Maun Vrat: రామమందిరం ప్రారంభోత్సవం.. 32 ఏళ్ల మౌనవ్రతాన్ని విరమించుకోనున్న మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maun Vrat: జార్ఖండ్కు చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు తన మూడు దశాబ్దాల మౌనవ్రతాన్ని జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించడంతో విరమించనున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని ఆమె తన కలగా భావించింది. తన కల నెరవేరేవరకు మౌనవ్రతాన్ని పాటిస్తానని ఆమె ప్రతిజ్ఞ చేసింది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజున సరస్వతీ దేవి తన ప్రతిజ్ఞను ప్రారంభించిందని, రామ మందిరాన్ని ప్రారంభించినప్పుడే దానిని విరమిస్తానని ఆమె ప్రతిజ్ఞ చేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆలయ ప్రారంభోత్సవాన్ని చూసేందుకు ధన్బాద్ నివాసి సోమవారం రాత్రి రైలులో ఉత్తరప్రదేశ్లోని ఆలయ పట్టణానికి బయలుదేరారు.
Read Also: Music Maestro Rashid Khan: మ్యూజిక్ మ్యాస్ట్రో రషీద్ ఖాన్ కన్నుమూత
Also Read
- Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
సంకేత భాష ద్వారా ఆమె కుటుంబ సభ్యులతో సంభాషించేవారు. అయితే సంక్లిష్టమైన వాక్యాలను రాసేవారు. 2020 వరకు ఆమె ‘మౌన వ్రతం’ నుంచి విరామం తీసుకొని ప్రతిరోజూ మధ్యాహ్నం ఒక గంట మాట్లాడినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోడీ ఆలయానికి పునాది వేసిన రోజున ఆమె పూర్తిగా మౌనంగా ఉంది.
“డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు, అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించే వరకు మౌనం పాటిస్తానని మా అమ్మ ప్రతిజ్ఞ చేసింది. ఆలయ ప్రతిష్ఠాపన తేదీ ప్రకటించినప్పటి నుంచి ఆమె ఆనందోత్సాహాలతో ఉంది,” సరస్వతి దేవి కుమారుు హరే రామ్ అగర్వాల్ చెప్పారు. “ఆమె సోమవారం రాత్రి ధన్బాద్ రైల్వే స్టేషన్ నుంచి గంగా-సట్లేజ్ ఎక్స్ప్రెస్లో అయోధ్యకు బయలుదేరింది. జనవరి 22న ఆమె తన మౌనాన్ని వీడనుంది” అని బగ్మారా బ్లాక్లోని భౌరా నివాసి హరే రామ్ తెలిపారు.
రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు మహంత్ నృత్య గోపాల్ దాస్ శిష్యులు సరస్వతి దేవిని ఆహ్వానించారని ఆయన చెప్పారు. నలుగురు కుమార్తెలతో సహా ఎనిమిది మంది పిల్లల తల్లి అయిన సరస్వతి దేవి 1986లో తన భర్త దేవకినందన్ అగర్వాల్ మరణించిన తర్వాత రాముడికి తన జీవితాన్ని అంకితం చేసిందని, ఆమె ఎక్కువ సమయం తీర్థయాత్రల్లో గడిపిందని కుటుంబ సభ్యులు తెలిపారు. . సరస్వతి దేవి ప్రస్తుతం ధన్బాద్లోని ధైయాలో కోల్ ఇండియాకు చెందిన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (BCCL) అధికారి అయిన తన రెండవ కుమారుడు నంద్ లాల్ అగర్వాల్తో నివసిస్తున్నారు. నంద్ లాల్ భార్య ఇన్ను అగర్వాల్ (53) మాట్లాడుతూ… తన పెళ్లైన కొన్ని నెలల తర్వాత, తన అత్తగారు రాముడి పట్ల భక్తితో మౌన ప్రతిజ్ఞ చేయడం చూశానని చెప్పారు.
తాజావార్తలు
-
Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
-
MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
-
Scene: పోలీస్ ఆఫీసర్గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో ‘సీన్’ ఎలా ఉండబోతోందంటే?
-
Russia-NATO Tensions: రష్యా డ్రోన్లు, క్షిపణులతో NATO దేశాలపై దాడి చేయొచ్చు.. పోలాండ్ ప్రధాని టస్క్ హెచ్చరిక
-
Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!