Gujarat High Court: మెయిల్ మిస్.. బెయిల్ ఔట్.. ఓ ఖైదీ దీనగాథ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat High Court: ఓ వ్యక్తి బెయిల్ ఆర్డర్కు సంబంధించిన మెయిల్ను జైలు అధికారి తెరవనందున 3 సంవత్సరాలు జైలులో గడిపిన వ్యక్తికి గుజరాత్ హైకోర్టు రూ. 1 లక్ష పరిహారం వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. నిందితుడికి 2020లో బెయిల్ వచ్చింది. అయినా మూడేళ్లపాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఈమెయిల్కు జోడించిన హైకోర్టు రిజిస్ట్రీ తమకు పంపిన బెయిల్ ఆర్డర్ను తెరవలేదని జైలు అధికారులు పేర్కొన్నారు. అందుకే అతను మూడేళ్లపాటు జైలులో గడపాల్సి వచ్చిందన్నారు. జైలు అథారిటీ ఈమెయిల్కు జోడించిన బెయిల్ను తెరవలేకపోయినందున 3 సంవత్సరాలు జైలులో గడిపిన వ్యక్తికి గుజరాత్ హైకోర్టు రూ.లక్ష నష్టపరిహారం మంజూరు చేసింది. బెయిల్ లభించినా దాదాపు మూడేళ్లపాటు జైలు జీవితం గడిపిన ఖైదీ దీనస్థితిని దృష్టిలో ఉంచుకుని.. పరిహారం పొందేందుకు అర్హులని కోర్టు పేర్కొంది.
Also Read: India-Canada: కెనడా రాకుండా పన్నూని నిషేధించాలి.. ప్రభుత్వాన్ని కోరిన హిందూ సంస్థ
Also Read
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్చుక్ సందేశం
- Monsoon Returns: వాతావరణశాఖ గుడ్న్యూస్.. దేశాన్ని కమ్మేసిన వర్ష మేఘాలు..
27 ఏళ్ల దోషి చందంజీ ఠాకూర్కు రూ.లక్ష పరిహారం చెల్లించాలని న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ సుపెహియా, జస్టిస్ ఎంఆర్ మెంగ్డేలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశించింది. ఈ కేసులో నిందితుల రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టు రిజిస్ట్రీ బెయిల్ ఆర్డర్ను జైలు అధికారులకు మెయిల్ చేసింది. కొవిడ్-19 మహమ్మారి దృష్ట్యా అవసరమైన చర్యలు తీసుకోలేదని జైలు అధికారులు చెబుతున్నప్పటికీ, వారికి ఈ-మెయిల్ వచ్చినప్పటికీ వారు మెయిల్లో జోడించిన బెయిల్ ఆర్డర్ను కూడా తెరవలేదు. ఈమెయిల్ను జిల్లా సెషన్స్ కోర్టుకు కూడా పంపినప్పటికీ, దోషిని బెయిల్పై విడుదల చేసిన ఉత్తర్వు సరిగ్గా అమలు చేయబడిందో లేదో చూసేందుకు కోర్టు ఎటువంటి ప్రయత్నం చేయలేదని కోర్టు పేర్కొంది. బెయిల్ లభించినా దాదాపు ఆ వ్యక్తి మూడేళ్లపాటు జైలు జీవితం గడిపాడు. అతని దీనస్థితిని దృష్టిలో ఉంచుకుని పరిహారం పొందేందుకు అతడు అర్హుడని కోర్టు పేర్కొంది.
Also Read: Bombay High Court: మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారనే కారణంతో విడాకులు కోరకూడదు..
అసలు విషయం ఏమిటి?
ఓ హత్య కేసులో దోషి జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. అతని శిక్ష సెప్టెంబర్ 29, 2020న నిలిపివేయబడింది. జైలు అధికారులకు హైకోర్టు రిజిస్ట్రీ ఇ-మెయిల్ ద్వారా సమాచారం అందించింది, అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా, ఇ-మెయిల్ను జైలు అధికారులు పట్టించుకోలేదు. కోర్టు జారీ చేసిన ఉత్తర్వు అమలు కాలేదు. శిక్షా సస్పెన్షన్ ఆర్డర్ గురించి జైలు అధికారులకు తెలియజేయడంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ విఫలమైందని కోర్టు పేర్కొంది. అందువల్ల, దరఖాస్తుదారుకు బెయిల్ లభించినప్పటికీ, జైలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా అతను జైలులోనే ఉన్నాడు.
కోర్టు జైలు అధికారులను బాధ్యులను చేసింది. తీవ్రమైన లోపానికి 14 రోజుల్లోగా రూ. 1 లక్ష పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విషయం తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, బెయిల్ మంజూరు చేయబడిన, ఇంకా విడుదల చేయని ఖైదీలందరి డేటాను సేకరించాలని అన్ని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలను ఆదేశించింది.
తాజావార్తలు
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
Google Pixel 11a: గూగుల్ పిక్సెల్ 11a.. 8GB RAM, 120Hz డిస్ప్లే, Tensor G6 చిప్సెట్.. కొత్త ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!