Maldives President: భారత్ సైన్యాన్ని తొలగించకపోతే మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందూ మహాసముద్ర ద్వీపసమూహం నుంచి భారత్ తన బలగాలను ఉపసంహరించుకోకుంటే తమ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ అన్నారు. భారత సైన్యం మాల్దీవుల్లోనే కొనసాగితే మాల్దీవుల ప్రజల ‘ప్రజాస్వామ్య సంకల్పాన్ని’ విస్మరించినట్లేనని ఆయన పేర్కొన్నారు. మాల్దీవుల జాతీయ రక్షణ దళం యొక్క కార్యాచరణను పెంపొందించే ప్రయత్నాలతో సహా భారతదేశంతో రక్షణ సహకారానికి ఆయన మద్దతు ఇచ్చారు. మాల్దీవులలో భారతదేశం యొక్క శాశ్వత సైనిక ఉనికిని మహమ్మద్ ముయిజ్జూ తిరస్కరించాడు.
Read Also: Weather Update: పెరుగుతున్న చలి.. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ..!
Also Read
భారతదేశంతో మల్దీవులు పరస్పర చర్చల ద్వారా సైనిక ఉనికి సమస్యను పరిష్కరించుకుంటామని మయిజ్జూ తెలిపారు. పార్లమెంటరీ ఆమోదం లేకుండా విదేశీ సైనిక సిబ్బంది మాల్దీవుల్లో ఉండటం రాజ్యాంగ ప్రాథమిక స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. మాల్దీవులకు అనుకూల విధానాన్ని మాత్రమే తాము అనుసరిస్తున్నట్లు చెప్పాడు.. భారత్కు వెళ్లే ముందు చైనాను సందర్శించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
Read Also: Mohammed Siraj: రెండు ఇన్నింగ్స్ల్లో బౌలింగ్ చేస్తామని అనుకోలేదు: సిరాజ్
మేము ఏ దేశానికీ వ్యతిరేకంగా ఉండము అని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ తెలిపారు. మాల్దీవుల ప్రయోజనాలను రక్షించడంతో పాటు ప్రో-మాల్దీవుల విధానాన్ని మార్గనిర్దేశం చేసే సూత్రం అని ఆయన అన్నారు.. శాంతి, భద్రతను ప్రోత్సహించడానికి ప్రపంచ ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 77 మంది భారతీయ సైనికులు మాల్దీవులలో మోహరించారు. వీరిలో 24 మంది హెలికాప్టర్ల నిర్వహణకు, 25 మంది డోర్నియర్ విమానాల నిర్వహణకు, 26 మంది ఇతర హెలికాప్టర్ల నిర్వహణకు వినియోగించారు. వీరే కాకుండా మెయింటెనెన్స్ తో పాటు ఇంజినీరింగ్ కోసం మరో ఇద్దరు భారతీయ సైనికులు ఉన్నారు. సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముయిజ్జూ భారతీయ సైనికులను వెనక్కి పంపాలని ప్రకటించారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!