Maldives: మాల్దీవులు కీలక నిర్ణయం.. ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: మాల్దీవులు ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాలస్తీనాకు మద్దతుగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని సాకారం చేసేందుకు హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీప దేశం చట్టపరమైన సవరణలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలోకి రాకుండా ఆ దేశ మంత్రిమండలి ఆదివారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇజ్రాయెల్ పాస్ పోర్టు ఉన్న పౌరులను దేశంలోకి రాకుండా చేసేందుకు చట్ట సవరణ చేస్తామని ఆ దేశ హోం మంత్రి అన్నారు. ఈ క్రమంలోనే మాల్దీవులకు వెళ్లకుండా ఉండాలని ఇజ్రాయెల్ తన పౌరులకు కూడా సూచించింది.
Read Also: Pakistan Army: చరిత్ర సృష్టించిన క్రైస్తవ మహిళ.. పాక్ తొలి మహిళా బ్రిగేడియర్గా హెలెన్ మేరీ
Also Read
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
మాల్దీవుల హోం వ్యవహారాలు, సాంకేతిక మంత్రి అలీ ఇహ్సాన్ ఆదివారం మాల్దీవుల అధ్యక్షుడి కార్యాలయంలో ఈ విషయాన్ని ప్రకటించారు. క్యాబినెట్ సిఫారసు మేరకు ఇజ్రాయెల్ పాస్పోర్ట్ హోల్డర్లు దేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధించడాన్ని అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ఆమోదించినట్లు ఒక పత్రికా ప్రకటన తెలిపింది. పాలస్తీనియన్ల అవసరాలను అర్థం చేసుకోవడానికి ఒక ప్రత్యేక రాయబారిని నియమించాలని మహమ్మద్ ముయిజ్జు నిర్ణయించారు. పాలస్తీనా ప్రజలకు సహాయం చేసేందుకు నిధులను సేకరించే ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నారు. పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి సహాయ సంస్థ సహాయాన్ని తీసుకునే అవకాశం ఉంది. పాలస్తీనియన్లకు సంఘీభావం తెలిపేందుకు మాల్దీవులు ఈ చర్య తీసుకుంది.
Read Also: Stock Markets: ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రభావం.. ఆల్టైమ్ రికార్డు స్థాయికి స్టాక్ మార్కెట్లు
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో మాల్దీవుల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్లోకి ప్రవేశించి, 800 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులను చంపి, 240 మందిని బందీలుగా చేసుకుని కొన్ని గంటల్లోనే ఒక భయంకరమైన ఉగ్రవాద దాడి చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ సంఘటనకు ప్రతిస్పందనగా, ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్లోని గాజా స్ట్రిప్ ప్రాంతంలో భీకర యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 36 వేల మందికి పైగా మరణించారు. ప్రతి సంవత్సరం సుమారు 15 వేల మంది ఇజ్రాయెలీలు పర్యాటకులుగా మాల్దీవులకు వస్తారు. కానీ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా మాల్దీవులు తీసుకున్న ఈ చర్య తర్వాత, ఇజ్రాయెల్ సర్కారు కూడా తమ పౌరులను మాల్దీవులకు వెళ్లకుండా ఉండమని కోరింది.
తాజావార్తలు
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!