Maun Vrat: రామమందిరం ప్రారంభోత్సవం.. 32 ఏళ్ల మౌనవ్రతాన్ని విరమించుకోనున్న మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maun Vrat: జార్ఖండ్కు చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు తన మూడు దశాబ్దాల మౌనవ్రతాన్ని జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించడంతో విరమించనున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని ఆమె తన కలగా భావించింది. తన కల నెరవేరేవరకు మౌనవ్రతాన్ని పాటిస్తానని ఆమె ప్రతిజ్ఞ చేసింది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజున సరస్వతీ దేవి తన ప్రతిజ్ఞను ప్రారంభించిందని, రామ మందిరాన్ని ప్రారంభించినప్పుడే దానిని విరమిస్తానని ఆమె ప్రతిజ్ఞ చేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆలయ ప్రారంభోత్సవాన్ని చూసేందుకు ధన్బాద్ నివాసి సోమవారం రాత్రి రైలులో ఉత్తరప్రదేశ్లోని ఆలయ పట్టణానికి బయలుదేరారు.
Read Also: Music Maestro Rashid Khan: మ్యూజిక్ మ్యాస్ట్రో రషీద్ ఖాన్ కన్నుమూత
Also Read
- AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
సంకేత భాష ద్వారా ఆమె కుటుంబ సభ్యులతో సంభాషించేవారు. అయితే సంక్లిష్టమైన వాక్యాలను రాసేవారు. 2020 వరకు ఆమె ‘మౌన వ్రతం’ నుంచి విరామం తీసుకొని ప్రతిరోజూ మధ్యాహ్నం ఒక గంట మాట్లాడినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోడీ ఆలయానికి పునాది వేసిన రోజున ఆమె పూర్తిగా మౌనంగా ఉంది.
“డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు, అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించే వరకు మౌనం పాటిస్తానని మా అమ్మ ప్రతిజ్ఞ చేసింది. ఆలయ ప్రతిష్ఠాపన తేదీ ప్రకటించినప్పటి నుంచి ఆమె ఆనందోత్సాహాలతో ఉంది,” సరస్వతి దేవి కుమారుు హరే రామ్ అగర్వాల్ చెప్పారు. “ఆమె సోమవారం రాత్రి ధన్బాద్ రైల్వే స్టేషన్ నుంచి గంగా-సట్లేజ్ ఎక్స్ప్రెస్లో అయోధ్యకు బయలుదేరింది. జనవరి 22న ఆమె తన మౌనాన్ని వీడనుంది” అని బగ్మారా బ్లాక్లోని భౌరా నివాసి హరే రామ్ తెలిపారు.
రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు మహంత్ నృత్య గోపాల్ దాస్ శిష్యులు సరస్వతి దేవిని ఆహ్వానించారని ఆయన చెప్పారు. నలుగురు కుమార్తెలతో సహా ఎనిమిది మంది పిల్లల తల్లి అయిన సరస్వతి దేవి 1986లో తన భర్త దేవకినందన్ అగర్వాల్ మరణించిన తర్వాత రాముడికి తన జీవితాన్ని అంకితం చేసిందని, ఆమె ఎక్కువ సమయం తీర్థయాత్రల్లో గడిపిందని కుటుంబ సభ్యులు తెలిపారు. . సరస్వతి దేవి ప్రస్తుతం ధన్బాద్లోని ధైయాలో కోల్ ఇండియాకు చెందిన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (BCCL) అధికారి అయిన తన రెండవ కుమారుడు నంద్ లాల్ అగర్వాల్తో నివసిస్తున్నారు. నంద్ లాల్ భార్య ఇన్ను అగర్వాల్ (53) మాట్లాడుతూ… తన పెళ్లైన కొన్ని నెలల తర్వాత, తన అత్తగారు రాముడి పట్ల భక్తితో మౌన ప్రతిజ్ఞ చేయడం చూశానని చెప్పారు.
తాజావార్తలు
-
AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
-
JR NTR : అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాకుండానే థియేటర్ వద్ద భారీ కటౌట్.. పాలాభిషేకాలతో ఫ్యాన్స్ రచ్చ
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
-
Rashmika Mandanna: కృతి హాట్నెస్పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..