Superstition : శీలపరీక్షకు సిద్ధమైన యువకుడు.. నిప్పుల్లో ఉన్న గడ్డపారను తీసి.. చివరికి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవుడు కాలంతో పరిగెడుతూ.. కొత్త కొత్త టెక్నాలజీలను కనుపెడుతుంటుంటే.. కొన్ని గ్రామాలు ఇంకా మూఢనమ్మకాలు అనే అంధకారంలోనే ఉన్నాయి. అయితే.. ఇలాంటి సంఘటనే ఇప్పుడు తెలంగాణలోని ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తి పెద్దమనుషులను ఆశ్రయించగా వారు ఆ ఇద్దరినీ పంచాయతీ పిలిపించారు. అక్కడ నాకు ఆమె ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా.. నీకు సంబంధం లేకుండా శీలపరీక్షకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. చివరికీ శీలపరీక్షలో నెగ్గినా.. వారు తప్పుచేశావంటూ బుకాయిస్తూ నిందించారు దీంతో సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read : ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు తెలుసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి..
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా ములుగు మండలం జంగాలపల్లి సమీపంలోని బంజర్ పల్లి గ్రామానికి చెందిన జగన్నాథం గంగాధర్ అనే వ్యక్తి ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆ మహిళ భర్త గంగాధర్ పై పెద్ద మనుషులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. దీంతో.. పెద్ద మనుషులు ఇరువురిని పిలిపించి సముదాయించే ప్రయత్నం చేశారు. ఇలా అప్పటికే రెండు మూడు సార్లు వారి మధ్యలో పంచాయతీ జరిగింది. సదరు మహిళతో నాకు ఎలాంటి సంబంధం లేదని గంగాధర్ మొరపెట్టుకున్నా పెద్ద మనుషులు ఎవరూ పట్టించుకోలేదు. అంతేకాకుండా.. అతనికి వారి ఆచారంలో శీల పరీక్ష పెట్టారు. తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే గంగాధర్ మంటల్లో కాలుతున్న గడ్డపారను చేతితో తీయాలని ఆ పెద్ద మనుషులు పంచాయతీ చెప్పారు.
Also Read : Increments in India: భారతీయ సంస్థల్లో ఈ ఏడాది వేతనాల పెంపు పరిస్థితిపై సర్వే
ఈ అగ్నిపరీక్షకు లక్నవరం సరస్సు వేదికగా ఫిబ్రవరి 25వ తారీకున చోటుచేసుకుంది. అయితే.. పెద్ద మనుషులు చెప్పినట్లే.. గంగాధర్ సరస్సులో స్నానం చేసి అగ్నిగుండం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి నిప్పుల్లో ఉన్న గడ్డపారను తీశాడు. అయితే.. ఈ పరీక్షలో గంగాధర్ చేతికి గాయాలైతే తప్పు చేసినట్లు, లేకుంటే తప్పు చేయనట్లు వారి ఆచారంలో నమ్ముతారు. ఈ పరీక్షలో నెగ్గినవారికి ఓడిన వారు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో.. గంగాధర్ చేతికి గాయాలు కాలేదని.. తాను తప్పుచేయలేదని తనకు డబ్బులు ఇప్పించాలని కోరారు. అయితే.. సంతృప్తి చెందని పంచాయతీ పెద్దలు గంగాధర్కు గాయాలయ్యాయని.. తప్పు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో గంగాధర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!