Mallu Ravi : ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో నేడు టీపీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన నిజాంను మరిపిస్తున్నదన్నారు. సెక్రటేరియట్ కూల్చివేసి జాగిర్దారుగా అందర్నీ ఇంటికి పిలిపించుకొని పరిపాలన చేస్తున్నారు కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి ప్రజలదనాన్ని రైతుబంధు, దళిత బంధు పేరిట వెచ్చించి అధికార దుర్వినియోగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడుతోందని ఆయన అన్నారు. నాలుగు నెలల్లో వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావడానికి దశాబ్ది ఉత్సవాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్లు రూపాయలు కేటాయించి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నదని, ప్రజాధనం ఎంత దుర్వినియోగం చేసిన, ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, వెయ్యి మంది కేసీఆర్లు, లక్ష మంది కేటీఆర్ లు అడ్డు పడిన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Hyderabad : డ్రైవర్ నిర్లక్ష్యానికి చిన్నారి మృతి..తల్లి పరిస్థితి విషమం..
Also Read
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- India Test Win: టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత.. గ్రౌండ్లో బిత్తర చూపులు చూసిన టీమిండియా ఆటగాళ్లు.. ఎందుకంటే..
- IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
- Lakshadweep: లక్షద్వీప్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
అనంతరం డీసీసీ అధ్యక్షులు వంశీకృష్ణ మాట్లాడుతూ.. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్ అక్రమ వ్యాపారాలతో బీఆర్ఎస్ నాయకులు బాగుపడ్డారని, కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు తెలంగాణ అయిందన్నారు. కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ లక్ష్యాలు నెరవేరక ప్రజల బతుకులు మారలేదని, ఆంధ్రప్రదేశ్ బోర్డు మారి తెలంగాణ వచ్చిందే తప్పా.. అభివృద్ధి జరగలేదని ఆయన అన్నారు. పేదలకు ఇండ్లు ఇవ్వలేదు కానీ, ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు, సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ మాత్రం కట్టుకుండని, తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి అనుకుంటే కేసీఆర్ పాలన వల్ల ఐదు లక్షల కోట్ల అప్పులై రాష్ట్రం తాకట్టు పెట్టబడిందన్నారు.
Also Read : BJP high command for AP: ఏపీకి బీజేపీ హైకమాండ్.. రెండు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసిన కమలం పార్టీ
తాజావార్తలు
-
Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
-
India Test Win: టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత.. గ్రౌండ్లో బిత్తర చూపులు చూసిన టీమిండియా ఆటగాళ్లు.. ఎందుకంటే..
-
Thaman: దాని గురించి నేను కూడా ఆలోచించాలి: తమన్
-
Trinamool Congress: బీజేపీకి టీఎంసీ ఎంపీల మద్దతు.. మమత ఖేల్ ఖతం..
-
IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!