Karnataka: కర్ణాటక అసెంబ్లీ ముందు 8 మంది కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: బెంగళూర్లోని కర్ణాటక అసెంబ్లీ ముందు 8మంది కుటుంబ సభ్యులు బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకు అప్పు తీర్చనందుకు తమ ఇంటిని బ్యాంకు వేలం వేయడంతో బాధలో ఆ కుటుంబ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. విధాన సౌద(కర్ణాటక అసెంబ్లీ) ముందు కుటుంబంలోని మహిళలు, పిల్లలతో సహా కుటుంబ సభ్యులు తమపై కిరోసిన్ పోసుకున్నారు. అయితే పోలీసులు త్వరగా జోక్యం చేసుకోవడంతో ఈ ఘటనను అడ్డుకోగలిగారు. వెంటనే వీరందర్ని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Congress: రామమందిర కార్యక్రమానికి వెళ్లేది లేదన్న కాంగ్రెస్ పార్టీ.. “అది ఆర్ఎస్ఎస్/బీజేపీ ఈవెంట్”..
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
- NEET paper leak: నీట్ పేపర్ లీక్పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బెంగుళూరు సిటీ కోఆపరేటివ్ బ్యాంక్లో 2016లో అల్లం సాగు వ్యాపారం చేసేందుకు రూ.50 లక్షలు రుణం తీసుకున్నామని, అయితే వ్యాపారంలో నష్టాలు వచ్చినట్లు ఆ కుటుంబం తమ బాధను పంచుకుంది. ఈఎంఐ తిరిగి చెల్లించడంలో కుటుంబం విఫలం కావడంతో, బ్యాంక్ వారి ఇంటిని వేలం వేసింది. దీంతోనే కుటుంబం మొత్తం ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ.3 కోట్ల విలువైన కుటుంబ నివాసాన్ని కేవలం రూ.1.41 కోట్లకు బ్యాంకు అధికారులు వేలం వేశారు. వీరిపై ఆత్మహత్య నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేశారు. తమ విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోక్యం చేసుకోవాలనే, బయటకు వచ్చామని, తమ బిడ్డలకు కడుపు నిండా తిండిపెట్టేందుకు కూడా డబ్బులు లేదని సదరు కుటుంబం చెప్పింది.
తాజావార్తలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
-
Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
-
Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
-
Drugs : రాపిడో, జొమాటో కొంపముంచుతున్న డెలివరీ బాయ్స్.. మెహదీపట్నంలో పట్టుబడ్డ ముఠా..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..