Food Poison: ఎగ్ ప్రైడ్ రైస్ తిని యువకుడు మృతి
Man Died After Eating Egg Fried Rice in Tirupati : ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కల్తీ ఎక్కువ అయిపోయింది. పాలు దగ్గర నుంచి టీ పొడి, కారాల వరకు ఏదీ స్వచ్ఛంగా ఉండటం లేదు. పాలలో యూరియా కలిపి కల్తీ చేస్తున్న కేటుగాళ్లు, టీ పొడి లాంటి వాటిలో కూడా రంపం పొడి కలిపి విక్రయిస్తున్నారు. ఇక నూనెల కల్తీ గురించి అయితే చెప్పా్ల్సిన పని లేదు. జంతువుల ఎముకల పొడి నూనెలో కలిపి విక్రయిస్తున్నారు. చిన్న చిన్న దుకాణాల్లో అయితే లాభం కోసం వీటినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వీటి కారణంగా ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఫుడ్ ఇన్ స్పెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ఇలాంటి వారిని పట్టుకున్నా ఏదో ఒక రకంగా కల్తీలకు పాల్పడుతూనే ఉన్నారు.
Also Read: MP Ramesh Bidhuri: తోటి సభ్యుడిని ఉగ్రవాదిగా పేర్కొన్న బీజేపీ ఎంపీ.. ఫైర్ అవుతున్న ప్రతిపక్షాలు
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఇక ఫుడ్ పాయిజన్ కారణంగా 27 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తిరుపతి రూరల్ లోని కాలురూలో జరిగింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అసలు విషయం ఏంటంటే తిరుపతి రూరల్ కాలూరుకు చెందిన నరేంద్ర అనే యువకుడు ఓ దుకాణంలో ఎగ్ ప్రైడ్ రైస్ తిన్నాడు. అనంతరం అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటినా రుయా ఆసుపత్రికి తరిలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ యువకుడు మరణించాడు. అయితే ఫుడ్ పాయిజన్ కారణంగానే నరేంద్ర మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ విక్రయించిన దుకాణం పై నరేంద్ర కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసిన ఎంఆర్ పల్లి పోలీసులు విచారణ చేపట్టారు. నరేంద్ర తిన్న దుకాణంకు వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. నరేంద్ర చనిపోవడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో