Maldives President: భారత్తో వివాదం.. పర్యాటకులను పంపాలని చైనాకు మాల్దీవ్స్ ప్రెసిడెంట్ విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives President: వెకేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మాల్దీవులే. సెలబ్రిటీలు కూడా తరచూ మాల్దీవులకు వెళ్తుంటారు. అక్కడి బీచ్లు, రిసార్ట్స్లో సేద తీరుతుంటారు. ట్రిప్కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంటారు. ఇవి చూసిన చాలా మంది అక్కడి లొకేషన్స్కు ఫిదా అయ్యి.. మాల్దీవ్స్ వెకేషన్కు వెల్లాలన్నది పెద్ద డ్రీమ్గా పెట్టుకుంటుంటారు. అయితే, తాజాగా ఈ పర్యాటక ప్రాంతంపై ఇప్పుడు వివాదం నెలకొంది. ఇటీవల ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి సముద్రంలో స్నార్కెలింగ్ చేశారు. సాహసాలు చేయాలనుకునేవారు.. తమ లిస్టులో లక్షద్వీప్ను చేర్చుకోవాలని సూచిస్తూ ఫొటోలను కూడా షేర్ చేశారు. ఈ పోస్ట్పై మాల్దీవుల మంత్రులు అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రుల వ్యాఖ్యలతో ఆ దేశ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ దేశం అంతా పర్యాటక రంగంపైనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఇక ఏటా మాల్దీవులను సందర్శించే పర్యాటకుల్లో భారతీయులే అత్యధికం.
Read Also: Maun Vrat: రామమందిరం ప్రారంభోత్సవం.. 32 ఏళ్ల మౌనవ్రతాన్ని విరమించుకోనున్న మహిళ
Also Read
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
- Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
ఈ క్రమంలోనే భారత్ నుంచి పర్యాటకులు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. భారతీయుల నుంచి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ఎక్కువ మంది పర్యాటకులను పంపాలని మాల్దీవుల అధ్యక్షుడు చైనాను కోరారు భారతీయుల నుంచి పర్యాటక వ్యతిరేకతను ఎదుర్కొంటున్న మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు మంగళవారం ద్వీప దేశానికి ఎక్కువ మంది పర్యాటకులను పంపే ప్రయత్నాలను పెంచాలని చైనాకు విజ్ఞప్తి చేశారు. చైనాలో అధికారిక పర్యటనలో ఉన్న ముయిజ్జు.. ఫుజియాన్ ప్రావిన్స్లో మాల్దీవుల బిజినెస్ ఫోరమ్లో ప్రసంగించారు. ఆయన చైనాను మాల్దీవుల సమీప మిత్రదేశంగా పేర్కొన్నారు. “చైనా మా సన్నిహిత మిత్రదేశాలలో ఒకటి, అభివృద్ధి భాగస్వాములలో ఒకటి” అని ఆయన అన్నారు.
Read Also: Uttarpradesh: జనవరి 22న యూపీలో విద్యాసంస్థలకు సెలవు.. మద్యం అమ్మకాలు బంద్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతదేశానికి వ్యతిరేకంగా కొంతమంది మాల్దీవుల మంత్రులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై దౌత్యపరమైన వివాదం చెలరేగిన తరువాత, భారతీయ పర్యాటకులు రిజర్వేషన్లను రద్దు చేసిన నేపథ్యంలో ముయిజ్జు చైనాను విజ్ఞప్తి చేయడం గమనార్హం. చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) ప్రాజెక్ట్ను కూడా ముయిజ్జు ప్రశంసించారు. దానిలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్ర ద్వీపంలో ఇంటిగ్రేటెడ్ టూరిజం జోన్ను అభివృద్ధి చేయడానికి రెండు దేశాలు 50 మిలియన్ల డాలర్ల విలువైన ప్రాజెక్ట్పై సంతకం చేశాయి.
Read Also: First Gay Prime Minister: ఫ్రాన్స్కు తొలి ‘గే’ ప్రధానిగా గాబ్రియేల్ అట్టల్
లక్షద్వీప్లో ప్రధాని నరేంద్ర మోదీ టూరిజం పిచ్పై సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్ట్లు చేసినందుకు మాల్దీవుల ప్రభుత్వం తన ముగ్గురు డిప్యూటీ మంత్రులను సస్పెండ్ చేసింది. అయితే, ఈ వ్యాఖ్యలు భారతీయులకు కోపం తెప్పించాయి. ఈ నేపథ్యంలో భారత పర్యాటకులు ద్వీప దేశానికి తమ ప్రణాళికాబద్ధమైన సెలవులను రద్దు చేసుకున్నారు. ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ అయిన EaseMyTrip కూడా వరుస మధ్య మాల్దీవులకు విమానాలను నిలిపివేసింది. 2023లో మాల్దీవులకు అత్యధిక సంఖ్యలో సందర్శకులు భారతదేశం నుంచి వచ్చారు. దాదాపు 209,198 మంది ఇండియా నుంచి వచ్చారు. రష్యా 209,146 మందితో రెండవ స్థానంలో ఉంది. చైనా 187,118 మందితో మూడవ స్థానంలో ఉంది.
తాజావార్తలు
-
Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
-
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
-
Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. ‘జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ’ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!