Mechanical Elephant: ఆలయంలో ఆచారాలను నిర్వహించేందుకు రోబోటిక్ ఏనుగు.. తొలిసారిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mechanical Elephant: కేరళలో మొట్టమొదటిసారిగా ఆచారాలను నిర్వహించేందుకు యాంత్రికమైన ఏనుగును ఓ ఆలయంలోని దేవునికి అంకితం చేశారు. ఆ రోబోటిక్ ఏనుగును రోజువారీ ఆచారాలను నిర్వహించడం కోసం వినియోగించనున్నారు. కేరళలో గల త్రిసూర్లోని శ్రీకృష్ణ ఆలయంలో రోబో ఏనుగును ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏనుగు అచ్చం నిజం ఏనుగులాగే ఉంటుంది. కేరళలో ఇలాంటి రోబో ఏనుగును కలిగివున్న ఆలయం ఇదొక్కటే కావడం గమనార్హం. ఈ రోబో ఏనుగుకు ‘ఇరింజదపల్లి రామన్’ అని నామకరణం చేశారు. ఇనుప చట్రానికి రబ్బరు తొడుగు వేసి ఈ ఏనుగును రూపొందించారు. దీని బరువు 800 కిలోలు. జంతు హక్కుల ఉద్యమ సంస్థ ‘పెటా’కు చెందిన కొందరు ఈ రోబోటిక్ ఏనుగును ఆలయానికి బహూకరించారు.
ఆలయ వంశపారంపర్య అర్చకుడు రాజ్ కుమార్ నంబూద్రి ఈ రోబో ఏనుగు గురించి చెబుతూ, ఇది నిజం ఏనుగులాగే తొండం ఊపుతుందని, చెవులను కదుల్చుతుందని వివరించారు. మావటి ఓ బటన్ నొక్కితే తొండంతో నీళ్లు విరజిమ్ముతుందని వెల్లడించారు. ఇలాంటి పనులు చేసేందుకు ఈ ఏనుగు లోపల కొన్ని ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చారు. దీనిపై ఆలయ అధికారులు స్పందిస్తూ, సాధారణ ఏనుగులను పోషించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని, వాటితో కొన్నిరకాల ఇబ్బందులు కూడా ఉన్నాయని వివరించారు. ఏనుగులను హింసించడాన్ని నిరోధించే క్రమంలో, ఈ రోబో ఏనుగు ఒక వినూత్న ముందడుగుగా భావిస్తున్నామని తెలిపారు. ఇతర దేవాలయాలు కూడా ఇదే బాటలో నడవాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
Also Read
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
Read Also: PM-KISAN: అన్నదాతలకు గుడ్న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బులు
రామన్ ఆలయంలో సురక్షితమైన, క్రూరత్వం లేని పద్ధతిలో వేడుకలు నిర్వహించడంలో సహాయపడుతుందని, తద్వారా నిజమైన ఏనుగుల పునరావాసం, అడవులలో నివసించడం, వాటికి బందిఖానా భయానకతను అంతం చేయడంలో రామన్ సహాయం చేస్తుందని పెటా తెలిపింది. పెరువనం సతీశన్ మరార్ నేతృత్వంలోని పెర్కషన్ బృందం ప్రదర్శనతో ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కేరళతో సహా దేశంలో చెరలో ఉన్న చాలా ఏనుగులను అక్రమంగా పట్టుకున్నారని లేదా అనుమతి లేకుండా వేరే రాష్ట్రానికి తరలించారని పెటా పేర్కొంది. ఏనుగులను ఉపయోగించే అన్ని వేదికలు, ఈవెంట్లు నిజమైన ఏనుగుల స్థానంలో యాంత్రిక ఏనుగులు లేదా ఇతర మార్గాలకు మారాలని పెటా కోరింది. ఇప్పటికే నిర్బంధంలో ఉన్న ఏనుగులను అభయారణ్యాల్లో వదిలిపెట్టాలనిపిలుపునిచ్చింది. అడవుల్లో అయితే ఆ ఏనుగులు బంధించబడకుండా, ఇతర ఏనుగుల సహవాసంలో జీవించవచ్చు.
తాజావార్తలు
-
Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!