Gandhi: దేశ విభజన తర్వాత.. మహాత్మా గాంధీ పాకిస్థాన్లో నివసించాలనుకున్నారా..? ఆశ్చర్యపరిచే నిజం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahatma Gandhi: ఈ రోజు అక్టోబర్ 2వ. మహాత్మా గాంధీ 156వ జయంతి. భారతదేశ స్వాతంత్ర్యాన్ని సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1947 ఆగస్టు 15వ తేదీ రాత్రి మన దేశం స్వాతంత్ర్యం పొందినప్పటికీ.. ఇస్లాం పేరుతో మన దేశం విభజించబడింది. పాకిస్థాన్ అనే కొత్త దేశం ఆవిర్భవించింది. విభజనకు మహాత్మా గాంధీ కారణమని చాలామంది నమ్ముతారు. ముస్లింలను సంతృప్తి పరచడానికి జిన్నా డిమాండ్లకు గాంధీ అంగీకరించారని రాడికల్ రైట్-వింగర్లు నమ్ముతారు.
READ MORE: Medha Gandhi: మహాత్మా గాంధీ ముని మనవరాలు పెద్ద యాక్టర్ అని మీకు తెలుసా..?
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
అయితే.. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ స్వయంగా పాకిస్తాన్కు వెళ్లాలని అనుకున్నారు. స్వాతంత్ర్యం తర్వాత గాంధీ మన పొరుగు దేశంలో స్థిరపడాలని కోరుకున్నారట. అయితే, ఆయన కోరిక వెనుక అనేక కారణాలు ఉన్నాయి. మాజీ కేంద్ర మంత్రి ఎం.జె. అక్బర్ రాసిన “గాంధీస్ హిందూయిజం: ది స్ట్రగుల్ ఎగైనెస్ట్ జిన్నాస్ ఇస్లాం” అనే పుస్తకం ప్రకారం.. మహాత్మా గాంధీ 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన మొదటి రోజును పాకిస్థాన్లో గడపాలని కోరుకున్నారని పేర్కొన్నారు. అయితే.. అప్పటి నాయకులు మహాత్మా గాంధీ పాకిస్థాన్ పర్యటన ప్రకటనలను పట్టించుకోలేదట.
READ MORE: MP: దుర్గామాత నిమజ్జనోత్సవంలో విషాదం.. 11 మంది భక్తుల మృతి
మహాత్మా గాంధీ పాకిస్థాన్ కు ఎందుకు వెళ్లాలనుకున్నారో తెలుసుకుందాం.. MJ అక్బర్ పుస్తకం ప్రకారం.. స్వాతంత్ర్యం తర్వాత మహాత్మా గాంధీ రెండు దేశాలలోని మైనారిటీల గురించి ఆందోళన చెందారు. పాకిస్థాన్ లో హిందువులు, భారత్లో ముస్లింలు మైనార్టీలు. గాంధీ హింస ప్రభావిత ప్రాంతాలను సందర్శించాలని భావించారు. 1946 అల్లర్లలో హిందువులు అత్యంత ప్రభావితమైన తూర్పు పాకిస్థాన్ లోని నోఖాలిలో నివసించాలని గాంధీ కోరుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి గాంధీ అక్కడికి వెళ్లాలని కోరుకున్నారు. 1947 మే 31న, గాంధీ పఠాన్ నాయకుడు అబ్దుల్ గఫార్ ఖాన్ (ఫ్రాంటియర్ గాంధీగా ప్రసిద్ధి చెందారు) తో తాను స్వాతంత్ర్యం తర్వాత పశ్చిమ సరిహద్దును సందర్శించి పాకిస్థాన్ లో స్థిరపడాలని కోరుకుంటున్నానని చెప్పారని పుస్తకంలో ఉంది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!