Mechanical Elephant: ఆలయంలో ఆచారాలను నిర్వహించేందుకు రోబోటిక్ ఏనుగు.. తొలిసారిగా..
Mechanical Elephant: కేరళలో మొట్టమొదటిసారిగా ఆచారాలను నిర్వహించేందుకు యాంత్రికమైన ఏనుగును ఓ ఆలయంలోని దేవునికి అంకితం చేశారు. ఆ రోబోటిక్ ఏనుగును రోజువారీ ఆచారాలను నిర్వహించడం కోసం వినియోగించనున్నారు. కేరళలో గల త్రిసూర్లోని శ్రీకృష్ణ ఆలయంలో రోబో ఏనుగును ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏనుగు అచ్చం నిజం ఏనుగులాగే ఉంటుంది. కేరళలో ఇలాంటి రోబో ఏనుగును కలిగివున్న ఆలయం ఇదొక్కటే కావడం గమనార్హం. ఈ రోబో ఏనుగుకు ‘ఇరింజదపల్లి రామన్’ అని నామకరణం చేశారు. ఇనుప చట్రానికి రబ్బరు తొడుగు వేసి ఈ ఏనుగును రూపొందించారు. దీని బరువు 800 కిలోలు. జంతు హక్కుల ఉద్యమ సంస్థ ‘పెటా’కు చెందిన కొందరు ఈ రోబోటిక్ ఏనుగును ఆలయానికి బహూకరించారు.
ఆలయ వంశపారంపర్య అర్చకుడు రాజ్ కుమార్ నంబూద్రి ఈ రోబో ఏనుగు గురించి చెబుతూ, ఇది నిజం ఏనుగులాగే తొండం ఊపుతుందని, చెవులను కదుల్చుతుందని వివరించారు. మావటి ఓ బటన్ నొక్కితే తొండంతో నీళ్లు విరజిమ్ముతుందని వెల్లడించారు. ఇలాంటి పనులు చేసేందుకు ఈ ఏనుగు లోపల కొన్ని ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చారు. దీనిపై ఆలయ అధికారులు స్పందిస్తూ, సాధారణ ఏనుగులను పోషించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని, వాటితో కొన్నిరకాల ఇబ్బందులు కూడా ఉన్నాయని వివరించారు. ఏనుగులను హింసించడాన్ని నిరోధించే క్రమంలో, ఈ రోబో ఏనుగు ఒక వినూత్న ముందడుగుగా భావిస్తున్నామని తెలిపారు. ఇతర దేవాలయాలు కూడా ఇదే బాటలో నడవాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
Also Read
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
Read Also: PM-KISAN: అన్నదాతలకు గుడ్న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బులు
రామన్ ఆలయంలో సురక్షితమైన, క్రూరత్వం లేని పద్ధతిలో వేడుకలు నిర్వహించడంలో సహాయపడుతుందని, తద్వారా నిజమైన ఏనుగుల పునరావాసం, అడవులలో నివసించడం, వాటికి బందిఖానా భయానకతను అంతం చేయడంలో రామన్ సహాయం చేస్తుందని పెటా తెలిపింది. పెరువనం సతీశన్ మరార్ నేతృత్వంలోని పెర్కషన్ బృందం ప్రదర్శనతో ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కేరళతో సహా దేశంలో చెరలో ఉన్న చాలా ఏనుగులను అక్రమంగా పట్టుకున్నారని లేదా అనుమతి లేకుండా వేరే రాష్ట్రానికి తరలించారని పెటా పేర్కొంది. ఏనుగులను ఉపయోగించే అన్ని వేదికలు, ఈవెంట్లు నిజమైన ఏనుగుల స్థానంలో యాంత్రిక ఏనుగులు లేదా ఇతర మార్గాలకు మారాలని పెటా కోరింది. ఇప్పటికే నిర్బంధంలో ఉన్న ఏనుగులను అభయారణ్యాల్లో వదిలిపెట్టాలనిపిలుపునిచ్చింది. అడవుల్లో అయితే ఆ ఏనుగులు బంధించబడకుండా, ఇతర ఏనుగుల సహవాసంలో జీవించవచ్చు.
తాజావార్తలు
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!