Mahesh Kumar Goud: బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు పోటీ లేదు!
- టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
- బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు
- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు పోటీ లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పార్టీ స్థాపించినా, పాదయాత్ర చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టే పాదయాత్రను తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ ప్రతి రాజకీయ కార్యక్రమాన్ని ఆదరిస్తామన్నారు. బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు పోటీ లేదు అని మహేష్ కుమార్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చినా, కొత్త పేర్లతో వచ్చినా వచ్చే ఎన్నికల్లో అధికారం మాత్రం కాంగ్రెస్దే అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేసినా ప్రజలు తమ వెంటనే ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమకు గట్టి పోటీదారులే లేరన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ కాలంలో రాష్ట్రంలో విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయని, ముఖ్యంగా సింగరేణిలో జరిగిన ఒప్పందాలు అన్నీ గత ప్రభుత్వ కాలంలోనే జరిగాయని పేర్కొన్నారు. సింగరేణిలో జరిగిన అవినీతిని కార్మికులు ఎప్పటికీ మరిచిపోరని మహేష్ గౌడ్ చెప్పుకొచ్చారు.
Also Read
- Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
- YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
Also Read: SRH vs RR: బుమ్రా, భువీ, హేజిల్వుడ్ వల్లే కాలేదు.. ఈరోజు బుడ్డోడిని ఉప్పల్ స్టేడియంలో ఆపేదెవరు!
బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో మళ్లీ పునరుజ్జీవం పొందే అవకాశం లేదని టీపీసీసీ చీఫ్ అన్నారు. కల్వకుంట్ల కవితకు ఫండింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. పోచారం చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని, కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండటం సహజమని తెలిపారు. పోచారం పెద్ద మనసుతో పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రతినెలా సుమారు 7 వేల కోట్ల రూపాయల అప్పులు కాంగ్రెస్ చెల్లిస్తోందని, అయినప్పటికీ ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
- Tags
- BRS
- congress
- Congress Vs Brs
- Kavitha
- ktr
తాజావార్తలు
-
Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
-
FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
-
Neha Dhupia: ‘ఇదంతా వెంటనే ఆపండి’.. బ్యాక్ షాట్ ఫోటోలపై మండిపడ్డ నేహా ధూపియా..
-
YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?