మణిరత్నం తెరకెక్కించిన కల్ట్ మల్టీస్టారర్ ఫిల్మ్ దళపతి. 1991లో రిలీజైన ఈ సినిమా రజనీకాంత్ ది బెస్ట్ మూవీల్లో టాప్ ఫైవ్ లిస్ట్లో కచ్చితంగా ఉంటుంది. ఇందులో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కూడా వన్ ఆఫ్ ది హీరో. సూర్య, దేవాలుగా తలైవా, మమ్మూక బెస్ట్ ఫెర్ఫామెన్స్ ఇచ్చారు. ఈ సినిమా వచ్చి 35 ఏళ్లు దాటిపోయింది. ఆ తర్వాత రజనీ- మమ్ముట్టి కలిసి నటించకపోయినా. ఇప్పుడు ఆయన మాజీ అల్లుడు ధనుష్తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఈ మాలీవుడ్ స్టార్ హీరో.
Also Read : TheParadise : నాని ‘ప్యారడైజ్’ రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ ఫిక్స్..
ధనుష్ అప్ కమింగ్ ఫిల్మ్లో మమ్ముట్టి భాగస్వామ్యం కాబోతున్నారు. ధనుష్ 55గా తెరకెక్కుతోన్న సినిమాలో స్టార్ హీరో ఉన్నట్లు కన్ఫర్మ్ చేశారు మేకర్స్. అమరన్ ఫేం రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడు. సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్గా నటిస్తున్న ఈ సినిమాకు సాయి అభ్యంకర్ బాణీలు సమకూరుస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నాడు పెరియ స్వామి. అయితే ధనుష్, మమ్ముట్టి కొలాబరేట్ కావడం ఇదే తొలిసారి కాదు.. గతంలో ఓ మూవీకి కలిసి వర్క్ చేశారు. 2013లో మమ్ముట్టి, దిలీప్ నటించిన కమ్మత్ అండ్ కమ్మత్ మలయాళ మూవీలో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చాడు ధనుష్. అందులో ఓ హోటల్ ప్రారంభోత్సవానికి హీరోగా హాజరవుతాడు ఈ కోలీవుడ్ స్టార్. అప్పటికీ రజనీ అల్లుడిగా కొనసాగడంతో మామయ్య ఫ్రెండ్ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేశాడు ధనుష్. ఈ మూవీతో ధనుష్ మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మళ్లీ 13 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మరీ దళపతి తలైవా కెరీర్లో బిగ్గెస్ట్ ఫిల్మ్గా మారగా.. ధనుష్ 55 కూడా అతడి కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా ఛేంజ్ అవుతుందా..? చూడాలి.