Raghuveera Reddy: ఏపీలో విన్నింగ్ షాట్ కొట్టడానికే మాణిక్కం ఠాకూర్ వచ్చాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ కాంగ్రెస్ కొత్త ఊపందుకుంది. ఏపీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్ గా మాణిక్కం ఠాకూర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారీ మార్పులు కనిపిస్తోంది. అందుకు తోడు.. షర్మిల కూడ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీలో జోష్ కనిపిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు కొందరు పార్టీలో చేరారు. సినిమా ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తి, బీఆర్ఎస్ నేతలు, జె.డి.లక్ష్మీనారాయణ అనుచరులు, వైసీపీ, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరారు.
Snoring: రాత్రిపూట గురకతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు..!
Also Read
- Amol Muzumdar: భారత్కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
- Women's Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
ఈ సందర్భంగా సీడబ్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. ఈసారి ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారో చెప్పలేమన్నారు. క్రికెట్ లో విన్నింగ్ షాట్ కొట్టిన వాడు గుర్తుంటాడు.. తెలంగాణలో ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా మాణిక్కం ఠాకూర్ విన్నింగ్ షాట్ కొట్టాడని తెలిపారు. అదే తరహాలో.. ఏపీలో విన్నింగ్ షాట్ కొట్టడానికే మాణిక్కం ఠాకూర్ వచ్చాడని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. షర్మిల, రాహుల్ ను ప్రధానిని చేయడానికే వస్తున్నా అని వచ్చారని చెప్పారు. షర్మిల రాకను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు. తమ వాణిని అసెంబ్లీలో వినిపించడమే తమ లక్ష్యం అని రఘువీరారెడ్డి తెలిపారు. తమిళనాడులో కాంగ్రెస్ ను ఎవరూ వీడలేదని.. ఏపీలో కాంగ్రెస్ నుంచి కొందరు వెళ్ళిపొయారన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని.. రాహుల్ ప్రధాని అయితే మొదటి సంతకం ఏపీ ప్రత్యేక హోదా పైనే అని రఘువీరా పేర్కొన్నారు.
Karnataka: కర్ణాటక అసెంబ్లీ ముందు 8 మంది కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే..?
అనంతరం.. ఏపీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాకూర్ మాట్లాడుతూ.. మనకు 9 రోజులే సమయం ఉందన్నారు. మనకు చివర 5 ఓవర్లే ఉన్నాయి గెలవడానికి అని సూచించారు. మోదీ వస్తే పోలవరం రాదు.. మెట్రో రాదు అని అన్నారు. కాంగ్రెస్ వస్తే రాజశేఖరరెడ్డి ఆశయాలు నెరవేరుతాయన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ఏపీ నుంచీ 25 ఎంపీలు రావడం చాలా పెద్ద మార్పు తెస్తుందని తెలిపారు. కాగా.. బీజేపీపై విమర్శలు జల్లు కురింపించారు. బీ అంటే బాబు, జే అంటే జగన్, పీ అంటే పవన్ అంటే బీజేపీ అని అన్నారు. ఆ బీజేపీని మనం ఏపీలో ఓడించాలని తెలిపారు.
తాజావార్తలు
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer: అప్పుడు నాకు మరో ఆప్షన్ లేదు.. ఒక ఓవర్తో అతడిని నిందించొద్దు!
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ranabaali: ప్రెగ్నెంట్గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్లో విజయ్ స్పెషల్ హగ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!