Maharastra: బావిలో పడిన పిల్లిని కాపాడబోయి ఐదుగురు మృత్యువాత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా వాకాడి గ్రామంలో ఒక రైతు బయోగ్యాస్ స్లర్రీని పడేసిన పాడుబడిన బావిలో దూకి ఒకే కుటుంబానికి చెందిన 5 మంది మరణించారు. బబ్లూ కాలే, అనిల్ కాలే, మానిక్ కాలే, సందీప్ కాలే, విజయ్ కాలే, బాబాసాహెద్ గైక్వాడ్ అనే ఐదుగురు వ్యక్తులు పిల్లి ప్రాణాలను కాపాడేందుకు ఒకరి వెనుక ఒకరు బావిలోకి దూకారు. అందిన సమాచారం మేరకు.. మంగళవారం సాయంత్రం 5 గంటలకు పడిపోయిన పిల్లిని వెలికితీసేందుకు వారిలో ఒకరు లోపలికి వెళ్ళిన తరువాత బాధితులు ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో బావిలోకి ప్రవేశించారు.
Also read: Rathnam: ‘చెబుతావా’ అంటున్న ప్రియా భవాని శంకర్…దేవిశ్రీ ప్రసాద్ మెలోడీ భలే ఉంది బాసూ!
Also Read
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బబ్లూ కాలే (23) మొదట పిల్లిని కాపాడేందుకు బావిలో దిగాడు. అయితే., అతని బంధువులు అతను మునిగిపోయి ప్రాణాలతో పోరాడుతున్నట్లు చూశారు. అప్పుడు ఒకరు పొరుగువారితో సహా అతని బంధువులందరూ ఒకరినొకరు రక్షించుకోవడానికి ఒకరి తర్వాత ఒకరు బావిలోకి దూకారు. పాడుబడిన బావిలో కాలే కుటుంబ సభ్యులు బయటికి రావడానికి పోరాడుతుండగా.. గ్రామస్థులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు . వెంటనే గొయ్యిలో నుంచి ప్రజలను బయటకు తీసేందుకు కదిలారు. అయితే, వారు ఇప్పుడు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన విజయ్ కాలే (35)ని మాత్రమే రక్షించగలిగారు.
Also read: Komatireddy Rajgopal Reddy : భువనగిరిలో బీఆర్ఎస్ లేదు.. బీజేపీతోనే మాకు పోటీ
ఈ కేసుపై సిఐ ధనంజయ్ జాదవ్ స్పందిస్తూ.. మిగిలిన మృతదేహాలను బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో తొలగించినట్లు తెలిపారు. “బావిలో నుండి త్వరగా బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబడిన బాధితులలో ఒకరైన విజయ్ మాణిక్ కాలే (35) మాత్రమే ప్రస్తుతం కోలుకుంటున్నట్లు” అని జాదవ్ తెలిపారు. బావిలో పడిన పిల్లిని రక్షించేందుకు వెళ్లి మృతి చెందిన ఐదుగురు వ్యక్తులను మాణిక్ కాలే (65), మాణిక్ కుమారుడు సందీప్ (36), అనిల్ కాలే (53), అనిల్ కుమారుడు బబ్లూ (28), బాబాసాహెబ్ గైక్వాడ్ (36)లుగా గుర్తించారు అధికారులు. మృతదేహాలను బుధవారం తెల్లవారుజామున బయటకు తీశారు.
తాజావార్తలు
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!