Maun Vrat: రామమందిరం ప్రారంభోత్సవం.. 32 ఏళ్ల మౌనవ్రతాన్ని విరమించుకోనున్న మహిళ
Maun Vrat: జార్ఖండ్కు చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు తన మూడు దశాబ్దాల మౌనవ్రతాన్ని జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించడంతో విరమించనున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని ఆమె తన కలగా భావించింది. తన కల నెరవేరేవరకు మౌనవ్రతాన్ని పాటిస్తానని ఆమె ప్రతిజ్ఞ చేసింది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజున సరస్వతీ దేవి తన ప్రతిజ్ఞను ప్రారంభించిందని, రామ మందిరాన్ని ప్రారంభించినప్పుడే దానిని విరమిస్తానని ఆమె ప్రతిజ్ఞ చేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆలయ ప్రారంభోత్సవాన్ని చూసేందుకు ధన్బాద్ నివాసి సోమవారం రాత్రి రైలులో ఉత్తరప్రదేశ్లోని ఆలయ పట్టణానికి బయలుదేరారు.
Read Also: Music Maestro Rashid Khan: మ్యూజిక్ మ్యాస్ట్రో రషీద్ ఖాన్ కన్నుమూత
Also Read
- Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
- Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
- Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
- Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
సంకేత భాష ద్వారా ఆమె కుటుంబ సభ్యులతో సంభాషించేవారు. అయితే సంక్లిష్టమైన వాక్యాలను రాసేవారు. 2020 వరకు ఆమె ‘మౌన వ్రతం’ నుంచి విరామం తీసుకొని ప్రతిరోజూ మధ్యాహ్నం ఒక గంట మాట్లాడినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోడీ ఆలయానికి పునాది వేసిన రోజున ఆమె పూర్తిగా మౌనంగా ఉంది.
“డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు, అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించే వరకు మౌనం పాటిస్తానని మా అమ్మ ప్రతిజ్ఞ చేసింది. ఆలయ ప్రతిష్ఠాపన తేదీ ప్రకటించినప్పటి నుంచి ఆమె ఆనందోత్సాహాలతో ఉంది,” సరస్వతి దేవి కుమారుు హరే రామ్ అగర్వాల్ చెప్పారు. “ఆమె సోమవారం రాత్రి ధన్బాద్ రైల్వే స్టేషన్ నుంచి గంగా-సట్లేజ్ ఎక్స్ప్రెస్లో అయోధ్యకు బయలుదేరింది. జనవరి 22న ఆమె తన మౌనాన్ని వీడనుంది” అని బగ్మారా బ్లాక్లోని భౌరా నివాసి హరే రామ్ తెలిపారు.
రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు మహంత్ నృత్య గోపాల్ దాస్ శిష్యులు సరస్వతి దేవిని ఆహ్వానించారని ఆయన చెప్పారు. నలుగురు కుమార్తెలతో సహా ఎనిమిది మంది పిల్లల తల్లి అయిన సరస్వతి దేవి 1986లో తన భర్త దేవకినందన్ అగర్వాల్ మరణించిన తర్వాత రాముడికి తన జీవితాన్ని అంకితం చేసిందని, ఆమె ఎక్కువ సమయం తీర్థయాత్రల్లో గడిపిందని కుటుంబ సభ్యులు తెలిపారు. . సరస్వతి దేవి ప్రస్తుతం ధన్బాద్లోని ధైయాలో కోల్ ఇండియాకు చెందిన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (BCCL) అధికారి అయిన తన రెండవ కుమారుడు నంద్ లాల్ అగర్వాల్తో నివసిస్తున్నారు. నంద్ లాల్ భార్య ఇన్ను అగర్వాల్ (53) మాట్లాడుతూ… తన పెళ్లైన కొన్ని నెలల తర్వాత, తన అత్తగారు రాముడి పట్ల భక్తితో మౌన ప్రతిజ్ఞ చేయడం చూశానని చెప్పారు.
తాజావార్తలు
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
-
Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!