Mahesh Kumar Goud: రాయలసీమను రతనాల సీఎం చేస్తా అన్నది కేసీఆర్ కాదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదక్ జిల్లా ఇందిరాగాంధీ ఖిల్లా అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు వెలగబెట్టింది ఏమీ లేదన్నారు. మెదక్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఉద్యమ నాయకుడని కేసీఆర్ ని గెలిపిస్తే అప్పుల కుప్ప చేసి తెలంగాణని దోచుకున్నారని విమర్శించారు. ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నారని ఆరోపించారు. కేసీఆర్ చేసిన అప్పును నెత్తిన పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మోస్తుందని.. అయినా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. బనకచర్ల విషయంలో సంతకం పెట్టి తప్పు చేసింది హరీష్ రావు అని ఆరోపించారు. ఆరడుగుల పెరిగిన హరీష్ రావుకి బుద్ధి లేదని తీవ్రంగా విమర్శించారు. స్వయంగా కేంద్ర మంత్రి, సీఎం చెప్పిన ఆయనకి నమ్మకం లేదన్నారు. అసెంబ్లీకి రండి అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడం లేదన్నారు. సీఎం రేవంత్ ఫామ్ హౌస్ కి వస్తా అంటే సమాధానం లేదని
చెప్పారు.
READ MORE: Viral Video: స్టేటస్ లేక పిచ్చా..? చాండిలియర్గా ఫెరారీ కార్ ఏంటి భయ్యా..!
Also Read
- Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
తెలంగాణ సీఎంగా ఉండి రాయలసీమను రతనాల సీఎం చేస్తా అన్నది కేసీఆర్ కాదా? అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. “బనకచర్ల విషయంలో కచ్చితంగా తెలంగాణ హక్కులు కాపాడుతాం. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉండదు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తాం. బీసీలపై కవిత మాట్లాడే మాటలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల గురించి చర్చించేటప్పుడు లిక్కర్ రాణి కవిత జైల్లో ఉన్నారు. ఐదేళ్లు మహిళ మంత్రులు లేకుండా బీఆర్ఎస్ క్యాబినెట్ నడిచింది. ఇప్పుడు కవిత మాటలు చూస్తే నవ్వాలా..? ఏడ్వాలా..? అర్థం కావట్లేదు. మతం పేరుతో రాజకీయాలు చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రధాని మోడీ హామీకి ఇప్పటి వరకు 23 వేల కోట్ల ఉద్యోగాలు రావాలి కానీ ఇవ్వలేదు. ఉద్యోగాల మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు తీసేసి కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారు. బీజేపీకి రాముడికి అసలు సంబంధం లేదు. దేవుళ్ళ పేర్లు చెప్పి ఓట్లు అడగడం తప్ప బిజెపి ఏమి చేసిందో చెప్పాలి. సీఎం హోదాలో ఏనాడైనా కేసీఆర్ ఏడు పాయలకి వచ్చారా..? సీఎం రేవంత్ వచ్చి నిధులు కూడా మంజూరు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ దే.” అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?