Mallu Ravi: ఢిల్లీ పదవికి మల్లు రవి గుడ్బై.. ఎంపీ టికెట్పై హాట్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి (Mallu Ravi) తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. జడ్చర్లలో మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు.
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేసినట్లు మల్లు రవి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజీనామా పత్రాన్ని ఇచ్చినట్లు వెల్లడించారు. ఆమోదిస్తారా? లేదా ? అనేది ఆయన నిర్ణయానికి వదిలేస్తానన్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఇవ్వడానికి ఆ పదవి అడ్డంకిగా ఉంటుందని అభిప్రాయంతోనే రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చారు.
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం కోసమే జడ్చర్ల అసెంబ్లీ టికెట్ వదులుకున్నట్లు తెలిపారు. ఏ సర్వేలు చేసినా నాగర్ కర్నూల్ ఎంపీగా తానే గెలుస్తానని చెబుతున్నాయని చెప్పారు. నాగర్ కర్నూల్ టికెట్ తనకు ఇయ్యని పక్షంలో టికెట్ ఎందుకు నిరాకరిస్తున్నారో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం జోడు పదవులు ఉండవద్దు.. అందుకే తన పదవికి రాజీనామా చేశానన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మద్దతు తనకు సంపూర్ణంగా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయసాయిరెడ్డి ఎంపీగా.. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా జోడు పదవులు నిర్వహిస్తున్నారని మల్లు రవి గుర్తుచేశారు.
ఇటీవల కోస్గిలో జరిగిన కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్రెడ్డి కీలక ప్రకటన చేశారు. మహబూబ్నగర్ లోక్సభ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి పేరు ప్రకటించారు. ఈ ప్రకనట తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో అలజడి చెలరేగింది. తాజాగా నాగర్ కర్నూలు టికెట్ కోసం మల్లు రవి ఢిల్లీ పదవికి రాజీనామా చేశారు. మరీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇకపోతే ఖమ్మం.. తదితర నియోజకవర్గాల్లో మంత్రుల కుటుంబ సభ్యులు పోటీ పడుతున్నారు. ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం సతీమణి నందిని.. మంత్రి పొంగులేటి సుధాకర్రెడ్డి సోదరుడు పోటీ పడుతున్నారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!