Superstition : శీలపరీక్షకు సిద్ధమైన యువకుడు.. నిప్పుల్లో ఉన్న గడ్డపారను తీసి.. చివరికి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవుడు కాలంతో పరిగెడుతూ.. కొత్త కొత్త టెక్నాలజీలను కనుపెడుతుంటుంటే.. కొన్ని గ్రామాలు ఇంకా మూఢనమ్మకాలు అనే అంధకారంలోనే ఉన్నాయి. అయితే.. ఇలాంటి సంఘటనే ఇప్పుడు తెలంగాణలోని ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తి పెద్దమనుషులను ఆశ్రయించగా వారు ఆ ఇద్దరినీ పంచాయతీ పిలిపించారు. అక్కడ నాకు ఆమె ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా.. నీకు సంబంధం లేకుండా శీలపరీక్షకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. చివరికీ శీలపరీక్షలో నెగ్గినా.. వారు తప్పుచేశావంటూ బుకాయిస్తూ నిందించారు దీంతో సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read : ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు తెలుసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి..
Also Read
- CJP: 'క్యా బోల్తీ పబ్లిక్'.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
- Trump-Hegseth: ఇరాన్ యుద్ధంపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్పై ట్రంప్ ఆగ్రహం!
- Babar Azam: ఫామ్లోకి వచ్చిన పాకిస్థాన్ జట్టు.. బాబర్ ఆజమ్ వీర విహారం.. 191 పరుగులతో రికార్డు..
- CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాతచంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా ములుగు మండలం జంగాలపల్లి సమీపంలోని బంజర్ పల్లి గ్రామానికి చెందిన జగన్నాథం గంగాధర్ అనే వ్యక్తి ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆ మహిళ భర్త గంగాధర్ పై పెద్ద మనుషులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. దీంతో.. పెద్ద మనుషులు ఇరువురిని పిలిపించి సముదాయించే ప్రయత్నం చేశారు. ఇలా అప్పటికే రెండు మూడు సార్లు వారి మధ్యలో పంచాయతీ జరిగింది. సదరు మహిళతో నాకు ఎలాంటి సంబంధం లేదని గంగాధర్ మొరపెట్టుకున్నా పెద్ద మనుషులు ఎవరూ పట్టించుకోలేదు. అంతేకాకుండా.. అతనికి వారి ఆచారంలో శీల పరీక్ష పెట్టారు. తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే గంగాధర్ మంటల్లో కాలుతున్న గడ్డపారను చేతితో తీయాలని ఆ పెద్ద మనుషులు పంచాయతీ చెప్పారు.
Also Read : Increments in India: భారతీయ సంస్థల్లో ఈ ఏడాది వేతనాల పెంపు పరిస్థితిపై సర్వే
ఈ అగ్నిపరీక్షకు లక్నవరం సరస్సు వేదికగా ఫిబ్రవరి 25వ తారీకున చోటుచేసుకుంది. అయితే.. పెద్ద మనుషులు చెప్పినట్లే.. గంగాధర్ సరస్సులో స్నానం చేసి అగ్నిగుండం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి నిప్పుల్లో ఉన్న గడ్డపారను తీశాడు. అయితే.. ఈ పరీక్షలో గంగాధర్ చేతికి గాయాలైతే తప్పు చేసినట్లు, లేకుంటే తప్పు చేయనట్లు వారి ఆచారంలో నమ్ముతారు. ఈ పరీక్షలో నెగ్గినవారికి ఓడిన వారు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో.. గంగాధర్ చేతికి గాయాలు కాలేదని.. తాను తప్పుచేయలేదని తనకు డబ్బులు ఇప్పించాలని కోరారు. అయితే.. సంతృప్తి చెందని పంచాయతీ పెద్దలు గంగాధర్కు గాయాలయ్యాయని.. తప్పు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో గంగాధర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
-
CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
-
Trump-Hegseth: ఇరాన్ యుద్ధంపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్పై ట్రంప్ ఆగ్రహం!
-
Babar Azam: ఫామ్లోకి వచ్చిన పాకిస్థాన్ జట్టు.. బాబర్ ఆజమ్ వీర విహారం.. 191 పరుగులతో రికార్డు..
-
CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాతచంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!