రేవంత్ రెడ్డి రీసర్చ్ చేసి మరీ దోపిడీ చేస్తున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఇవాళ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అబద్దాల పునాదుల మీద, రాష్ర్ట ప్రజలని మోసం చేసి గద్దేనెక్కిండని, కడుపు కట్టుకుంటే 40 వేల కోట్లు బ్యాంక్ లకు కట్టొచ్చు అంటున్నావు.. ఎలా వస్తాయన్నారు. ఇప్పుడు RRR టాక్స్ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా అని, హైదరాబాద్ పరిసరాల్లో పర్మిషన్ లు ఆపి… ఇప్పుడు పర్మిషన్ లు ఇవ్వడానికి కారణమన్నారు మహేశ్వర్ రెడ్డి. 2022.. 23లో మూడు వేల ప్రాజెక్ట్ లకు పర్మిషన్ లు ఇచ్చారని, ప్రతి ఏడాది 120 కోట్ల చదరపు అడుగులు అనుమతులు ఇస్తున్నారని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ .. సెటిల్ మెంట్ ఇమేజ్ గా మారిందట.. రేవంత్ రెడ్డి చదరపు అడుగుకు వంద రూపాయలు అడుగుతున్నారు అట.. బిల్డర్లు అంత ఇవ్వలేము అంటే చివరికి 65 రూపాయలకు ఫిక్స్ చేసుకున్నారు అట అని ఆయన అన్నారు.
అంత క్యాష్ అండ్ క్యారీ బిల్లులు ఉండవని, వేల కోట్లు అవినీతి జరుగుతుందన్నారు. కేటీఆర్ కి ఇచ్చినట్టు ఫ్లాట్స్ ఇస్తామని అంటే డబ్బులే ఇవ్వాలని అంటున్నారు అట.. ఎన్నికల్లో విచ్చల విడిగా ఖర్చు పెట్టాలని చూస్తున్నారని, దోపిడీ కి రాష్ట్ర ఆదాయానికి సంబంధం ఏంటి రేవంత్ రెడ్డీ…(రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో వినిపించిన మహేశ్వర్ రెడ్డి).. రేవంత్ రెడ్డి దొరికిపోయాడు అని ఆయన అన్నారు. మరో రెండు మూడు రోజుల్లో మరో టాక్స్ బయట పెడతా అని, రిజర్వేషన్ ల పై రేవంత్ రెడ్డీ మూర్ఖత్వం తో మాట్లాడుతున్నారని, రిజర్వేషన్ లని బీజేపీ పెంచింది కానీ తగ్గించలేదన్నారు మహేశ్వర్ రెడ్డి.