Viral Video: ఇన్స్టాగ్రామ్ రీల్కు పోజులిస్తుండగా జలపాతంలో జారిపడ్డాడు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వీడియోల మోజు బాగా పెరిగింది. వ్యూస్ రావడం కోసం, ఫేమస్ కావడం కోసం యువత డిఫరెంట్గా తమ టాలెంట్ను చూపిస్తున్నారు. అయితే ఇలా కొన్ని రిస్కీ షాట్స్ తీసి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా జరుగుతున్నాయి. జలపాతాల వద్ద, వరదల్లో కూడా ఈ రీల్స్ కోసం పాకులాడుతూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వ్యూస్ పెరగడం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే కర్ణాటకలో జరిగింది. ఇన్స్టాగ్రామ్ రీల్ మోజులో పడి ప్రాణాలు కోల్పోయాడు ఓ యువకుడు.
Also Read: Teacher Suspended: విద్యార్థులతో క్లాస్రూమ్లో మసాజ్ చేయించుకున్న టీచర్ సస్పెండ్
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం జలపాతం వద్ద పోజులిస్తున్నాడు. మరో వ్యక్తి దానిని వీడియో తీస్తున్నాడు. కానీ ప్రమాదవశాత్తు పోజులిస్తున్న వ్యక్తి కాలు జారి జలపాతంలో పడిపోయాడు. ఆ సమయంలో జలపాతంలో వరద ప్రవాహం చాలా ప్రమాదకరంగా ఉండడంతో అతను ఆ నీటిలో కొట్టుకుపోయాడు. ఆ వ్యక్తిని శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన 23 ఏళ్ల శరత్ కుమార్గా గుర్తించారు. కొల్లూరు గ్రామానికి కేవలం 6 కి.మీ దూరంలో ఉన్న అరసినగుండి జలపాతం వద్ద ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
ఆ వీడియోలో ఓ వ్యక్తి జలపాతంలోని రాయిపై నిలబడి ఉన్నాడు. ఆ నీటి ప్రవాహానికి ఆ వ్యక్తి బ్యాలెన్స్ కోల్పోయాడు. ఒక్క క్షణంలో జలపాతంలో పడిపోయి కనిపించకుండా అదృశ్యమయ్యాడు. పోలీసులు, ఎమర్జెన్సీ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయినప్పటికీ ఆ వ్యక్తి మృతదేహం ఆచూకీ లభించలేదు. రెస్క్యూ ఆపరేషన్ ఈరోజు కూడా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
Also Read: Delhi Crime: పెళ్లికి నిరాకరించిందని.. కాలేజీ విద్యార్థిని తలపై రాడ్డుతో కొట్టి..
ఉడిపి జిల్లాలో గత రెండు రోజులుగా కుండపోత వర్షాలు పలు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. బంట్వాళ తాలూకా సమీపంలోని నందవర, అలడ్క, గుడిన ప్రాంతాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఇళ్లలోకి నీరు చేరి నివాసితులు పరుగులు తీయాల్సి వచ్చింది. నైరుతి రుతుపవనాలు కర్ణాటకలో వరద భయాన్ని రేకెత్తించాయి. వాగులు పొంగి ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని తొమ్మిది జిల్లాలు బెలగావి, ధార్వాడ్, ఉత్తర కన్నడ, హవేరి, హాసన్, శివమొగ్గ, ఉడిపి, దక్షిణ కన్నడ, కొడగులలో పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. కర్ణాటకలోని మూడు కోస్తా జిల్లాలైన ఉడిపి, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది.
https://twitter.com/vivek_sabharwal/status/1683788274643648512
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!