకం ఏపీ ప్రత్యేక హోదా పైనే అని రఘువీరా పేర్కొన్నారు.
Karnataka: కర్ణాటక అసెంబ్లీ ముందు 8 మంది కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే..?
అనంతరం.. ఏపీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాకూర్ మాట్లాడుతూ.. మనకు 9 రోజులే సమయం ఉందన్నారు. మనకు చివర 5 ఓవర్లే ఉన్నాయి గెలవడానికి అని సూచించారు. మోదీ వస్తే పోలవరం రాదు.. మెట్రో రాదు అని అన్నారు. కాంగ్రెస్ వస్తే రాజశేఖరరెడ్డి ఆశయాలు నెరవేరుతాయన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ఏపీ నుంచీ 25 ఎంపీలు రావడం చాలా పెద్ద మార్పు తెస్తుందని తెలిపారు. కాగా.. బీజేపీపై విమర్శలు జల్లు కురింపించారు. బీ అంటే బాబు, జే అంటే జగన్, పీ అంటే పవన్ అంటే బీజేపీ అని అన్నారు. ఆ బీజేపీని మనం ఏపీలో ఓడించాలని తెలిపారు.
తాజావార్తలు
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!