Manish Sisodia: నేడు కోర్టుకు మనీష్ సిసోడియా.. దేశవ్యాప్త నిరసనలకు ఆప్ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ నేడు దేశవ్యాప్తంగా నిరసనలు ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు బలగాలను మోహరించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన డిప్యూటీ మనీష్ సిసోడియా అరెస్టును డర్టీ పాలిటిక్స్ అని అన్నారు. ఈ అరెస్ట్పై ప్రజలే సమాధానం చెప్తారని కేజ్రీవాల్ హెచ్చరించారు. ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ తెలిపారు. దేశంలోని లక్షలాది మంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దిన గొప్ప విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ఫేక్ కేసులో అరెస్టయ్యారని, దీనికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతుందని పాఠక్ ట్వీట్లో పేర్కొన్నారు. సిసోడియా అరెస్టుపై ఆప్ ఈరోజు బ్లాక్ డేగా పాటిస్తున్నట్లు ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.
మనీష్ సిసోడియాను ఉంచిన సీబీఐ ప్రధాన కార్యాలయంతో సహా దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు బలగాలను మోహరించారు. ఈరోజు సీబీఐ ప్రధాన కార్యాలయం వెలుపల పెద్ద సంఖ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు గుమిగూడే అవకాశం ఉందని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు దేశ రాజధానిలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్లోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం వెలుపల కూడా ఆప్ నిరసన చేపట్టాలని యోచిస్తోంది. దేశ రాజధానిలో కొత్త మద్యం విక్రయ విధానాన్ని తీసుకురావడంలో మనీష్ సిసోడియా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2021 పాలసీ రూపకల్పనలో మద్యం కంపెనీలు పాలుపంచుకున్నాయని, దీని కోసం “సౌత్ గ్రూప్” అని పిలిచే మద్యం లాబీ ద్వారా రూ.30 కోట్ల వరకు కిక్బ్యాక్లు చెల్లించారని సీబీఐ వాదిస్తోంది.
Also Read
- YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
- Maharashtra: ఆర్మీ ట్రైనింగ్ స్కూల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. ప్రేయసికి ప్రపోజ్ చేసిన కెప్టెన్.. రియాక్షన్ ఇదే!
- AP Weather Alert: వాతావరణ హెచ్చరిక.. 10 జిల్లాల్లో వర్షాలు, పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
- Ponnam Prabhakar : తెలంగాణ మా అయ్యా జాగిరే.. పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్
Read Also: Mechanical Elephant: ఆలయంలో ఆచారాలను నిర్వహించేందుకు రోబోటిక్ ఏనుగు.. తొలిసారిగా..
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సిసోడియాను ఆదివారం ఎనిమిది గంటల పాటు విచారించిన తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) నిన్న సిసోడియాను అరెస్టు చేసింది. సిసోడియా ఢిల్లీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రధాన కార్యాలయంలో రాత్రి గడిపారు. ఈరోజు ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి మధ్యాహ్నం 2 గంటలకు సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు.
తాజావార్తలు
-
YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
-
Maharashtra: ఆర్మీ ట్రైనింగ్ స్కూల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. ప్రేయసికి ప్రపోజ్ చేసిన కెప్టెన్.. రియాక్షన్ ఇదే!
-
AR Rahman: అల్మారలో దాచుకున్న అవార్డుల గురించి ఆలోచిస్తే లాభం లేదు!
-
AP Weather Alert: వాతావరణ హెచ్చరిక.. 10 జిల్లాల్లో వర్షాలు, పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
-
Ponnam Prabhakar : తెలంగాణ మా అయ్యా జాగిరే.. పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!