MP: దుర్గామాత నిమజ్జనోత్సవంలో విషాదం.. 11 మంది భక్తుల మృతి
- దుర్గామాత నిమజ్జనోత్సవంలో విషాదం
- 11 మంది భక్తుల మృతి
- మధ్యప్రదేశ్లోని ఖాండ్వాలో ఘటన
మధ్యప్రదేశ్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఖాండ్వాలో తీవ్ర విషాదం నెలకొంది. దుర్గామాత నిమజ్జనోత్సవంలో అపశృతి జరిగింది. దుర్గమ్మ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ట్రాక్టర్ చెరువులో పడి పోయింది. దీంతో 11 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Delhi Baba Horror: అమ్మాయి నచ్చితే ప్రత్యేక గది.. ఖరీదైన సెల్ఫోన్లు.. వెలుగులోకి ఢిల్లీ బాబా దురాగతాలు
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
ట్రాక్టర్ అబ్నా నదిలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. 14 మంది మునిగిపోయి ఉంటారని భావిస్తున్నారు. స్థానిక గ్రామస్తుల సహాయంతో అధికారులు ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పాంధాన పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జమాలి సమీపంలోని సంఘటనాస్థలిలో జిల్లా పరిపాలన బృందాలు చురుకుగా పనిచేస్తున్నాయి. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (గ్రామీణ) అభిషేక్ రంజన్ మాట్లాడుతూ, 12 ఏళ్ల బాలుడు అనుకోకుండా ట్రాక్టర్ ఇగ్నిషన్ కీని తిప్పాడని.. దీంతో ట్రాక్టర్ స్టార్ట్ అయి ముందుకు కదిలిందని చెప్పారు. విగ్రహాలతో నిండిన ట్రాలీ వంతెనపై నుంచి నదిలోకి జారిపోయిందని పేర్కొన్నారు. ట్రాక్టర్లో ఉన్నవారంతా మునిగిపోయారని చెప్పారు.
మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
VIDEO | Madhya Pradesh: At least nine devotees died after a tractor-trolley carrying idols of Goddess Durga for immersion on Vijayadashmi plunged into a lake in Khandwa district.#Khandwa #DurgaPuja2025
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/ipqVplGJus
— Press Trust of India (@PTI_News) October 2, 2025
#WATCH | Madhya Pradesh | Search and rescue operation underway in the Jamli village of Khandwa, where an accident occurred during the Durga immersion ceremony. MP CM Mohan Yadav has announced Rs 4 lakh each as compensation to the next of kin of the deceased. https://t.co/5KeYyNwsIL pic.twitter.com/4qFDF2ZQB6
— ANI (@ANI) October 2, 2025
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!