Mahesh Kumar Goud: బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు పోటీ లేదు!
- టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
- బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు
- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు పోటీ లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పార్టీ స్థాపించినా, పాదయాత్ర చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టే పాదయాత్రను తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ ప్రతి రాజకీయ కార్యక్రమాన్ని ఆదరిస్తామన్నారు. బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు పోటీ లేదు అని మహేష్ కుమార్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చినా, కొత్త పేర్లతో వచ్చినా వచ్చే ఎన్నికల్లో అధికారం మాత్రం కాంగ్రెస్దే అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేసినా ప్రజలు తమ వెంటనే ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమకు గట్టి పోటీదారులే లేరన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ కాలంలో రాష్ట్రంలో విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయని, ముఖ్యంగా సింగరేణిలో జరిగిన ఒప్పందాలు అన్నీ గత ప్రభుత్వ కాలంలోనే జరిగాయని పేర్కొన్నారు. సింగరేణిలో జరిగిన అవినీతిని కార్మికులు ఎప్పటికీ మరిచిపోరని మహేష్ గౌడ్ చెప్పుకొచ్చారు.
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
Also Read: SRH vs RR: బుమ్రా, భువీ, హేజిల్వుడ్ వల్లే కాలేదు.. ఈరోజు బుడ్డోడిని ఉప్పల్ స్టేడియంలో ఆపేదెవరు!
బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో మళ్లీ పునరుజ్జీవం పొందే అవకాశం లేదని టీపీసీసీ చీఫ్ అన్నారు. కల్వకుంట్ల కవితకు ఫండింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. పోచారం చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని, కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండటం సహజమని తెలిపారు. పోచారం పెద్ద మనసుతో పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రతినెలా సుమారు 7 వేల కోట్ల రూపాయల అప్పులు కాంగ్రెస్ చెల్లిస్తోందని, అయినప్పటికీ ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
- Tags
- BRS
- congress
- Congress Vs Brs
- Kavitha
- ktr
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?