Manish Sisodia: నేడు కోర్టుకు మనీష్ సిసోడియా.. దేశవ్యాప్త నిరసనలకు ఆప్ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ నేడు దేశవ్యాప్తంగా నిరసనలు ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు బలగాలను మోహరించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన డిప్యూటీ మనీష్ సిసోడియా అరెస్టును డర్టీ పాలిటిక్స్ అని అన్నారు. ఈ అరెస్ట్పై ప్రజలే సమాధానం చెప్తారని కేజ్రీవాల్ హెచ్చరించారు. ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ తెలిపారు. దేశంలోని లక్షలాది మంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దిన గొప్ప విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ఫేక్ కేసులో అరెస్టయ్యారని, దీనికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతుందని పాఠక్ ట్వీట్లో పేర్కొన్నారు. సిసోడియా అరెస్టుపై ఆప్ ఈరోజు బ్లాక్ డేగా పాటిస్తున్నట్లు ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.
మనీష్ సిసోడియాను ఉంచిన సీబీఐ ప్రధాన కార్యాలయంతో సహా దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు బలగాలను మోహరించారు. ఈరోజు సీబీఐ ప్రధాన కార్యాలయం వెలుపల పెద్ద సంఖ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు గుమిగూడే అవకాశం ఉందని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు దేశ రాజధానిలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్లోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం వెలుపల కూడా ఆప్ నిరసన చేపట్టాలని యోచిస్తోంది. దేశ రాజధానిలో కొత్త మద్యం విక్రయ విధానాన్ని తీసుకురావడంలో మనీష్ సిసోడియా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2021 పాలసీ రూపకల్పనలో మద్యం కంపెనీలు పాలుపంచుకున్నాయని, దీని కోసం “సౌత్ గ్రూప్” అని పిలిచే మద్యం లాబీ ద్వారా రూ.30 కోట్ల వరకు కిక్బ్యాక్లు చెల్లించారని సీబీఐ వాదిస్తోంది.
Also Read
- NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
Read Also: Mechanical Elephant: ఆలయంలో ఆచారాలను నిర్వహించేందుకు రోబోటిక్ ఏనుగు.. తొలిసారిగా..
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సిసోడియాను ఆదివారం ఎనిమిది గంటల పాటు విచారించిన తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) నిన్న సిసోడియాను అరెస్టు చేసింది. సిసోడియా ఢిల్లీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రధాన కార్యాలయంలో రాత్రి గడిపారు. ఈరోజు ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి మధ్యాహ్నం 2 గంటలకు సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు.
తాజావార్తలు
-
“ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..