MP: దుర్గామాత నిమజ్జనోత్సవంలో విషాదం.. 11 మంది భక్తుల మృతి
- దుర్గామాత నిమజ్జనోత్సవంలో విషాదం
- 11 మంది భక్తుల మృతి
- మధ్యప్రదేశ్లోని ఖాండ్వాలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఖాండ్వాలో తీవ్ర విషాదం నెలకొంది. దుర్గామాత నిమజ్జనోత్సవంలో అపశృతి జరిగింది. దుర్గమ్మ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ట్రాక్టర్ చెరువులో పడి పోయింది. దీంతో 11 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Delhi Baba Horror: అమ్మాయి నచ్చితే ప్రత్యేక గది.. ఖరీదైన సెల్ఫోన్లు.. వెలుగులోకి ఢిల్లీ బాబా దురాగతాలు
Also Read
ట్రాక్టర్ అబ్నా నదిలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. 14 మంది మునిగిపోయి ఉంటారని భావిస్తున్నారు. స్థానిక గ్రామస్తుల సహాయంతో అధికారులు ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పాంధాన పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జమాలి సమీపంలోని సంఘటనాస్థలిలో జిల్లా పరిపాలన బృందాలు చురుకుగా పనిచేస్తున్నాయి. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (గ్రామీణ) అభిషేక్ రంజన్ మాట్లాడుతూ, 12 ఏళ్ల బాలుడు అనుకోకుండా ట్రాక్టర్ ఇగ్నిషన్ కీని తిప్పాడని.. దీంతో ట్రాక్టర్ స్టార్ట్ అయి ముందుకు కదిలిందని చెప్పారు. విగ్రహాలతో నిండిన ట్రాలీ వంతెనపై నుంచి నదిలోకి జారిపోయిందని పేర్కొన్నారు. ట్రాక్టర్లో ఉన్నవారంతా మునిగిపోయారని చెప్పారు.
మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
VIDEO | Madhya Pradesh: At least nine devotees died after a tractor-trolley carrying idols of Goddess Durga for immersion on Vijayadashmi plunged into a lake in Khandwa district.#Khandwa #DurgaPuja2025
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/ipqVplGJus
— Press Trust of India (@PTI_News) October 2, 2025
#WATCH | Madhya Pradesh | Search and rescue operation underway in the Jamli village of Khandwa, where an accident occurred during the Durga immersion ceremony. MP CM Mohan Yadav has announced Rs 4 lakh each as compensation to the next of kin of the deceased. https://t.co/5KeYyNwsIL pic.twitter.com/4qFDF2ZQB6
— ANI (@ANI) October 2, 2025
తాజావార్తలు
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
-
Raviteja : ఇరుముడి కోసం ‘విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు’.. రీమిక్స్ ఫిక్స్
-
Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
-
Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!