Mahesh Kumar Goud: రాయలసీమను రతనాల సీఎం చేస్తా అన్నది కేసీఆర్ కాదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదక్ జిల్లా ఇందిరాగాంధీ ఖిల్లా అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు వెలగబెట్టింది ఏమీ లేదన్నారు. మెదక్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఉద్యమ నాయకుడని కేసీఆర్ ని గెలిపిస్తే అప్పుల కుప్ప చేసి తెలంగాణని దోచుకున్నారని విమర్శించారు. ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేసీఆర్ ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నారని ఆరోపించారు. కేసీఆర్ చేసిన అప్పును నెత్తిన పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మోస్తుందని.. అయినా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. బనకచర్ల విషయంలో సంతకం పెట్టి తప్పు చేసింది హరీష్ రావు అని ఆరోపించారు. ఆరడుగుల పెరిగిన హరీష్ రావుకి బుద్ధి లేదని తీవ్రంగా విమర్శించారు. స్వయంగా కేంద్ర మంత్రి, సీఎం చెప్పిన ఆయనకి నమ్మకం లేదన్నారు. అసెంబ్లీకి రండి అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడం లేదన్నారు. సీఎం రేవంత్ ఫామ్ హౌస్ కి వస్తా అంటే సమాధానం లేదని
చెప్పారు.
READ MORE: Viral Video: స్టేటస్ లేక పిచ్చా..? చాండిలియర్గా ఫెరారీ కార్ ఏంటి భయ్యా..!
Also Read
- Sai Krishna: సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. దర్యాప్తులో సంచలన విషయాలు బట్టబయలు..
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- FIFA World Cup 2026లో గోల్స్ జోరు.. 33 మ్యాచ్ల్లోనే 100 గోల్స్ నమోదు.!
- Vaibhav Sooryavanshi: వరల్డ్ రికార్డు బద్దలుగొట్టిన "బేబీ బాస్" వైభవ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా..
తెలంగాణ సీఎంగా ఉండి రాయలసీమను రతనాల సీఎం చేస్తా అన్నది కేసీఆర్ కాదా? అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. “బనకచర్ల విషయంలో కచ్చితంగా తెలంగాణ హక్కులు కాపాడుతాం. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉండదు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తాం. బీసీలపై కవిత మాట్లాడే మాటలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల గురించి చర్చించేటప్పుడు లిక్కర్ రాణి కవిత జైల్లో ఉన్నారు. ఐదేళ్లు మహిళ మంత్రులు లేకుండా బీఆర్ఎస్ క్యాబినెట్ నడిచింది. ఇప్పుడు కవిత మాటలు చూస్తే నవ్వాలా..? ఏడ్వాలా..? అర్థం కావట్లేదు. మతం పేరుతో రాజకీయాలు చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రధాని మోడీ హామీకి ఇప్పటి వరకు 23 వేల కోట్ల ఉద్యోగాలు రావాలి కానీ ఇవ్వలేదు. ఉద్యోగాల మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు తీసేసి కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారు. బీజేపీకి రాముడికి అసలు సంబంధం లేదు. దేవుళ్ళ పేర్లు చెప్పి ఓట్లు అడగడం తప్ప బిజెపి ఏమి చేసిందో చెప్పాలి. సీఎం హోదాలో ఏనాడైనా కేసీఆర్ ఏడు పాయలకి వచ్చారా..? సీఎం రేవంత్ వచ్చి నిధులు కూడా మంజూరు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ దే.” అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
ToxicTheMovie : వాయిదాల పర్వం ముగిసింది.. టాక్సిక్ రిలీజ్ డేట్ వచ్చింది
-
Motorola Edge 70 Fusion: 7000mAh బ్యాటరీ, 512GB స్టోరేజ్తో.. మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ కొత్త వేరియంట్ విడుదల
-
Sai Krishna: సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. దర్యాప్తులో సంచలన విషయాలు బట్టబయలు..
-
Vaibhav Suryavanshi: నెల రోజుల్లో 4సార్లు..మరో సచిన్లా మారుతున్న వైభవ్..ఈ లెక్కలే సాక్ష్యం !
-
Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!