హిందూ మహాసముద్ర ద్వీపసమూహం నుంచి భారత్ తన బలగాలను ఉపసంహరించుకోకుంటే తమ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ అన్నారు. భారత సైన్యం మాల్దీవుల్లోనే కొనసాగితే మాల్దీవుల ప్రజల ‘ప్రజాస్వామ్య సంకల్పాన్ని’ విస్మరించినట్లేనని ఆయన పేర్కొన్నారు. మాల్దీవుల జాతీయ రక్షణ దళం యొక్క కార్యాచరణను పెంపొందించే ప్రయత్నాలతో సహా భారతదేశంతో రక్షణ సహకారానికి ఆయన మద్దతు ఇచ్చారు. మాల్దీవులలో భారతదేశం యొక్క శాశ్వత సైనిక ఉనికిని మహమ్మద్ ముయిజ్జూ తిరస్కరించాడు.
Read Also: Weather Update: పెరుగుతున్న చలి.. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ..!
భారతదేశంతో మల్దీవులు పరస్పర చర్చల ద్వారా సైనిక ఉనికి సమస్యను పరిష్కరించుకుంటామని మయిజ్జూ తెలిపారు. పార్లమెంటరీ ఆమోదం లేకుండా విదేశీ సైనిక సిబ్బంది మాల్దీవుల్లో ఉండటం రాజ్యాంగ ప్రాథమిక స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. మాల్దీవులకు అనుకూల విధానాన్ని మాత్రమే తాము అనుసరిస్తున్నట్లు చెప్పాడు.. భారత్కు వెళ్లే ముందు చైనాను సందర్శించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
Read Also: Mohammed Siraj: రెండు ఇన్నింగ్స్ల్లో బౌలింగ్ చేస్తామని అనుకోలేదు: సిరాజ్
మేము ఏ దేశానికీ వ్యతిరేకంగా ఉండము అని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ తెలిపారు. మాల్దీవుల ప్రయోజనాలను రక్షించడంతో పాటు ప్రో-మాల్దీవుల విధానాన్ని మార్గనిర్దేశం చేసే సూత్రం అని ఆయన అన్నారు.. శాంతి, భద్రతను ప్రోత్సహించడానికి ప్రపంచ ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 77 మంది భారతీయ సైనికులు మాల్దీవులలో మోహరించారు. వీరిలో 24 మంది హెలికాప్టర్ల నిర్వహణకు, 25 మంది డోర్నియర్ విమానాల నిర్వహణకు, 26 మంది ఇతర హెలికాప్టర్ల నిర్వహణకు వినియోగించారు. వీరే కాకుండా మెయింటెనెన్స్ తో పాటు ఇంజినీరింగ్ కోసం మరో ఇద్దరు భారతీయ సైనికులు ఉన్నారు. సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముయిజ్జూ భారతీయ సైనికులను వెనక్కి పంపాలని ప్రకటించారు.